India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డోన్ జాతీయ రహదారిలోని ఉంగరానిగుండ్ల వద్ద శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జోరు వర్షంలో బైక్పై వెళుతున్న ముగ్గురు యువకులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనలో ముని, ప్రభాకర్, దశరథ అనే యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాకి చేరుకొని ప్రమాద ఘటనను పరిశీలించారు.
నంద్యాల జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సిబ్బందికి సంబంధించి మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. కే.శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని ఆయన ఛాంబర్ లో జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి కౌంటింగ్ పర్సనల్స్ 1వ ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. కౌంటింగ్ కోసం 813 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించారు.
కౌంటింగ్ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జీ.సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాయలసీమ యూనివర్సిటీలోని కంట్రోల్ రూములో భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల లైవ్ ఫీడ్ను పరిశీలించారు. అనంతరం ఈవీఎం స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. జేసీ మౌర్య, ట్రైనీ కలెక్టర్, తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 25వ తేదీ నిర్వహించనున్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ పోస్టుల పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని శుక్రవారం జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. నంద్యాలలో మూడు పరీక్ష కేంద్రాల్లో మొత్తం 605 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారని తెలిపారు. పరీక్షలకు హాజరు కానున్న అభ్యర్థులు ఉదయం 7.30 గంటల నుంచి 8.15 గంటల లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
పాములపాడు మండలం మిట్ట కందాలలో శుక్రవారం పిడుగు పడింది. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. పడిగుపడటంతో గడ్డివాముకు నిప్పంటుకుంది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. గాలి ఎక్కువగా వీస్తుండటంతో మంటలు భారీగా చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఎన్నికల విధులకు హాజరుకాని అధికారులు, ఉద్యోగులపై కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ.సృజన కొరడా ఝుళిపిస్తున్నారు. ఇందులో భాగంగా ఔషధ నియంత్రణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ) రమాదేవిని సస్పెండ్ చేశారు. జిల్లా అధికారిణిగా ఉంటూ ఎన్నికల విధులకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేయాలని ఆ శాఖ డీజీ రఘురామిరెడ్డికి సిఫార్సు చేశారు. దీంతో ఆమెపై సస్పెన్షన్ వేటు పడింది.
జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం జరిగే మొదటి సంవత్సరానికి పరీక్షకు గాను జిల్లా వ్యాప్తంగా 35 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆర్ఐఓ గురవయ్య శెట్టి తెలిపారు. 15,981 విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఆయన తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 69 పరీక్షా కేంద్రాలలో పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మొత్తం 69 పరీక్షా కేంద్రాలలో 17,458 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి ఉపాధ్యాయులు తనిఖీ చేసి అనుమతించారు. 69మంది చీఫ్ సూపర్డెంట్లు డిపార్ట్మెంట్ ఆఫీసర్లను నియమించినట్లు డీఈఓ శామ్యూల్ తెలిపారు.
నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సెంటర్లో ఉన్న కెనరా బ్యాంకులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఫర్నీచర్, కంప్యూటర్లు, డాక్యుమెంట్లు దగ్ధయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు సిబ్బంది తెలిపారు.
నందికొట్కూరు మండలం వడ్డెమాను సమీపంలోని హంద్రీనీవా కాలువలో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన గురువారం జరిగింది. ఎస్సై నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం.. దామగట్ల గ్రామానికి చెందిన గొల్ల మధు(40) కొన్ని రోజులుగా మతిస్థిమితం సరిగా లేక తిరుగుతున్నాడు. గురువారం వడ్డెమాను హంద్రీనీవా కాలువలో నీరు తాగేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారిపడి మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Sorry, no posts matched your criteria.