Kurnool

News September 13, 2024

కర్నూలు జిల్లాలో రైలు మార్గం ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా?

image

కర్నూలు జిల్లాలో మొట్టమొదటి రైలు మార్గం 1870లో ప్రారంభమైంది. ముంబై, చెన్నైలను కలుపుతూ ఏర్పడిన రైలు మార్గం ఆదోని, ఆలూరు ప్రాంతాల మీదుగా 97 కి.మీ మేర ఉంటుంది. దీంతో ఎగుమతులు, దిగుమతులకు ఆదోని కేంద్రంగా మారింది. అందుకే ఈ ప్రాంతానికి రెండో బాంబేగా పేరు వచ్చిందట. 1909లో కర్నూలు-డోన్, 1930లో కర్నూల్- హైదరాబాద్‌కు రాకపోకలు ప్రారంభమయ్యాయి. 1921 SEP 29న జాతిపిత మహాత్మా గాంధీ రైలులోనే కర్నూలుకు వచ్చారు.

News September 13, 2024

మంత్రి బీసీ ఆధ్వర్యంలో 18న మెగా జాబ్ మేళా

image

మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 18న బనగానపల్లె డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మంత్రి సతీమణి బీసీ ఇందిరారెడ్డి వెల్లడించారు. ఈ జాబ్ మేళాకు 9 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారని తెలిపారు. 1,191 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. పది, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ చేసిన వారు అర్హులన్నారు.

News September 13, 2024

నగదు వసూలు చేస్తే చర్యలు: కలెక్టర్

image

ఆరోగ్య శ్రీ కింద పేషెంట్ల నుంచి నగదు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రంజిత్ బాషా ఆసుపత్రి యాజమాన్యాలను అదేశించారు. గురువారం ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఆరోగ్య శ్రీ కింద వస్తే ఉచితంగా చికిత్స ఇవ్వాలని, లేకపోతే అప్పుడు వారి నుంచి నగదు తీసుకునే ప్రక్రియను అన్ని ఆసుపత్రులు పాటించాలని అన్నారు.

News September 13, 2024

నంద్యాల: కుందూ నదిలో ఇద్దరు గల్లంతు

image

కోయిలకుంట్ల మండలం కలుగొట్ల సమీపంలోని కుందూ నదిలో గురువారం సాయంత్రం ఇద్దరు గల్లంతయ్యారు. గ్రామానికి చెందిన రామసుబ్బారెడ్డి జీవితంపై విరక్తి చెంది నదిలో దూకి గల్లంతయ్యాడు. ఇదే గ్రామానికి చెందిన బాలగురప్ప తన సమీప బంధువు కర్మకాండకు నది వద్దకు వచ్చి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. పోలీసులు గాలిస్తున్నారు.

News September 13, 2024

కర్నూలు జిల్లాలో విషాద ఘటనలు

image

కర్నూలు జిల్లాలో పలుచోట్ల గురువారం విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆదోని మండలం మదిరెకు చెందిన వైష్ణవ్ వెంకటేశ్(25) ఇస్వీ రైలు గేటు వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. హాలహర్వి మండలం చింతకుంటలో అశోక్(17) ఇంటిపై నుంచి కిందికి దిగుతుండగా విద్యుత్ తీగలు తగిలి గాయపడ్డాడు. బళ్లారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆదోనిలోని ఆలూరు రోడ్డులో ఆయిల్ ట్యాంకర్ ఢీకొని గిడ్డయ్య మృతిచెందాడు.

News September 13, 2024

పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలి: నంద్యాల కలెక్టర్

image

గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను మెరుగ్గా చేపట్టాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ కలెక్టర్లతో నిర్వహించిన వీసీలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లా, మండల, గ్రామ పంచాయితీ అధికారులు గ్రామాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల నుంచి ఫిర్యాదులు అందకుండా చూడాలన్నారు.

News September 13, 2024

శ్రీమఠంలో సినీ నటుడు లారెన్స్‌

image

శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్‌ రాఘవ లారెన్స్ గురువారం మంత్రాలయానికి వచ్చారు. ఆయనకు శ్రీ మఠం అధికారులు ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించారు. ముందుగా గ్రామదేవత శ్రీ మంచాలమ్మ దేవిని, గురు రాయల బృందావనాన్ని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ మఠం పీఠాధిపతులు ఫలమంత్రాక్షతలు ఇచ్చి ఆశీర్వదించారు.

News September 12, 2024

ఆవులగడ్డ నుంచి ఆళ్లగడ్డ!

image

ఆళ్లగడ్డను పూర్వం ‘ఆవులగడ్డ’ అని పిలిచేవారట. కాలక్రమేణా ఆ పేరు ఆళ్లగడ్డగా మారింది. శిల్పకళా రంగంలో ఆళ్లగడ్డ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇక్కడి శిల్పులకు కటిక రాతికి జీవకళ పోయడం ఉలితో పెట్టిన విద్య. స్థానిక దురుగడ్డ వంశీకులు 300 ఏళ్ల క్రితం శిల్పాల తయారీకి శ్రీకారం చుట్టగా నేటికీ ఇదే వృత్తిపై వందల మంది జీవిస్తున్నారు. ఆళ్లగడ్డలో తయారు చేసిన విగ్రహాలు ఇతర దేశాలకూ ఎగుమతి అవుతుంటాయి.

News September 12, 2024

వరద బాధితులకు రూ.11 లక్షల విరాళం

image

కర్నూలు: వరద బాధితుల సహాయార్థం రూ.11 లక్షలు అందజేశామని డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి తెలిపారు. విజయవాడలోని సచివాలయంలో మంత్రి నారా లోకేశ్‌‌ను ఎమ్మెల్సీ రామలింగారెడ్డితో కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన సుబ్బారెడ్డిని లోకేశ్ అభినందించారు. వరద బాధితులను ఆదుకోవడానికి మరింతమంది ముందుకు రావాలని కోరారు.

News September 12, 2024

నంద్యాల: కూతురుకి వింత వ్యాధి.. తల్లిదండ్రుల ఆవేదన

image

నంద్యాల జిల్లా జూపాడు బంగ్లాకు చెందిన నాగేశ్వరరావు, లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. పెద్ద కొడుకు రవికుమార్ గతేడాది జూలైలో విల్సన్ అనే వింత వ్యాధికి గురై, కాలేయంలో రాగి నిల్వలు పేరుకుపోయి పదేళ్ల వయసులో మరణించాడు. రెండో సంతానం అయిన విజయలక్ష్మికీ అదే వ్యాధి సోకింది. కుమార్తె కూడా తమకు దక్కదని, వైద్యం కోసం రూ.40 లక్షలు అవసరమని ఆవేదన చెందుతున్నారు.