Kurnool

News June 2, 2024

జూన్ 30 వరకు మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. శనివారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో జిల్లా మలేరియా అధికారి నూకరాజుతో కలిసి మలేరియా వ్యతిరేక మాసోత్సవ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ప్రజలందరూ దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News June 1, 2024

బిగ్‌టీవీ సర్వే.. కర్నూలు ఎవరికి ఎన్ని సీట్లు అంటే..?

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 సీట్లకు గాను NDA కూటమి 8-9 గెలుస్తుందని బిగ్‌టీవీ సర్వే తెలిపింది. 5-6 సీట్లు వైసీపీ సాధిస్తుందని అంచనా వేసింది. మొత్తంమీద 175 అసెంబ్లీ సీట్లకు గాను 106- 119 కూటమి, 56- 69 సీట్లు వైసీపీ విజయం సాధిస్తుందని వెల్లడించింది.

News June 1, 2024

కర్నూలు: ఎమ్మెల్యే సీట్లలో కూటమి.. ఎంపీ సీట్లలో వైసీపీ ఆధిపత్యం

image

పోస్ట్ పోల్ సర్వే ప్రకారం.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్డీఏ కూటమికి 7-9 సీట్లు, వైసీపీకి 5-7 ఎమ్మెల్యే సీట్లు రానున్నాయి. మరోపక్క చాణక్య ఎక్స్ సర్వే ప్రకారం.. కర్నూలు, నంద్యాల ఎంపీ స్థానాలను వైసీపీ (బీవై రామయ్య, పోచ బ్రహ్మానంద రెడ్డి) కైవసం చేసుకోనుందని అంచనా వేసింది.

News June 1, 2024

ఉమ్మడి కర్నూలు జిల్లాలో YCPకి 3 సీట్లే.. కేకే సర్వే

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరిగిన సాధారణ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ను కేకే సర్వే వెల్లడించింది. 14 సీట్లలో వైసీపీ కేవలం 3 స్థానాల్లోనే విజయం సాధించబోతుందని కేకే సర్వే వెల్లడించింది. టీడీపీకి 11 సీట్లు వస్తాయని చెప్పింది. కాగా ఈనెల 4న తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్‌పై మీ COMMENT.

News June 1, 2024

కర్నూలు జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లో చెప్పిన చాణక్య స్ట్రాటజీస్ సర్వే

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరిగిన సాధారణ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ను చాణక్య స్ట్రాటజీస్ సర్వే సంస్థ వెల్లడించింది. ఉమ్మడి జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల్లో 6 చోట్ల వైసీపీ, 6 చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలవనున్నారని తేల్చి చెప్పింది. మరో రెండు చోట్ల టఫ్ ఫైట్ ఉంటుందని వెల్లడించింది. కాగా ఈనెల 4న తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి.

News June 1, 2024

బుగ్గన మరోసారి గెలుపు.. ఆరా సర్వే

image

గత నెల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గెలవబోతున్నారని ఆరా సర్వే తేల్చి చెప్పింది. 2014, 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన బుగ్గన ఈసారి కూడా గెలుపు ఖాయమని చెప్పింది. 2014లో కేఈ కృష్ణమూర్తి, 2019లో కేఈ ప్రతాప్‌లపై గెలిచిన ఆయన.. ఈసారి టీడీపీ నుంచి బరిలో దిగిన కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డికి ఓటమి తప్పదని తేల్చి చెప్పింది.

News June 1, 2024

కర్నూలు జిల్లా ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి

image

మే 13న జరిగిన పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించిన కర్నూలు జిల్లా ప్రజలందరికీ కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి జీ.సృజన ధన్యవాదాలు తెలిపారు. 4న జరగబోయే కౌంటింగ్ ప్రక్రియ సైతం సజావుగా సాగేలా జిల్లా ప్రజలు సహకరించి, ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. ఏదైనా సమాచారం, ఫిర్యాదుల కోసం కమాండ్ కంట్రోల్ రూమ్ 08518-277305 నంబరుకు సంప్రదించాలని పేర్కొన్నారు.

News June 1, 2024

పాణ్యం తుది ఫలితం ఆలస్యం: కలెక్టర్

image

పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీలో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జీ.సృజన తెలిపారు. ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే ఈ నియోజకవర్గంలో రౌండ్లు అధికంగా ఉన్నాయని, అందువల్ల ఫలితం వెల్లడి ఆలస్యమవుతుందని అన్నారు. తొలుత పోస్టల్ ఓట్ల లెక్కింపు అనంతరం EVMలు లెక్కిస్తామని, తుది ఫలితం సాయంత్రం 5:30 గంటలకు విడుదలవుతుందని స్పష్టం చేశారు.

News June 1, 2024

హైకోర్టును ఆశ్రయించిన మంత్రి బుగ్గన

image

2024 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో గత నెల 13న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై బేతంచెర్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. దీంతో ఈ కేసును కొట్టివేయాలని ఏపీ హైకోర్టును బుగ్గన ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ పిటిషన్ న్యాయస్థానం పరిశీలనలో ఉందని, త్వరలోనే విచారణకు వస్తుందని బాధితుడు పీఎన్ బాబు తెలిపారు.

News June 1, 2024

శ్రీశైలం: ఫారెస్ట్ సరిహద్దు పిల్లర్స్ ఏర్పాటుకు చర్యలు

image

శ్రీశైల మహా క్షేత్రంలోని టోల్‌గేట్ , నందీశ్వర డార్మెటరీ వద్ద ఫారెస్ట్ సరిహద్దు పిల్లర్స్ ఏర్పాటుకు సిద్ధం చేశారు. ఫారెస్ట్ ల్యాండ్ సర్వే చేసి సరిహద్దులలో పిల్లర్స్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎవరూ ఫారెస్ట్ ల్యాండ్‌ను ఆక్రమించకుండా ఉండడం కోసం ఈ పిల్లర్స్ ఏర్పాటు చేస్తున్నామని ఫారెస్ట్ రేంజర్ నరసింహులు తెలిపారు.