Kurnool

News June 4, 2024

నంద్యాలలో ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్

image

నంద్యాలలో ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించినట్లు కలెక్టర్ శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి తెలిపారు. స్థానిక ఆర్జీఎం కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలకు అధికారులు చెప్పిన మేరకు ఏజెంట్లు తెల్లవారుజామున 6 గంటలకు చేరుకున్నారన్నారు. భారీ పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు.

News June 4, 2024

ఆలూరులో సీటు వైసీపీ ఖాతాలోకి..!

image

ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా వైసీపీ అభ్యర్థి బీ.విరుపాక్షి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్‌పై 2,831 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2వ రౌండ్, 9, 13, 14, 18, 19, 20, 21, 22 రౌండ్లు మినహా మిగిలిన రౌండ్లలో విరుపాక్షి ఆధిక్యం కనబర్చారు. విరుపాక్షికి మొత్తం 1,00,264 ఓట్లు పోలవ్వగా.. వీరభద్ర గౌడ్‌కు 97,433 ఓట్లు పడ్డాయి. ఈ విజయంతో ఆలూరు నియోజకవర్గ వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.

News June 4, 2024

భారీ మెజారిటీతో కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి గెలుపు

image

కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు భారీ మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి బీవై రామయ్యపై 1,02,822 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభమైన మొదటి రౌండ్ నుంచి ప్రతి రౌండ్‌లోనూ నాగరాజు ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు. ఈ విజయంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

News June 4, 2024

ఎమ్మిగనూరులో బీవీ జయనాగేశ్వర రెడ్డి ఘన విజయం

image

ఎమ్మిగనూరు నియోజకవర్గం ఓటర్ల మద్దతు టీడీపీకి లభించింది. మంగళవారం కర్నూలులోని రాయలసీమ యునివర్సిటీలో ఎమ్మిగనూరు అసెంబ్లీ ఓట్ల లెక్కింపు జరిగింది. ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డి అఖండ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకపై 14,816 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు.

News June 4, 2024

కర్నూలు: పిడుగు పడి విద్యార్థి మృతి

image

మద్దికేర మండల పరిధిలోని ఎం.అగ్రహారంలో చిన్న బసప్ప కుమారుడు రంజిత్ క్రికెట్ ఆడుతూ ఉండగా ఒక్కసారిగా పిడుగు పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో విద్యార్థి వీరేశ్ స్వల్పంగా గాయపడటంతో గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. మృతి చెందిన రంజిత్ ఇటీవల పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించాడు. విద్యార్థి మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

News June 4, 2024

ఆదోనిలో సాయిప్రసాద్ రెడ్డికి ఘోర పరాజయం

image

ఆదోని ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి వై.సాయిప్రసాద్ రెడ్డి పరాజయం పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి డాక్టర్ పార్థసారధి వాల్మీకి చేతిలో 18,563 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. పార్థసారథి గెలుపుతో బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

News June 4, 2024

కర్నూలులో టీజీ భరత్ ఘన విజయం

image

కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ఘన విషయం సాధించారు. వైసీపీ అభ్యర్థి ఏఎండీ ఇంతియాజ్‌పై 19,200 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వీటికి ఇంకా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలపాల్సి ఉండటంతో మెజారిటీ పెరగనుంది. భరత్‌కు 79,183, ఇంతియాజ్‌కు 58,449 ఓట్లు పోలయ్యాయి. దీంతో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

News June 4, 2024

కర్నూలు: నాలుగో సారి ఎమ్మెల్యేగా ఘన విజయం

image

మంత్రాలయం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డిపై 12,843 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. కాగా వరుసగా 2009లో టీడీపీ నుంచి, 2014, 2019, 2024లో వైసీపీ నుంచి గెలిచి రికార్డు సృష్టించారు.

News June 4, 2024

నంద్యాలలో ఫరూక్ గెలుపు

image

నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి శిల్పా రవి కిషోర్ రెడ్డిపై 11,950 మెజార్టీతో విజయం సాధించారు. ఫరూక్ గెలవడంతో టీడీపీ నేతలు, పార్టీ కార్యకర్తలు, అభ్యర్థి కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు. దీంతో నంద్యాల పట్టణం పసుపు మయంగా మారింది.

News June 4, 2024

కర్నూలు: 12 స్థానాల్లో టీడీపీ ముందంజ

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాలకు గాను 12 స్థానాల్లో TDP ముందంజలో కొనసాగుతోంది. 2 స్థానాల్లో (పత్తికొండ, ఆలూరు) మాత్రమే వైసీపీ ఆధిక్యంలో ఉంది. ఇందులో డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి 12,000 మెజార్టీతో కొనసాగుతున్నారు. శ్రీశైలం బుడ్డా, ఆళ్లగడ్డ అఖిలప్రియ, నంద్యాల ఫరూక్, కర్నూలు భరత్, నందికొట్కూరు జయసూర్య, ఎమ్మిగనూరు బీసీ జయనాగేశ్వర్ రావు, తదితర TDP అభ్యర్థులు ముందున్నారు.