India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
22, 23వ తేదీల్లో ఇంటర్మీడియట్ మొదటి ఏడాదికి సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు అర్హత పొందిన విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వనున్నట్లు కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీదేవి తెలిపారు. 22న చిన్నటేకూరులో బాలురకు కౌన్సిలింగ్ నిర్వహించి అడ్మిషన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 23న దిన్నేదేవరపాడులో ఉన్న గురుకుల పాఠశాలలో ఆర్డర్ ఆఫ్ రిజర్వేషన్ మెరిట్ విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఈనెల 24వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా జరగబోయే పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశామని డీఈఓ శామ్యూల్ మంగళవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 69 పరీక్షా కేంద్రాలలో 17,458 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. 69 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించామని వెల్లడించారు.
నంద్యాల జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో కౌంటింగ్ తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాజకీయ నాయకులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని ప్రజలకు వివరిస్తున్నారు. రౌడీ షీటర్లను, నేర చరిత్ర కలిగిన వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు.
ఆత్మకూరు మండలం నల్వకాల్వ గ్రామసమీపంలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి జయంతి వేడుకలు బుధవారం నిర్వహించనున్నారు. ఈ ఆలయంలో స్వామిఅమ్మవారు పాణిపట్టంపై కొలువుదీరి ముందు భాగంలో విష్ణుస్వరూపంగా వెనుక భాగంలో శివలింగ ఆకారంలో దర్శనమిస్తారు. ఈ ఆలయ మరో ప్రత్యేకత ఏమిటంటే ఉత్తరాయాణంలో పుష్యమాసం నుంచి ఆషాడమాసం వరకు ఉదయం సూర్యకిరణాలు స్వామిఅమ్మవార్లపై ప్రసరించడంతో గర్భాలయ గోడలపై నీడ లింగకారంలో ప్రతిబింబిస్తుంది.
2023-24 రబీ పంటలకు సంబంధించిన నష్టానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను వ్యవసాయం యంత్రాంగం వెల్లడించింది. జిల్లాలో 70,982 హెక్టార్లలో 33 శాతంపైన పంట నష్టం జరిగిందని పేర్కొంది. 18 కరవు మండల్లాలో 58,901 మంది రైతులు పంటను నష్టపోయారని వారికి రూ.71.57 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ(పెట్టుబడి రాయితీ అవసరమవుతుందని నివేదికలోపేర్కొంది. సోషల్ ఆడిట్ చేపట్టిన అనంతరం కలెక్టర్ ద్యారా తుది నివేదిక పంపింది.
కర్నూలు గార్గేయపురం నగరవరం చెరువులో మహిళల మృతదేహాలు బయటపడిన సంగంతి తెలిసిందే. ఇద్దరు మహిళలో ఒకరు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన జానకిగా, మరొకరు అరుణగా గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో కర్నూలుకు చెందిన ఆటోడ్రైవర్తో అరుణ గొడవపడి కొట్టించినట్లు తెలిసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు కక్షగట్టి నమ్మించి వారిని చెరువు వద్దకు తీసుకెళ్లి నీళ్లలోకి తోసి హత్యచేసినట్లు విచారణలో తెలింది.
హాలహర్వి మండలంలోని విరుపాపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. శాంతమ్మ, బసవరాజు దంపతుల కుమారుడు సంతోష్ (9) గ్రామంలోని చెట్టు కింద ఆడుకుంటుండగా గాలివాన కురిసింది. దీంతో అక్కడున్న చెట్టు కిందకు వెళ్ళారు. ఆ సమయంలో చెట్టు విరిగి సంతోశ్పై పడి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. గాయపడిన మరో బాలుడిని మెరుగైన చికిత్స నిమిత్తం ఆలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
మహానంది మండలం గాజులపల్లెకి చెందిన ఆల్తాఫ్ అదే గ్రామానికి చెందిన ఇర్ఫాన్పై గొడ్డలితో దాడిచేశాడు. ఎస్ఐ నాగేంద్రప్రసాద్ వివరాల మేరకు.. స్థానిక పెట్రోల్ బంక్ సమీపంలో ఇర్ఫాన్ ఉండగా ఆల్తాఫ్ తన మిత్రులతో కలిసి అతడిపై దాడికి దిగారు. గొడ్డలితో తలపై దాడి చేయడంతో తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన ఇర్ఫాన్ను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాడికి కారణాలు తెలియాల్సి ఉంది.
ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్స్ భద్రతలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సోమవారం పాణ్యం మండలం నెరవాడ గ్రామ సమీపంలోని ఆర్జీఎం, శాంతిరాం ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచిన ఈవీఎంల పర్యవేక్షణ నిమిత్తం ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ను పరిశీలించారు.
కర్నూలు జిల్లా నగరవనం చెరువులో ఆదివారం మూడు మహిళల మృతదేహాలు కలకలం రేపిన విషయం తెలిసిందే.. అయితే వాటిలో రెండు మృతదేహాలలో రెండు ఎవరివనేది పోలీసులు గుర్తించారు. వీరిలో ఇద్దరు వనపర్తికి చెందిన అరుణ, జానకి కాగా.. మరో మహిళ ఎవరినేది తెలియలేదు. వీరి మృతికి గల కారణాలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.
Sorry, no posts matched your criteria.