India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పగిడ్యాల మండలం నెహ్రూ నగర్ గ్రామానికి చెందిన జామున కైరన్ బీ(26) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. పుట్టింటికి పంపలేదని అత్తింటి వేధింపులతో తాళలేక మనస్తాపంతో వేకువజామున ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
అవుకు మండల పరిధిలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, ఎర్రమల కొండలనుంచి పారే జక్కలేరు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొండల మధ్య నుంచి పారుతున్న జక్కలేరు వంక జలపాతాలు పకృతి అందాలు ఊటీని తలపిస్తూ పర్యాటకులకు కన్నుల పండుగగా కనిపిస్తుంది. అటు వర్షపు నీటి కారణంగా రిజర్వాయర్లో నీటి శాతం పెరిగి వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ విజయకేతనం ఎగరవేసింది. 2014లో ముగ్గురు ఎమ్మెల్యేలకు పరిమితమైన టీడీపీ ఈ ఎన్నికల్లో 11 స్థానాల్లో గెలుపొందారు. జిల్లాలోని పాణ్యం, ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరులో 25 ఏళ్ల తర్వాత మెుదటిసారి టీడీపీ గెలుపొందింది. కాగా కోడుమూరులో 39 ఏళ్ల తర్వాత మెుదటిసారి టీడీపీ జెండా ఎగరవేసింది.
తండ్రీకుమారులు టీజీ వెంకటేశ్, టీజీ భరత్ ఇద్దరూ టీడీపీతోనే రాజకీయ రంగప్రవేశం చేసి విజయం సాధించారు. టీజీ వెంకటేశ్ కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా1999లో రాజకీయ ప్రవేశం చేసి గెలుపొందారు. ఆయన కుమారుడు టీజీ భరత్ 2019లో టీడీపీ నుంచి రాజకీయ ప్రవేశం చేసి ఎన్నికల్లో ఓడిపోయారు. కాగా 2024లో వైసీపీ అభ్యర్థి ఏఎండీ ఇంతియాజ్పై 18876 ఓట్ల మెజారీటీతో గెలుపొందారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలోనే కర్నూలు అసెంబ్లీ స్థానంలో ‘నోటా’(పై వారెవరూ కాదు)కు తక్కువ ఓట్లు పోలయ్యాయి. రాష్ట్రంలోనే అత్యల్పంగా నోటా ఓట్లు పోలైన స్థానాల్లో కేవలం 718 ఓట్లతో కర్నూలు అసెంబ్లీ రెండో స్థానంలో నిలిచింది. కాగా విశాఖ దక్షిణం 631 ఓట్లతో మెుదటి స్థానంలో ఉంది.
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు ఇన్ ఫ్లో గురువారం పెరుగుతోంది. బుధవారం ఇన్ ఫ్లో 517 క్యూసెక్కులు ఉండగా గురువారం 1,670 క్యూసెక్కులకు పెరిగింది. ప్రస్తుతం డ్యాంలో 3.706 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అందులో 10 క్యూసెక్కులు (అవుట్లో ) రాయబసవన కెనాల్కు వదులుతున్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. గతేడాది ఇదే సమయానికి 5.029 టీఎంసీల నీరు నిల్వ ఉండేదని తెలిపారు.
ఆలూరు నియోజకవర్గ పరిధి లోని తుంగభద్ర జలాశయంలో పూర్తిస్థాయిలో నీరు అడుగంటింది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 105.788 టీఎంసీలు కాగా.. 3.373 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. జలాశయంలో పూర్తిస్థాయి నీటి మట్టం 1,633.00 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,577. 49 అడుగులు ఉన్నాయి. తుంగభద్ర డ్యాం కు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నీరు రోజురోజుకు పెరుగుతుంది.
ఎమ్మిగనూరు మండలం బోడబండ గ్రామంలో యువ రైతు వడ్డే బజారి (32) అప్పుల బాధ తాళలేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన బళ్లారి ఆస్పత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు కుమారుడు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు గురువారం మహానంది ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామివారిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు. అనంతరం వేద పండితులు ఆయనకు స్వామివారి ప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టిడిపి విజయకేతనం ఎగురవేసింది అని హర్షం వ్యక్తం చేశారు.
కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లి గ్రామంలో గురువారం దారుణం జరిగింది. గ్రామానికి చెందిన వడ్డె నాగేంద్ర (40) అనే వ్యక్తిని కొందరు దారుణంగా హత్య చేశారు. ఈ సమాచారం అందుకున్న కొలిమిగుండ్ల పోలీసుల ఘటనా స్థలానికి వెళ్లి హత్యకు గల కారణాలను పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.