India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మద్దికేర మండల కేంద్రానికి చెందిన పారా రాజేంద్ర కుమార్, సుమలత దంపతుల కుమార్తె పారా షారోన్ గత నెలలో నిర్వహించిన ఆల్ ఇండియా శ్రేష్ట పరీక్షలో 75వ ర్యాంకుతో మంచి ఫలితాలను సాధించింది. దీంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. వీరి తండ్రి ప్రభుత్వ చౌక దుకాణం డీలర్గా ఉన్నారు. తల్లి మాజీ వాలంటీర్. కూతురి ఇష్టం మేరకే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయించామని తల్లిదండ్రులు తెలిపారు.
డోన్ ఎమ్మెల్యేగా కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డిగా ప్రమాణం స్వీకారం చేశారు. అసెంబ్లీలో ఆయన చేత ప్రొటెం స్పీకర్ బుచ్చయ్యచౌదరి ప్రమాణం చేయించారు. కాగా ఆయన మెుదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇవాళ ఏడుగురి తొలసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు.
☞డోన్ ఎమ్మెల్యేగా కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి
☞కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్
☞పత్తికొండ ఎమ్మెల్యేగా కేఈ శ్యాంబాబు
☞ కోడుమూరు ఎమ్మెల్యేగా బొగ్గుల దస్తగిరి
☞నందికొట్కూరు ఎమ్మెల్యేగా గిత్తా జయసూర్య
☞ఆదోని ఎమ్మెల్యేగా పీవీ పార్థసారథి
☞ఆలూరు ఎమ్మెల్యేగా విరుఫాక్షి
పగిడ్యాల మండలంలో పనిచేసిన ఎస్సై మారుతీ శంకర్కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ జూనియర్ సివిల్ జడ్జి దివ్య గురువారం తీర్పునిచ్చారు. ఘనపురంలో 2015లో నరేంద్రరెడ్డి అనే వ్యక్తిపై దాడి చేసిన కేసులో శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధించారు. కేసు విచారణ నిమిత్తం పోలీస్స్టేషన్కు రావాలని నరేంద్రరెడ్డిని ఎస్సై పిలవగా వారెంట్ ఉంటేనే వస్తానని చెప్పాడు. దీంతో ఎస్సై కోపంతో దాడిచేశారని బాధితుడు ఫిర్యాదు చేశాడు.
విజయవాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కళావెంకట్రావు భవన్లో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో గురువారం జిల్లా అభ్యర్థుల సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి షర్మిల వివరించారని ఆ పార్టీ ఆదోని ఇన్ఛార్జ్ రమేశ్ యాదవ్ తెలిపారు. కర్నూలు ఎంపీ అభ్యర్థి రాంపుల్లయ్య యాదవ్, నరసింహులు యాదవ్ ఉన్నారు.
విద్యతోనే గిరిజనల అభివృద్ధి సాధ్యమని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రాముఖ్యం ఇస్తోందని ఎస్టీ కమిషన్ సభ్యుడు వాడిత్య శంకర్ నాయక్ పేర్కొన్నారు. గురువారం కర్నూలులో విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, గిరిజనులను అభివృద్ధి పథంలో నడిపిస్తోందని అన్నారు. జిల్లా పర్యటనలో గిరిజనుల నుంచి కొన్ని విజ్ఞాపనలు వచ్చాయని తెలిపారు.
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని సినీ నిర్మాత యుగంధర్ గౌడ్ తన సహచరులతో కలిసి దర్శించుకున్నారు. గ్రామ దేవత మంచాలమ్మను, రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకొని మంగళ హారతులు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై సుమన్ తేజ, గరీమ చౌహాన్ హీరో, హీరోయిన్లుగా నిర్మించిన ‘సీతా కళ్యాణ వైభోగమే’ చిత్రం శుక్రవారం విడుదల కానుందని, స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు తెలిపారు.
చెట్టుకు ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నందికొట్కూరు మండలం శాతనకోట గ్రామానికి చెందిన చంద్రమౌళి(45) గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కరణాలు తెలియాల్సి ఉంది.
వెల్దుర్తి మండలం చెరుకులపాడులో టీడీపీ కార్యకర్త కొమ్ము రామాంజనేయులు(62) చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. 8 రోజుల
కిందట చెరుకులపాడులో కుక్క కాటుకు గురయ్యాడని చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్పారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడని తెలిపారు. మృతుడి కుటుంబాన్ని రైతు సంఘం అధ్యక్షుడు ఈదుల వెంకటరాముడు పరామర్శించారు.
పోలీస్ స్టేషన్ SHOల ద్వారా తమ సమస్య పరిష్కారం కాకపోతే ఫిర్యాదుదారుడు నేరుగా తనకు ఫోన్ చేయొచ్చు అని నంద్యాల జిల్లా ఎస్పీ కే.రఘువీర్ రెడ్డి తెలిపారు. 9154987020కు కాల్ లేదా వాట్సాప్ ద్వారా వివరాలు తెలిపి తమ సమస్యకు పరిష్కారం పొందవచ్చని పేర్కొన్నారు. కాగా మొదట SHO వద్దకు వెళ్లాలని, అక్కడ పరిష్కారం కాకపోతేనే తనకు ఫోన్ చేయాలని ఎస్పీ తెలిపారు. ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
Sorry, no posts matched your criteria.