India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర వ్యాప్తంగా గతేడాది డిసెంబర్ 3వ తేదీన జరిగిన జాతీయ ఉపకార వేతన పరీక్ష(ఎన్ఎంఎంఎస్)కు సంబంధించిన ఫలితాలు విడుదలైనట్లు డీఈఓ కె.శామ్యూల్ తెలిపారు. ఫలితాలు www.bse.ao.gov.inలో తెలుసు కోవచ్చునని పేర్కొన్నారు. జాతీయ విద్యా మంత్రిత్వ శాఖ నియమాల ప్రకారం ఎంపికైన విద్యార్థులు వెంటనే బ్యాంకులో విద్యార్థి పేరున సేవింగ్స్ ఖాతా తీసుకుని తండ్రి/తల్లి జాయింట్ చేసుకోవాలని పేర్కొన్నారు.
కర్నూలు జిల్లాలో ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వజ్రాల వేట కోనసాగుతుంది. తుగ్గలి మండలం జొన్నగిరిలో ఇవాళ మరో వజ్రం దొరికింది. పత్తికొండకు చెందిన ఓ వ్యక్తి కి దొరికిన ఈ వజ్రాన్ని రూ.2లక్షల నగదు, 2 తులాల బంగారానికి విక్రయించినట్లు సమాచారం.
కేఈ కుటుంబం నుంచి మూడో తరం అసెంబ్లీలోకి అడుగుపెట్టింది. కేఈ కృష్ణమూర్తి కుమారుడు టీడీపీ అభ్యర్థి కేఈ శ్యాంబాబు వైసీపీ అభ్యర్థి కంగాటి శ్రీదేవిపై 14,211 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కేఈ మాదన్న 1967లో కర్నూలు నుంచి గెలుపొందగా.. ఆయన కుమారడు కేఈ కృష్ణమూర్తి డోన్ నుంచి 1978 నుంచి 1989 వరకు వరసగా నలుగుసార్లు గెలుపొందారు. అంతేకాకుండా ఆయన టీడీపీ ప్రభుత్వంలో నీటీపారుదలశాఖ మంత్రిగా పనిచేశారు.
ఏపీలో ఓ వెలుగు వెలిగిన కర్నూలు (D) కోడుమూరుకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూశారు. CM జగన్ ఆదేశాలతో YCPలో చేరి రాజకీయ అరంగ్రేటం చేసిన ఇంతియాజ్.. గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసినప్పటికీ ప్రజా ఆశీర్వాదం పొందలేకపోయారు. కాగా ఇంతియాజ్ IAS అధికారిగా ఉండి ఉంటే భవిష్యత్తులో కీలక హోదాల్లో పనిచేసేవారని విశ్లేషకులు భావిస్తున్నారు.
రాజీనామాలు చేసిన వాలంటీర్లను టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుందా, లేక కొత్తవారికి అవకాశం కల్పిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వాలంటీర్లు దాదాపు అందరూ రాజీనామా చేశారు. టీడీపీ వచ్చాక రూ.పదివేలు వేతనం ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో రూ.5 వేలతో బాధ్యతగా పనిచేస్తూనే రాజీనామా చేసిన వారిని తీసుకుంటారా లేక టీడీపీ నేతలు సిఫారసు మేరకు కొత్తవారికి అవకాశం ఇస్తారా అన్నది వేచి చూడాలి.
రాజీనామాలు చేసిన వాలంటీర్లను టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుందా, లేక కొత్తవారికి అవకాశం కల్పిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వాలంటీర్లు దాదాపు అందరూ రాజీనామా చేశారు. టీడీపీ వచ్చాక రూ.పదివేలు వేతనం ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో రూ.5 వేలతో బాధ్యతగా పనిచేస్తూనే రాజీనామా చేసిన వారిని తీసుకుంటారా లేక టీడీపీ నేతలు సిఫారసు మేరకు కొత్తవారికి అవకాశం ఇస్తారా అన్నది వేచి చూడాలి.
డోన్లో టీడీపీ నేత కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి విజయకేతనం ఎగురవేశారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ను 6 వేల ఓట్ల మెజార్టీతో ఓడించారు. మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడైన జయసూర్యప్రకాశ్ రెడ్డి గతంలో మూడుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర సహాయమంత్రిగానూ ఆయన పనిచేశారు. ఈ సీనియర్ లీడర్ తొలిసారి ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.
డోన్ నియోజకవర్గంలో ఒకే కుటుంబానికి చెందిన మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి 1982, డోన్ MLAగా, ఆయన కోడలు కోట్ల సుజాతమ్మ 2004, MLA గా గెలిచారు. ప్రస్తుతం కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు మాజీ కేంద్ర మంత్రి కోట్ల ప్రకాష్ రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికల్లో బుగ్గన పై భారీ మెజార్టీతో డోన్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఒకే నియోజకవర్గంలో నుంచి ఒకే కుటుంబంలో ముగ్గురినీ డోన్ ఆదరించింది.
ఎన్నికల విధుల్లో పోలీసు సహా అందరి కృషి అభినందనీయమని కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్ అభినందించారు. జిల్లాలో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధులు నిర్వహించిన పోలీసు అధికారుల సేవలు ఎనలేనివని ప్రశంసించారు. బుధవారం పోలీస్ ఆడిటోరియంలో విధులు నిర్వహించిన కేంద్ర, రాష్ట్ర పోలీసు సిబ్బందికి, మీడియాకు, అధికారులకు అభినందన సభ నిర్వహించారు.
ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో క్రియాశీలక నేత TDP నేతగా బీసీ జనార్దన్ రెడ్డి పేరొందారు. 2014-19 వరకు అప్పటి TDP ప్రభుత్వంలో ఆయన తొలిసారి బనగానపల్లె MLAగా గెలుపొందారు. 2019లో ఓటమిని చవిచూసిన ఆయన.. 2024లో అదే స్థానం నుంచి మరోసారి MLAగా గెలిచారు. దీంతో ఈసారి CM చంద్రబాబు కేబినెట్లో బీసీ జనార్దన్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని TDP శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.