India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల విధులకు హాజరుకాని 40 మంది ఉపాధ్యాయులను జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ సస్పెండ్ చేశారు. వీరితో పాటు మరో నలుగురు ప్రధానోపాధ్యాయులను కడప ఆర్జేడీ సస్పెండ్ చేశారు. అయితే 79 మందిలో 44 మంది సస్పెండ్ కాగా.. మరో 23 మంది ఇచ్చిన సంజాయిషీలను సంబంధిత రిటర్నింగ్ అధికారుల వద్దకు పరిశీలనకు పంపామని వారు పేర్కొన్నారు.
సాధారణ ఎన్నికల కౌంటింగ్ కోసం ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నామని కలెక్టర్ డా.జీ.సృజన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు. గురువారం రాష్ట్ర సచివాలయం కాన్ఫరెన్స్ హాల్ నుంచి సాధారణ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పాల్గొన్నారు.
జూన్ 4న శాంతిరాం ఫార్మసీలో జరగబోయే ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే అభ్యర్థి, ఏజెంట్లు తప్ప మరెవరూ రావడానికి వీలు లేదని డోన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి గురువారం స్పష్టం చేశారు. కౌంటింగ్ రోజున పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తామని, 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. పాత కేసుల్లో ఉన్నవారు, సమస్యలను లేవనెత్తుతారనే అనుమానం ఉన్న వారికి నోటీసులు జారీ చేశామన్నారు.
కర్నూలు జిల్లాలోని 8 నియోజకవర్గాలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లన్నీ జిల్లా ట్రెజరీలో భద్రంగా, సురక్షితంగా ఉన్నాయని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జీ.సృజన గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లు భద్రపరిచిన జిల్లా ట్రెజరీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వాటితో పాటు డబల్ లాక్ సిస్టం కూడా ఉందని పేర్కొన్నారు. 24 గంటలూ ఆర్మ్డ్ గార్డ్ పర్యవేక్షణ ఉందన్నారు.
ఉపాధి పనులకు వెళ్లి అస్వస్థతకు గురైన వ్యక్తి గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. మహానంది మండలం అబ్బీపురం గ్రామానికి చెందిన సంపంగి రవిశేఖర్ ఉదయం ఉపాధి పనులకు వెళ్లాడు. పనులు చేస్తుండగా అస్వస్థతకు గురికావడంతో తోటి కూలీలు చికిత్స నిమిత్తం స్థానిక వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. అయితే కోలుకోలేక గుండెపోటుతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
రాయలసీమ యూనివర్సిటీలోని కంట్రోల్ రూమ్ నుంచి స్ట్రాంగ్ రూమ్ లైవ్ ఫీడ్ను ఎస్పీ కృష్ణకాంత్తో కలిసి కలెక్టర్ సృజన గురువారం పరిశీలించారు. అనంతరం ఈవీఎంలను భద్రపరచిన లైఫ్ సైన్సెస్ బ్లాక్ను, కౌంటింగ్ హాల్ను పరిశీలించి సంబంధిత రిజిస్టర్లలో సంతకం చేశారు. కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్, పాణ్యం ఎన్నికల అధికారి నారపురెడ్డి మౌర్య, కర్నూలు రిటర్నింగ్ అధికారి భార్గవ తేజ పాల్గొన్నారు.
నంద్యాల: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు జూన్ 1 నుంచి ప్రారంభమవుతాయని డీఈఓ సుధాకర్రెడ్డి, ఓపెన్ స్కూల్ జిల్లా కో ఆర్డినేటర్ లక్ష్మీనారాయణలు తెలిపారు. జూన్ 1 నుంచి 8వ తేదీ వరకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయన్నారు. హాల్ టికెట్లను https://apopenschool.ap.gov.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
కోడుమూరు శివారులోని గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హరియాణాకు చెందిన ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఇద్దరు బాలికలు మృతిచెందగా.. 20మందికి పైగా గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి బళ్లారి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను 108 వాహనాల్లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నగరవనం చెరువులో మహిళల మృతి కేసులో ఆటోడ్రైవర్ మమబూబ్ బాషాను అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాలు..మహబూబ్నగర్(D)కు చెందిన జానకి, అరుణలు వేశ్యవృత్తిలో కొనసాగుతూ కర్నూలు వచ్చేవారు. ఈక్రమంలో బాషాతో పరిచయం ఏర్పడింది. మనస్పర్థలతో జానకి అతడిని కొట్టించింది. ఈనెల19న వారిద్దరు బాషా ఆటోలోనే బట్టలు ఉతకడానికి వెళ్లారు. అవకాశం కోసం చూస్తున్న బాషా జానకిని చెరువులోకి తోశాడు. కాపాడే క్రమంలో అరుణ కూడా మునిగిపోయింది.
10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలన్నారు.
Sorry, no posts matched your criteria.