Kurnool

News June 14, 2024

కర్నూలు: గుంతలోకి దూసుకెళ్లిన కంటైనర్

image

ఎమ్మిగనూరు మండలం చీరాలదొడ్డి-ఎర్రకోట సమీపంలో గురువారం రాత్రి మహారాష్ట్రకు చెందిన కంటైనర్ అతివేగంగా వస్తూ అదుపుతప్పి గుంతలోకి దూసుకెళ్లింది. స్థానికులు గమనించి వెళ్లి చూడగా.. డ్రైవర్, క్లీనర్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంగా లారీ నడపడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు.

News June 14, 2024

కర్నూలు: శాప్ నెట్‌వర్క్ ఛైర్మన్ రాజీనామా

image

రాష్ట్ర శాప్ నెట్‌వర్క్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి ఎమ్మిగనూరుకు చెందిన వైసీపీ నేత మాచాని వెంకటేశ్ గురువారం రాజీనామా చేశారు. ఈ మేరకు శాప్ నెట్‌వర్క్ సీఈఓకు తన రాజీనామా పత్రాన్ని పంపారు. తనపై నమ్మకముంచి పదవి ఇచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, తనకు సహకరించిన మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

News June 14, 2024

నీతి ఆయోగ్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కర్నూలు కలెక్టర్

image

యాస్పిరేషన్ బ్లాక్‌లుగా ఎంపికైన చిప్పగిరి, మద్దికెర (ఈస్ట్), హోళగుంద బ్లాక్‌ల అభివృద్ధి అంశాలపై పురోగతి సాధించాలని నీతి ఆయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యం కలెక్టర్ సృజనకు సూచించారు. గురువారం ఢిల్లీ నుంచి నిర్వహించిన నీతి ఆయోగ్ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. అభివృద్ధి అంశాలపై నీతి ఆయోగ్ సీఈవోకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్  వివరించారు.

News June 13, 2024

కర్నూలు: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

image

మిడుతూరు మండలం దేవనూరు గ్రామానికి చెందిన మహమ్మద్ రఫీ (35) అనే రైతు పురుగు మందు తాగి గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తనకున్న రెండు ఎకరాల పొలంతో పాటు మరో 8 ఎకరాలు కౌలుకి తీసుకొని అప్పులు చేసి పంటలు వేశారు. పంట నష్టం రావడంతో రూ.10 లక్షలు అప్పులయ్యాయి. చేసిన అప్పులు తీర్చలేమని రఫీ బాధపడేవారని.. దీంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబీకులు తెలిపారు.

News June 13, 2024

కర్నూలు ఎంపీ MPTCగా రాజీనామా

image

తన MPTC పదవికి కర్నూలు ఎంపీ బస్తిపాడు నాగరాజు గురువారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని జిల్లా పరిషత్ సీఈఓ నర్సారెడ్డికి ఆయన అందజేశారు. 2021లో కర్నూలు మండలంలోని పంచలింగాల నుంచి MPTCగా టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2024లో MPగా టీడీపీ నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి రామయ్యపై గెలుపొందారు. దీంతో ఇప్పుడు MPగా ఉండటంతో MPTC పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు.

News June 13, 2024

నంద్యాల: బాలికపై చిరుత పులి దాడి

image

నంద్యాల- గిద్దలూరు నల్లమల ఘాట్ రోడ్డులోని చలమ వద్ద 12 ఏళ్ల బాలిక పాండే‌పై చిరుతపులి దాడి చేసిన ఘటన గురువారం జరిగింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కూలీల కుటుంబాలు, రైల్వే పనులు చేస్తుండగా ఒక్కసారిగా చిరుత బాలికపై దాడి చేసిందని సాటి కూలీలు తెలిపారు. వారందరూ కేకలు వేయడంతో చిరుత పులి అక్కడనుంచి పారిపోయిందన్నారు. గాయపడిన బాలికను రైల్వే అధికారులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు.

News June 13, 2024

కర్నూలు: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ఉద్యోగుల వినతి

image

ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ శాఖలో గత ప్రభుత్వ హయాంలో నియమితులైన కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను మానవతా దృక్పథంతో కొనసాగించేందుకు కృషి చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఆ శాఖ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ పీ.రామచంద్ర రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విజయవాడలో మంత్రిని కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు రామచంద్రరావు తెలిపారు.

News June 13, 2024

రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ పదవికి రాజీనామా

image

రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ పదవికి బేతంచెర్లకు చెందిన వైసీపీ నేత ముర్తుజా వలి గురువారం రాజీనామా చేశారు. 2023 జూన్‌లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తోడ్పాటుతో ఈ పదవిని చేపట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పదవికి రాజీనామా చేసినట్లు ముర్తుజా వలి వెల్లడించారు. తనకు పదవి రావడానికి సహకరించిన మాజీ మంత్రి బుగ్గనకు ధన్యవాదాలు తెలిపారు.

News June 13, 2024

జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన బడులు

image

ఏప్రిల్ 24వ తేదీన వేసవి సెలవుల కారణంగా మూతబడిన పాఠశాలలు గురువారం బడిగంట మోగడంతో పున.. ప్రారంభమయ్యాయి. నేటి ఉదయం 8:30 నిమిషాలకే విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ముస్తాబు చేసి బడులకు పంపారు. మరోవైపు జిల్లా విద్యాశాఖ అధికారులు బడి ప్రారంభం నాటి నుంచే విద్యా కానుక కిట్లను పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

News June 13, 2024

కర్నూలు: గుండెపోటుతో ప్రధానోపాధ్యాయుడి మృతి

image

ఆదోని మండలం ఢనాపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీనివాసులు బుధవారం గుండెపోటుతో మృతిచెందారు. ఆస్పరి మండలం చిన్నహోతూరుకు చెందిన ఈయన 1997లో హాలహర్వి మండలం నిట్రవట్టి ప్రాథమిక పాఠశాలలో ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆలూరు, హోళగుంద మండలాల్లో పనిచేసి ప్రస్తుతం ఢనాపురంలో హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన మృతికి ఆదోని యూటీఎఫ్ శాఖ నాయకులు, ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు.