Kurnool

News August 23, 2024

ప్రకాశం పంతులు సేవలు చిరస్మరణీయం: ఎస్పీ

image

నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణంలో ఇవాళ మాజీ CM, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకొని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. తుపాకీకి ఎదురుగా వెళ్లి తన గుండెను చూపించిన ధీరుడు ఆంధ్రకేసరి అని ఎస్పీ కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్ర రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, ఏఎస్పీ, పోలీస్ అధికారులు స్మరించుకున్నారు.

News August 23, 2024

రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి: కలెక్టర్

image

ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన భోజనాన్ని అందజేయాలని కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కర్నూలు మండలం గార్గేయపురంలోని పీహెచ్‌సీ, జడ్పీ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోగుల పట్ల వైద్యులు మర్యాదగా నడుచుకోవాలని సూచించారు.

News August 23, 2024

మసీదును ప్రారంభించిన మంత్రి ఫరూక్

image

ఎన్టీఆర్ కృష్ణా జిల్లా నూజివీడు మండలం బోర్వంచ గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన మసీదును మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందని అన్నారు. మైనార్టీ విద్యార్థులు చదువుకోవడానికి మదరసాలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.

News August 23, 2024

ఓర్వకల్లు వద్ద అక్రమ ఖనిజం సీజ్

image

బనగానపల్లె నుంచి అక్రమంగా మహారాష్ట్రకు డోలమైట్ ఖనిజాన్ని తరలిస్తున్న టిప్పర్లను ఓర్వకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో దాడి చేసి అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ వెల్లడించారు. టిప్పర్లలో గ్రావెల్, చిప్స్, డోలమైట్ ఖనిజాలను అక్రమంగా తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు విస్తృత దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో 3 టిప్పర్ లారీలను స్వాధీనం చేసుకున్నామనన్నారు.

News August 23, 2024

మంత్రి బీసీతో స్పెయిన్ కంపెనీ ప్రతినిధులు భేటీ

image

రాష్ట్రంలో బయో సింథటిక్ వుడ్, హైడ్రో ఫాయిల్ బోట్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు స్పెయిన్ ఆధారిత ఆరియా గ్లోబల్ సంస్థ ఆసక్తి చూపుతోంది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో కంపెనీ ప్రతినిధులు సమావేశమై తమ ప్రతిపాదనలను వివరించారు. రూ.300 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపట్టాలని కంపెనీ సిద్ధంగా ఉందని తెలిపారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి వారికి తెలిపారు.

News August 23, 2024

Govt Jobs: నంద్యాల పోలీసుల హెచ్చరిక!

image

ఉపాధి కల్పన స్కీం ఫ్రాడ్‌పై నంద్యాల పోలీసులు ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేశారు. ‘మిమ్మల్ని ఈ విధంగా ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తామని సంప్రదిస్తే వారిని నమ్మకండి. ఎవరైనా అలా చెబితే, మొదట మీరు ఆ కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశారో, లేదో చెక్ చేసుకోండి. ప్రజలు ఎవరైనా ఈ విధంగా నష్టపోయి ఉంటే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌ను కానీ, సైబర్ క్రైమ్ వారిని కానీ ఆశ్రయించండి’ అని పోలీసులు పేర్కొన్నారు.

News August 23, 2024

రికార్డుల నిర్వహణ బట్టి పనితీరును అంచనా వేయొచ్చు: కలెక్టర్

image

రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సర్వీసులు అందిస్తే గ్రీవెన్స్ తగ్గుతాయని, రెవెన్యూ అధికారులు అవినీతికి ఆస్కారం లేకుండా చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ అంశాలపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రికార్డుల నిర్వహణ తీరును బట్టి అధికారుల పనితీరు అంచనా వేయవచ్చని అన్నారు.

News August 22, 2024

జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు నిర్వహించండి: డీఈఓ

image

జిల్లాలోని అన్ని విద్యా సంస్థల్లో ఈ నెల 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారి శామ్యూల్ ప్రధానోపాధ్యాయులకు సూచించారు. గురువారం డీఈఓ కార్యాలయంలో జాతీయ అంతరిక్ష దినోత్సవానికి సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేజీబీవీ జీసీడీఓ స్నేహలత, అసిస్టెంట్ డైరెక్టర్ శామ్యూల్ పాల్, జిల్లా సైన్స్ అధికారిణి రంగమ్మ పాల్గొన్నారు.

News August 22, 2024

నంద్యాల: ఉల్లిగడ్డల లారీ బోల్తా

image

పాణ్యం మండలంలోని తమ్మరాజు పల్లె గ్రామం వద్ద జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉల్లిగడ్డల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడటంతో ఉల్లిగడ్డల బస్తాలన్నీ చెల్లాచెదురయ్యాయి. లారీ డ్రైవర్‌కు గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News August 22, 2024

సెప్టెంబర్ 11 నుండి కొత్త ఇసుక పాలసీ: కలెక్టర్

image

సెప్టెంబర్ 11 నుండి కొత్త ఇసుక పాలసీని ప్రభుత్వం అమలు చేయబోతుందని కలెక్టర్ రంజిత్ బాషా ప్రకటించారు. ప్రజలు నేరుగా ఇసుక తీసుకోవచ్చు కానీ అక్కడి నుంచి రవాణా కోసం వాహనాలకు ఛార్జీలను మాత్రమే వసూలు చేస్తామని వెల్లడించారు. జిల్లాలో మొత్తం 484 గ్రామపంచాయతీలో 4 అంశాలతో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు.