Kurnool

News May 12, 2024

13న స్థానిక సెలవుగా గుర్తించాలి: కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 13న జిల్లా వ్యాప్తంగా స్థానిక సెలవు మంజూరు చేస్తున్నట్లుఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ నిర్వహణ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, స్థానిక సంస్థలు, కార్యాలయాలు, పరిశ్రమలకు లోకల్ హాలిడేగా పరిగణించాలని ఆదేశించారు.

News May 12, 2024

కర్నూలు: ఒక్క ఏజెంట్‌కే అనుమతి

image

పోలింగ్ కేంద్రంలో ప్రతి పార్టీ నుంచి ఒక్క ఏజెంట్ మాత్రమే లోపల ఉండేందుకు అనుమతి ఇస్తామని జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ జీ.సృజన శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ప్రతి పార్టీ ఒక్కో కేంద్రానికి ముగ్గురు ఏజెంట్లను నియమించుకోవచ్చని, వారిలో లోపల మాత్రం ఒక్కరినే అనుమతిస్తామని స్పష్టం చేశారు. లోపల ఉన్న ఏజెంట్‌కు రిలీవర్లుగా మిగతా ఇద్దరు వ్యవహరించవచ్చని పేర్కొన్నారు.

News May 12, 2024

కర్నూలు: రాబోయే 5 రోజుల్లో పిడుగులతో కూడిన వర్షం

image

కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రాబోయే 5 రోజుల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు. ఈ మేరకు రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం పడుతున్న సమయంలో చెట్ల కింద ఎవరూ ఉండకూడదని తెలిపారు.

News May 12, 2024

16వ తేదీ నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు

image

రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 16వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వెంకటేశ్వర్లు తెలిపారు. వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బీ.సుధీర్ ప్రేమ్ కుమార్ ఆదేశాల మేరకు డిగ్రీ 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్/సప్లిమెంటరీ, 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ, డిగ్రీ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

News May 12, 2024

కర్నూలు: ‘రిసెప్షన్ సెంటర్ వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేయండి’

image

రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్ వద్ద ఇబ్బంది లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన నోడల్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్ లలో విధులు కేటాయించిన నోడల్ అధికారులతో జిల్లా ఎన్నికల అధికారి సమావేశం నిర్వహించారు.

News May 11, 2024

మహానంది: పండుగ వాతావరణం ఉట్టిపడేలా పోలింగ్ కేంద్రాలు ముస్తాబు

image

ప్రజాస్వామ్య భారతదేశంలో ఓటు వజ్రాయుధమని తిమ్మాపురం గ్రామం రెవిన్యూ అధికారి సురేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. మహానంది మండల కేంద్రం తిమ్మాపురం గ్రామంలోని పోలింగ్ కేంద్రాలలో పండుగ వాతావరణం ఉట్టిపడేలా మామిడాకులు, అరటి చెట్ల తోరణాలు అలంకరించి, ఓటర్లకు స్వాగతం ఏర్పాట్లు చేశారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని ఆయన కోరారు.

News May 11, 2024

కర్నూల్: ప్రచారం CLOSE

image

ఎన్నికల క్రతువులో ముఖ్యఘట్టమైన ఎన్నికల ప్రచారం క్లోస్ అయింది. ప్రచార వాహనాలకు బ్రేక్ పడింది. సౌండ్ బాక్సుల మోతలు, డీజే శబ్దాలు ఆగిపోయాయి. చట్టసభల్లో అడుగుపెట్టేందుకు నెలరోజులుగా పోటీలో నిలిచిన నాయకులు నిత్యం ప్రజాక్షేత్రంలో ఓట్లు అభ్యర్థించగా.. హామీలు, విమర్శలు అన్నింటికీ ఫుల్ స్టాప్ పడింది. ఇకపై ఓటర్ అన్నదే ఫైనల్ తీర్పు మిగిలి ఉంది.
☛ ఓటు హక్కు వినియోగించుకుందాం.. సరైన నాయకుడిని ఎన్నుకుందాం.

News May 11, 2024

నేటితో ముగియనున్న ప్రచారాలు

image

నంద్యాలలోని కలెక్టరేట్‌లో ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్‌‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. మే 13న ఓట్లు వేసేందుకు జిల్లాలోని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో తాగునీటి వసతి, వికలాంగులకు వీల్ ఛైర్లను ఏర్పాటు చేశామన్నారు. శనివారం సాయంకాలం 6 గంటల వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవచ్చునని వెల్లడించారు.

News May 11, 2024

కర్నూలు: సమయం లేదు మిత్రమా.. ఓట్ల వేటలో అభ్యర్థులు

image

ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. అభ్యర్థులు పార్టీ శ్రేణులను ఓటర్ల చెంతకు పరుగులు పెట్టిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటు తమకే వేయాలని అభ్యర్థిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్ల వివరాలు సేకరించి వారిని రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో పడిన ఓట్ల ఆధారంగా ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఓటర్లు ఎక్కడుంటే అక్కడికే వెళ్లి తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

News May 11, 2024

కర్నూలు: ఓటుకు రూ.5 వేలు?

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో చరిత్రలో ఎప్పుడూ లేని ఖరీదైన ఎన్నికలు ఈసారి జరగనున్నాయి. ప్రచార ఘట్టం ముగుస్తుండటంతో డబ్బు పంపిణీపై నేతలు దృష్టి పెట్టారు. ఓటుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు పంచేందుకు సిద్ధమైనట్లు సమాచారం. బనగానపల్లెలో ఓ పార్టీ నేతలు రూ.2 వేలు పంపిణీ చేయగా.. మరో రూ.వెయ్యి కూడా పంచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆళ్లగడ్డ, పత్తికొండ, కర్నూలులో వెయ్యి నుంచి రూ.2 వేలు పంచుతున్నట్లు సమాచారం.