India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జూన్ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరుగుతాయని డీఈఓ శామ్యూల్ తెలిపారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. పదో తరగతి పరీక్షలకు 930 మంది, ఇంటర్ పరీక్షలకు 1,265 మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. ఆదోని, కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండలో మొత్తం 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
దేవనకొండ మండల పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు మంగళవారం ఉదయం అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది ప్రగాఢ సానుభూతి తెలిపారు. మండలంలో అందరికీ సుపరిచితుడైన శ్రీనివాసులు మృతి బాధాకరమని స్థానిక టీడీపీ నాయకుడు బడిగింజల రంగన్న ఆన్నారు.
‘ఈసారి కూడా కచ్చితంగా ఆయనే గెలుస్తాడు. లేదు లేదు ఈసారి తప్పక గెలుపు ఇతనిదే.’ ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పల్లెలను మొదలుకొని పట్టణ ప్రాంతాల వరకు ఎక్కడ చూసినా ప్రజల నోట వినిపిస్తున్న మాటలివి. సరిగ్గా ఇవాల్టి రోజే (JUN-4)న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు/DEOలు కౌంటింగ్ నిర్వహణ కోసం చర్యలు చేపడుతున్నారు. మరి మీ నియోజకవర్గంలో ఈసారి గెలుపు ఎవరిని వరించేనో కామెంట్ చేయండి.
నంద్యాల జిల్లా చాగలమర్రి సమీపంలోని వక్కిలేరు వాగుపై బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన వంతెన శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారింది. వంతెనకు ఇరువైపులా ఏర్పాటుచేసిన రక్షణ గోడలు పూర్తిగా దెబ్బతిని కూలిపోవడంతో రాకపోకల సమయంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా రైతులు ఈ రహదారిలో ఎక్కువగా తిరిగే అవకాశం ఉన్నందున అధికారులు చర్యలు చేపట్టి రక్షణ గోడలు నిర్మించాలని కోరుతున్నారు.
ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ఠ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశించారు. ఎన్నికల ఫలితాల ప్రకటన విషయంలో ఏమాత్రం జాప్యం చేయకుండా భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ, కచ్చితమైన ఫలితాలను ప్రకటించాలన్నారు. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల సీఈవోలు, నియెజకవర్గాల ఆర్వోలు, జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కడుపు నొప్పి తాళలేక బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం జరిగింది. మిడుతూరు మండలం వీపనగండ్ల గ్రామంలో గోయన్న గారి హేమలత(16) ఉదయం 10:30 గంటల ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఇంటి పై కప్పుకు కరెంటు వైర్తో ఉరివేసుకుంది. పనికి వెళ్లి ఇంటికి వచ్చిన అమ్మమ్మ పద్మావతమ్మ చూసి చుట్టుపక్కల వారిని పిలిచి ఆటోలో వైద్యశాలకు తరలించారు. బాలిక మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
కర్నూలు జిల్లా టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు హనుమంతరావు చౌదరి, ఎమ్మిగనూరుకి చెందిన బైలుప్పల షఫీయుల్లాకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే వేడుకల్లో అవార్డు అందుకోనున్నారు. ఎన్టీఆర్ జాతీయ పురస్కారానికి ఎంపిక చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా కళా రంగానికి సేవ చేస్తున్న తమను టీడీపీ గుర్తించిందన్నారు.
కర్నూలు జిల్లాకు నూతన పాఠ్యపుస్తకాలు చేరాయి. రాష్ట్రంలో సంప్రదాయాలు, ప్రజల నమ్మకాలు తెలియజేయడంలో భాగంగా పదో తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలం దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి ఆలయంలో విజయదశమి రోజు అర్ధరాత్రి జరిగే బన్నీ జైత్రయాత్ర, కర్రల ఊరేగింపు(సమరం) గూర్చిన చరిత్ర ప్రచురించారు. దీంతో జిల్లా తెలుగు పండితులు, అధ్యాపకులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
కర్నూలు పొక్సో కేసుల స్పెషల్ కోర్టు ఒకరికి జీవత ఖైదు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు వెల్లడించింది. హోళగుంద పోలీసు స్టేషన్ పరిధిలో 2021 సంవత్సరంలో ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన రంగమునికి జీవిత ఖైదుతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ పోక్సో కేసుల స్పెషల్ కోర్టు జడ్జి వి.భూపాల్ రెడ్డి తీర్పునిచ్చారు. దర్యాప్తు అధికారులను ఎస్పీ అభినందించారు.
గూగుల్ ట్రాన్స్లేట్లో వచ్చే వాయిస్ కర్నూలు జిల్లా అమ్మాయి గ్రీష్మదే. చెన్నైలోని ఓ కళాశాలలో బీటెక్ చదివిన గ్రీష్మకు తన ఫ్రెండ్ ద్వారా వాయిస్ ఓవర్ రంగం గురించి తెలిసింది. తల్లి శశిదేవి డిప్యూటీ కలెక్టర్గా.. తండ్రి జేసీ నాథ్ ప్రిన్సిపల్గా పదవీ విరమణ పొందారు. గ్రీష్మ వాయిస్ ఓవర్లో ప్రైవేటు, ప్రభుత్వ ప్రాజెక్టులకు పనిచేసింది. అంతేకాదు AXIS, HDFC బ్యాంకుల కస్టమర్లకు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చింది.
Sorry, no posts matched your criteria.