Kurnool

News May 27, 2024

కర్నూలు: మూడు మండలాల్లో తేలికపాటి వర్షం

image

కర్నూలు జిల్లాలో మూడు మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు గోనెగండ్ల మండలంలో 2.8 మి.మీ. నమోదైంది. ఆదోని 2.0, సి.బెళగల్లో అత్యల్పంగా 0.4 మి.మీ. కురిసింది. జిల్లాలో సగటున 0.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈనెల సాధారణ వర్షపాతం 40.1 మి.మీ. కాగా ఇప్పటి వరకు 97.2 మి.మీ. రికార్డయ్యింది. సాధారణంతో పోలిస్తే 142 శాతం అధికంగా కురిసింది. అన్నదాతలు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు.

News May 27, 2024

కర్నూలు: రెండు వజ్రాలు లభ్యం

image

తుగ్గలి మండల పరిధిలోని జొన్నగిరిలో ఆదివారం రెండు వజ్రాలు లభ్యమయ్యాయి. వీటిలో ఒక వజ్రం స్థానిక వ్యాపారి రూ.లక్షకు, మరోదాన్ని పెరవలికి చెందిన వ్యాపారి రూ.7 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. తొలకరి వర్షాలు రావడంతో వజ్రాల అన్వేషణకు వివిధ ప్రాంతాల ప్రజలు జొన్నగిరి పొలాల బాట పడుతున్నారు.

News May 27, 2024

కొత్తపల్లి మండల వాసికి డాక్టరేట్

image

కొత్తపల్లి మండలంలోని పెద్దగుమ్మడాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని మజార గ్రామమైన సింగరాజుపల్లి వాసికి శనివారం డాక్టరేట్ ప్రదానం చేశారు. గ్రామానికి చెందిన నక్క సత్యాలు, యేసురత్న దంపతుల కుమారుడు ప్రవీణ్ కుమార్ విజయవాడలోని వీఐటీ యూనివర్సిటీలో భౌతిక శాస్త్రంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. పరిశోధనకు గాను యూనివర్సిటీ అధికారులు ప్రవీణ్ కుమార్‌కు డాక్టరేట్ ప్రదానం చేశారు. దీంతో పలువురు అభినందించారు.

News May 27, 2024

స్ట్రాంగ్ రూములు పరిశీలించిన నంద్యాల కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఆర్జీఎం, శాంతిరాం ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.కె. శ్రీనివాసులు ఆదివారం పరిశీలించారు. ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి భ‌ద్ర‌తాప‌ర‌మైన చ‌ర్య‌ల‌ను ప‌రిశీలించారు. సీసీ కెమెరాల ప‌నితీరు, మానిట‌రింగ్ రూమ్ ద్వారా ప‌ర్య‌వేక్ష‌ణ గురించి అక్క‌డ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

News May 27, 2024

కౌంటింగ్ సిబ్బంది మొబైల్ ఫోన్లు తీసుకురావద్దు: కలెక్టర్

image

కౌంటింగ్ రోజున రాయలసీమ యూనివర్సిటీలోకి సాధ్యమైనంత వరకు కౌంటింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ విధులు నిర్వహించే సిబ్బంది మొబైల్ ఫోన్లు తీసుకొని రావద్దని జిల్లా కలెక్టర్ జి. సృజన పేర్కొన్నారు. ఆదివారం కర్నూల్ నగరంలోని రాయలసీమ యూనివర్సిటీ కేంద్రంలో పార్కింగ్, మొబైల్ డిపాజిట్ సెంటర్, ఫుడ్ కౌంటర్ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.

News May 26, 2024

ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పనిచేయని కెమెరాలు

image

నంద్యాల జిల్లా కేంద్రంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ వద్ద సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా పాణ్యం, నంద్యాల, డోన్ ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదని టీడీపీ ఎంపీ అభ్యర్థి శబరి కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో కలెక్టర్ పరిశీలిస్తామని చెప్పినట్లు వెల్లడించారు.

News May 26, 2024

రాయలసీమ గురించి తప్పుగా మాట్లాడితే తాటతీస్తాం: సీమ కృష్ణ రాథోడ్

image

రాయలసీమ సంప్రదాయాన్ని, విలువలను తప్పుగా చిత్రీకరిస్తూ మాట్లాడే వ్యక్తుల తాట తీస్తామని రాయలసీమ ఉద్యమ నాయకులు సీమ కృష్ణ రాథోడ్ హెచ్చరించారు. తెలంగాణలో రాయలసీమ ఫ్యాక్షనిజం నడుస్తోందంటూ టీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ మాట్లాడటం పట్ల ఆయన స్పందించారు. రాయలసీమను తక్కువ చేసి మాట్లాడటం ఇతర ప్రాంతాల వారికి అలవాటుగా మారిందన్నారు. దీన్ని ఇలాగే కొనసాగిస్తే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందంటూ హెచ్చరించారు.

News May 26, 2024

కౌంటింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

కౌంటింగ్ విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. నంద్యాలలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కౌంటింగ్ సిబ్బందికి ఆదివారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ విధులకు తప్పకుండా హాజరు కావాలన్నారు. నిర్దేశించిన సమయానికి అందరూ తప్పనిసరిగా కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకోవాలన్నారు.

News May 26, 2024

శ్రీశైలం వద్ద సమాధిని ఢీకొట్టిన కారు

image

శ్రీశైలం సమీపంలోని రామయ్య మలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలానికి వస్తున్న రెండు కార్లు స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపు తప్పాయి. దీంతో ఒక వాహనాన్ని మరో వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ కారు అదుపు తప్పి పక్కనే ఉన్న సమాధిపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

News May 26, 2024

బేతంచెర్ల: పాత కక్షలతో దాడి.. వ్యక్తి మృతి

image

మండల పరధిలోని రుద్రవరంలో పాత కక్షలతో గొడవ పడి కట్టెలతో శనివారం రాత్రి కొట్టుకున్నారు. ఈ గొడవల్లో హరిప్రసాద్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలవ్వడంతో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హరిప్రసాద్ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.