Kurnool

News July 4, 2024

కర్నూలు, నంద్యాల జిల్లాలకు వర్ష సూచన

image

ఉమ్మడి కర్నూల్ జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గుజరాత్-కర్ణాటక తీరాల వెంబడి విస్తరించిన ద్రోణి కారణంగా శుక్రవారం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ మేరకు ప్రజలు, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

News July 4, 2024

ప్రభుత్వ టీచర్‌పై టీడీపీ నేత దుర్భాషలు: వైసీపీ

image

నంద్యాల జిల్లాలో ప్రభుత్వ టీచర్‌పై టీడీపీ నేత దుర్భాషలాడారని వైసీపీ విమర్శించింది. ‘కొలిమిగుండ్ల మండలంలో రేషన్ బియ్యాన్ని ప్రభుత్వ పాఠశాల గదుల్లో పెట్టొద్దని టీచర్ చెప్పారు. దీంతో టీడీపీ నేత విజయ్ భాస్కర్ రెడ్డి ఉపాధ్యాయుడిపై నోటికి వచ్చినట్లు తిట్టాడు. తిట్లకు టీచర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. గురువులను గౌరవించే విధానం ఇదేనా?’ అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను ప్రశ్నిస్తూ పోస్ట్ పెట్టింది.

News July 4, 2024

కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన మంత్రి బీసీ

image

రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. నిన్న సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఢిల్లీ వెళ్లిన ఆయన వివిధ శాఖల మంత్రులను కలుస్తున్నారు. ఇవాళ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎంతో పాటు మంత్రి బీసీ కలిశారు. అనంతపురం-అమరావతి, హైదరాబాద్-అమరావతి హైవేలు, పెండింగ్‍ హైవేల నిర్మాణాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. పలు విషయాలపై వినతి పత్రం ఇచ్చినట్లు సమాచారం.

News July 4, 2024

కర్నూలు జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ ప్రారంభం

image

నీట్, యూజీసీ నెట్ పరీక్షల పేపర్ల లీక్‌ను నిరసిస్తూ నేడు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ జిల్లావ్యాప్తంగా ప్రారంభమైంది. గురువారం కర్నూలులోని ఇందిరా గాంధీ స్మారక మున్సిపల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొని విద్యార్థులను ఇంటికి పంపించారు. నీట్, నెట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలు, పేపర్ లీకేజీపై సిట్టింగ్ సుప్రీం కోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

News July 4, 2024

కర్నూలు: తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్లకు ఇంక్రిమెంట్ల తొలగింపు

image

కృష్ణా జిల్లా పరిధిలోని గన్నవరం తహసీల్దార్ ఎం.మాధూరి, సబ్ రిజిస్ట్రార్ బీ.సాయి కృష్ణారెడ్డికి రెండు ఇంక్రిమెంట్లు తొలగించినట్లు లోకాయుక్త రిజిస్ట్రార్ వెంకటేశ్వరరెడ్డి బుధవారం తెలిపారు. వెబ్‌ల్యాండ్ దస్త్రాల్లో అవకతవకలు జరిగినట్లు తమ విచారణలో వెల్లడైందన్నారు. ఈ విషయంపై ప్రభుత్వానికి నివేదించగా తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్‌కు రెండు ఇంక్రిమెంట్లు తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసిందన్నారు.

News July 4, 2024

కర్నూలు: నేటి నుంచి ‘స్కౌట్స్ అండ్ గైడ్స్’ దరఖాస్తుల ఆహ్వానం

image

కర్నూలు జిల్లాలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ పాత యూనిట్ల పునరుద్ధరణ, కొత్త యూనిట్ల నమోదుకు నేటి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ శామ్యూల్ తెలిపారు. 8వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఇందుకు రిజస్ట్రేషన్ క్లడ్/బుల్బులకు రూ.211, స్కాట్స్ అండ్ గైడ్స్‌కు రూ.381, రివర్స్ అండ్ రేంజర్స్‌కు రూ.301 ప్రకారం ఫీజు చెల్లించి ప్రతి స్కూల్ యాజమాన్యం రసీదు పొందాలన్నారు.

News July 4, 2024

5న ఆదోని మార్కెట్ యార్డుకు సెలవు

image

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు 5వ తేదీన సెలవు ప్రకటించినట్లు యార్డు అధికారులు బుధవారం తెలిపారు. అమావాస్య సందర్భంగా పంట దిగుబడుల క్రయవిక్రయాలు జరగవన్నారు. మార్కెట్ యార్డులో తిరిగి శనివారం యథావిధిగా వ్యాపారాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. రైతులు, వ్యాపారులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.

News July 4, 2024

నేటి నుంచి సంపూర్ణ అభియాన్: కలెక్టర్

image

అత్యంత వెనుకబడిన మండలాలైన హోళగుందలో గురువారం, మద్దికెరలో 5న, చిప్పగిరిలో 6న సంపూర్ణ అభియాన్ సభలు నిర్వహించాలని కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. 30 అంశాలను సాచురేషన్ పద్ధతిలో 100 శాతం తీసుకొని వెళ్లాలన్నదే భారత ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజలకు అవగాహన కల్పించే విధంగా విద్యార్థులతో 6 అంశాలకు సంబంధించిన ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించాలని ఎంపీడీవోలను ఆదేశించారు.

News July 4, 2024

కర్నూలు: నేడు విద్యాసంస్థల బంద్.. పోలీసుల అప్రమత్తం

image

విద్యార్థి సంఘాలు నేడు విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో కర్నూలు జిల్లా పోలీస్ పోలీసు శాఖ అప్రమత్తమైంది. కేంద్రం నిర్వహించే పలు పరీక్షలు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని, ఇతరత్రా డిమాండ్లతో SFI, AISF, PDSEU, AISA, NSUI, PDSU సంఘాలు ఉమ్మడిగా బంద్ చేపట్టనున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసు అధికారులు వారి పోలీస్ స్టేషన్ల పరిధిలో పాఠశాలల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

News July 4, 2024

కర్నూలు: కూటమిలో కలిసేందుకు వైసీపీ నేతల కసరత్తు

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూటమి పార్టీల్లో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. YCP పాలనలో చేసిన పనులకు బిల్లులు రాక, అవినీతి ఆరోపణలు ఎదుర్కొటున్న నేతలు కండువా మార్చే ప్రయత్నంలో ఉన్నారు. అయితే అలాంటి వారిని చేర్చుకోవద్దని స్థానిక నాయకులు తమ నేతలకు తెగేసి చెబుతున్నట్లు సమాచారం. కాగా కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ పురపాలికల్లో ఇప్పటికే పలువురు పార్టీ మారారు.