India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విదేశీ పర్యటన అనంతరం గన్నవరం విమానాశ్రయం చేరుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శనివారం తెల్లవారుజామున శ్రీశైలం నియోజకవర్గ MLA శిల్పా చక్రపాణి రెడ్డి కలిశారు. CM జగన్కు పుష్పగుచ్ఛం ఇచ్చి శిల్పా స్వాగతం పలికారు. మరికొంతమంది ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు CMను కలిశారు.
కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీలోని టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి శుక్రవారం నుంచి ఈనెల 5వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు వర్సిటీ రిజిస్ట్రార్ నాగుల అంకన్న తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వర్సిటీ పరిధిలో 144 సెక్షన్ విధించారని తెలిపారు. వర్సిటీలోకి ఎవరినీ అనుమతించడం లేదని పేర్కొన్నారు.
ఎన్నికల ఫలితాల కోసం కర్నూలు జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నేటి సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఉమ్మడి కర్నూలు 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆయా చోట్ల ఎవరికి గెలుపు అవకాశాలున్నాయో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయనున్నాయి. ఈ నేపథ్యంలో మీ MLA, MPగా ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో COMMENT చేయండి.
తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆళ్లగడ్డ వాసులు నలుగురు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు .. ఆళ్లగడ్డకు చెందిన ఏడుగురు కారులో హైదరాబాదు బయలుదేరారు. వీరి వాహనం ఎర్రవల్లి చౌరస్తా వద్ద ముందు ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా.. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎన్నికల ఫలితాలు సమీపిస్తున్న నేపథ్యంలో నంద్యాల జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. నంద్యాల పట్టణంలో శుక్రవారం ప్రత్యేక బలగాలతో పోలీసు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లా అంతటా నిఘా ఉంచామన్నారు.
తల్లి మరణించడంతో బాధ తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం జరిగింది. పగిడ్యాల మండలం ఎస్సీ కాలనీకి గుండెపోగు మహేశ్ అనే యువకుడి తల్లి అనారోగ్యంతో మూడు రోజుల కిందట మరణించింది. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి RGM, శాంతిరామ్ ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ను తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. చుట్టుపక్కల 2 కిలోమీటర్ల మేర రెడ్ జోన్గా ప్రకటించినట్లు తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ల చుట్టూ 2 కిలోమీటర్ల మేర రెడ్ జోన్ నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. ఈ నిబంధనలు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.
ద్విచక్ర వాహనం అదుపుతప్పిన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన జూపాడు బంగ్లా మండల పరిధిలోని తంగడంచ గ్రామం సమీపంలో శుక్రవారం జరిగింది. పారుమంచాల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి జూపాడు బంగ్లాకు వెళ్లి పారుమంచాలకు వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. దీంతో అతను మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
కోసిగి మండలంలోని దొడ్డి గ్రామానికి చెందిన అడివప్ప(48) గ్రామ శివారులోని మాలబండ వద్ద మృతి చెందాడు. భార్య తెలిపిన వివరాల మేరకు కోసిగిలో కట్టెల మిషన్లో పనిచేసేవాడని తెలిపింది. రోడ్డుమీద రక్తపు మడుగులో పడి ఉన్నాడని, పక్కనే బైకుకు ఎటువంటి ప్రమాదం జరగలేదని ఆరోపించారు. భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు.
మంత్రాలయం -145 నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మురళిని బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన స్థానంలో చెల్లా విశ్వనాథను నియమించారు. మురళి ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, రికార్డులలో సక్రమంగా నమోదు చేయకపోవడం, సిబ్బందికి సరైన సూచనలు ఇవ్వడంలో విఫలమైనట్లు పేర్కొంటూ బదిలీ చేసినట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.