Kurnool

News September 15, 2024

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు: ఎస్పీ

image

కర్నూలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా ఈనెల 16న(సోమవారం) నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రిసల్ సిస్టం) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ జి.బిందు మాధవ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు కర్నూలుకు రావద్దని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఎస్పీ బిందు మాధవ్ సూచించారు.

News September 14, 2024

ఎక్కడా చిన్నపాటి సంఘటన చోటు చేసుకోకూడదు: ఎస్పీ

image

కర్నూలులో రేపు గణేశ్ నిమజ్జనోత్సవం నేపథ్యంలో పోలీస్ పరేడ్ మైదానంలో బందోబస్తు విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందితో ఎస్పీ బిందు మాధవ్ సమావేశం నిర్వహించారు. ‘ఎక్కడా చిన్నపాటి సంఘటన చోటు చేసుకోకూడదు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు. శోభయాత్రలో ప్రజలు, భక్తుల పట్ల పోలీసులు సత్ప్రవర్తనతో మెలగాలి. నిమజ్జనం ముగిసే వరకు పోలీసులు తమకు కేటాయించిన విధుల్లో ఉండాలి’ అని దిశా నిర్దేశం చేశారు.

News September 14, 2024

కొండారెడ్డి బురుజుకు ఆ పేరెలా వచ్చింది?

image

కర్నూలులోని కొండారెడ్డి బురుజును క్రీ.శ 16వ శతాబ్దంలో అచ్యుతదేవరాయులు నిర్మించారు. 1602-1618 మధ్య అబ్దుల్ వహాబ్ కందనవోలును పరిపాలించే వారు. ఆ సమయంలో నందికొట్కూరు తాలుకాలోని పాతకోట పాలెగాడైన కొండారెడ్డి అతని అధికారాన్ని ధిక్కరించారట. దీంతో వహాబ్ కొండారెడ్డిని ఓడించి ఈ బురుజులోని కారాగారంలో బంధించాడు. అందులోనే మరణించడంతో అతని పేరుమీద దీనికి కొండారెడ్డి బురుజు అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది.

News September 14, 2024

కర్నూలు: 16న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు

image

ఈ నెల 16న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా శనివారం ఓ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రం, డివిజన్ స్థాయి, మున్సిపాలిటీ, మండల స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలోని ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.

News September 14, 2024

కొండారెడ్డి బురుజుకు ఆ పేరెలా వచ్చింది?

image

కర్నూలులోని కొండారెడ్డి బురుజును క్రీ.శ 16వ శతాబ్దంలో అచ్యుతదేవరాయులు నిర్మించారు. 1602-1618 మధ్య అబ్దుల్ వహాబ్ కందనవోలును పరిపాలించే వారు. ఆ సమయంలో నందికొట్కూరు తాలుకాలోని పాతకోట పాలెగాడైన కొండారెడ్డి అతని అధికారాన్ని ధిక్కరించారట. దీంతో వహాబ్ కొండారెడ్డిని ఓడించి ఈ బురుజులోని కారాగారంలో బంధించాడు. అందులోనే మరణించడంతో అతని పేరుమీద దీనికి కొండారెడ్డి బురుజు అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది.

News September 14, 2024

చంద్రబాబును గిన్నిస్ బుక్‌కు ఎక్కించాలి: ఎస్వీ మోహన్ రెడ్డి

image

సీఎం చంద్రబాబుపై కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. వైఎస్ జగన్ రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసి NMC మంజూరు చేసినా సీట్లు వద్దంటూ కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబును గిన్నిస్ బుక్‌కు ఎక్కించాలని విమర్శించారు. పేద విద్యార్థులు డాక్టర్ కావాలనే కలలపై CBN నీళ్లు చల్లారని ఎస్వీ మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇది దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు.

News September 14, 2024

‘హైడ్రా’ కూల్చివేతలపై హైకోర్టుకు కాటసాని భార్య

image

TS అమీన్‌పూర్‌లో హైడ్రా కూల్చివేతలపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి భార్య ఉమామహేశ్వరమ్మ హైకోర్టును ఆశ్రయించారు. FTL పరిధిలో లేకున్నా వ్యవసాయ భూమిలోని షెడ్, కాంపౌండ్‌ను కూల్చివేశారని తెలిపారు. 9ఎకరాల భూమిలో దానిమ్మ, మామిడి, జామ వంటి మొక్కలు పెంచుతున్నామని, కాంపౌండ్ నిర్మాణానికి అనుమతివ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా న్యాయమూర్తి నిరాకరించారు. అనంతరం విచారణను అక్టోబరు 3కు వాయిదా వేశారు.

News September 14, 2024

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి: కర్నూలు కలెక్టర్

image

జాబ్ మేళాను నిరుద్యోగ యువతీయువకులు సద్వినియోగం చేసుకొని, భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఉద్యోగ మేళా పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. సెప్టెంబర్ 20వ తేదీన కర్నూల్‌లోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News September 14, 2024

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి: కర్నూలు కలెక్టర్

image

జాబ్ మేళాను నిరుద్యోగ యువతీయువకులు సద్వినియోగం చేసుకొని, భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఉద్యోగ మేళా పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. సెప్టెంబర్ 20వ తేదీన కర్నూల్‌లోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News September 13, 2024

కర్నూలు జిల్లాలో రైలు మార్గం ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా?

image

కర్నూలు జిల్లాలో మొట్టమొదటి రైలు మార్గం 1870లో ప్రారంభమైంది. ముంబై, చెన్నైలను కలుపుతూ ఏర్పడిన రైలు మార్గం ఆదోని, ఆలూరు ప్రాంతాల మీదుగా 97 కి.మీ మేర ఉంటుంది. దీంతో ఎగుమతులు, దిగుమతులకు ఆదోని కేంద్రంగా మారింది. అందుకే ఈ ప్రాంతానికి రెండో బాంబేగా పేరు వచ్చిందట. 1909లో కర్నూలు-డోన్, 1930లో కర్నూల్- హైదరాబాద్‌కు రాకపోకలు ప్రారంభమయ్యాయి. 1921 SEP 29న జాతిపిత మహాత్మా గాంధీ రైలులోనే కర్నూలుకు వచ్చారు.