Kurnool

News August 22, 2024

నందికొట్కూరులో యువకుడి మృతి

image

నందికొట్కూరులోని పగిడ్యాల రోడ్డు సమీపంలో ఉన్న పాత సామాను షాపులో విద్యుత్ షాక్‌కు గురై మహబూబ్ బాషా(35) గురువారం మృతిచెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News August 22, 2024

ఓర్వకల్లులో భారీ అగ్ని ప్రమాదం.. సంస్థ ప్రకటన

image

కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని జై రాజ్ స్టీల్ ప్లాంట్‌లో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు మృతిచెందినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆ సంస్థ తాజాగా ప్రకటించింది. ప్లాంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. ఎవరికీ గాయాలు కూడా అవ్వలేదని పేర్కొంది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ పరికరాల ప్యానల్స్ మాత్రమే కాలిపోయాయని సంస్థ ప్రతినిధి శ్రీనివాస కుమార్ ప్రకటనలో పేర్కొన్నారు.

News August 22, 2024

హ్యాపీ బర్త్ డే చిరంజీవి గారూ: భూమా అఖిలప్రియ

image

మెగాస్టార్ చిరంజీవికి ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ బర్త్ డే విసెష్ చెప్పారు. ‘దేవుడు మీకు మరింత శక్తి, ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. దీనికి గతంలో భూమా, శోభా నాగిరెడ్డితో చిరంజీవి దిగిన ఫొటోతో పాటు ఆమె వివాహ వేడుకలకు చిరు హాజరైన పలు చిత్రాలను జత చేశారు.

News August 22, 2024

కర్నూల్ జిల్లాకు రూ.59.60 కోట్లు

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గ్రామ పంచాయతీలకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం 2వ విడత నిధులు రూ.59.60 కోట్లు విడుదలైనట్లు జిల్లా పంచాయతీ అధికారి టి.నాగరాజునాయుడు తెలిపారు. నంద్యాల జిల్లాలోని 488 పంచాయతీలకు రూ.28.05 కోట్లు మంజూరు కాగా, కర్నూలు జిల్లాలోని 482 పంచాయతీలకు రూ.31.56 కోట్లు వచ్చాయని వివరించారు.

News August 22, 2024

ఆస్తి కోసమే భర్తను చంపేసింది: డీఎస్పీ సోమన్న

image

ఆదోని మండలం పెద్దహరివాణానికి చెందిన శేఖన్న (50) హత్యకు గురైన విషయం విదితమే. ఈ ఘటనలో మృతుడి భార్యే నిందితురాలని డీఎస్పీ డి.సోమన్న తెలిపారు. మద్యం మత్తులో ఉన్న భర్తను భార్య జయమ్మ గొంతు కోసి హత్య చేసిందని వివరించారు. రెండెకరాల భూమిని తనకు రాసివ్వాలని ఆమె కోరగా అందుకు భర్త నిరాకరించారు. ఈ క్రమంలో గొడవ పడ్డారు. భర్తను చంపితే ఆస్తిలో సగం వస్తుందని భావించిన ఆమె కొడవలితో గొంతు కోసి హత్య చేసిందని తెలిపారు.

News August 22, 2024

కేఎంసీ ఉద్యోగులు ఆధార్‌‌కు పాన్‌ లింక్ చేయించుకోవాలి: కమిషనర్

image

నగరపాలక సంస్థ ఉద్యోగులు తమ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకుని వారు వెంటనే చేసుకోవాలని కమిషనర్ రామలింగేశ్వర్ సూచించారు. లింక్ చేసుకోక ఆదాయపు పన్ను శాఖ అధికారులు జరిమానాలు విధించబడిన ఉద్యోగులు, సిబ్బందితో బుధవారం నగరపాలక కౌన్సిల్ హాలులో సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ.. లింక్ చేయకపోవడంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు 186 మంది ఉద్యోగులకు జరిమానా విధించిందని అన్నారు.

News August 21, 2024

క్యాన్సర్ ఆసుపత్రిని అందుబాటులో కి తీసుకొస్తాం: ఎంపీ

image

సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. కర్నూలులో మెడికల్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేస్తున్న క్యాన్సర్ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఆసుపత్రిలో సాగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో క్యాన్సర్ ఆసుపత్రి పూర్తి కాలేదని, దాదాపు 20శాతం పనులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు.

News August 21, 2024

7 మండలాల్లో 4,405 హెక్టార్లలో పంట నష్టం: కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో భారీ వర్షాల కురిసిన నేపథ్యంలో 7 మండలాల్లో 4,405 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. బుధవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వెంటనే అధికారులు పర్యటించి ప్రాథమిక నివేదికను పంపాలని ఆదేశించారు. భారీ వర్షాలు కురవడంతో కొన్ని మండలాలలోని వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయని, రాత్రి హంద్రీ నదిలో చిక్కుకున్న కూలీలను రక్షించేందుకు తగిన చర్యలు చేపట్టామన్నారు.

News August 21, 2024

నిందితులను కఠినంగా శిక్షించాలి: ఎంపీ

image

కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కర్నూలు ఎంపీ నాగరాజు డిమాండ్ చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ మెడికల్ కలశాల ఆవరణంలో జూడాలు నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షకు ఎంపీ సంఘీభావం తెలిపారు. వైద్యురాలిపై జరిగిన ఘటన అత్యంత బాధాకరమని, ఓ మహిళ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని అన్నారు.

News August 21, 2024

పచ్చదనం పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

మొక్కలను నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని నంద్యాల కలెక్టర్ రాజకుమారి తెలిపారు. నంద్యాలలోని పశుగణ అభివృద్ధి సంస్థ కార్యాలయం ఘనీకృత పశు వీర్య కేంద్రంలోని లాబ్‌ను బుధవారం ఆమె పరిశీలించారు. కలెక్టర్ రాజకుమారి మొక్కలు నాటిన అనంతరం మాట్లాడారు. పట్టణ పరిధిలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.