Kurnool

News May 11, 2024

NDL: ప్రశాంత ఎన్నికల నిర్వహణ లక్ష్యం- కలెక్టర్, ఎస్పీ

image

జిల్లాలో మే 13న ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడమే తమ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు, ఎస్పీ కే.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

News May 11, 2024

సెల్ ఫోన్‌లు అనుమతి లేదు: కర్నూలు కలెక్టర్

image

పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్ల అనుమతి లేదని కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జి.సృజన శుక్రవారం పేర్కొన్నారు. ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లు తమవెంట సెల్ ఫోన్లు తీసుకురావొద్దని సూచించారు. ఎన్నికల కేంద్రంలో ప్రిసైడింగ్ ఆఫీసర్ (పీఓ)కు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్ని ఓటర్లు గమనించాలని కోరారు.

News May 10, 2024

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని.. గొంతు కోసుకున్న భర్త

image

నంద్యాల పట్టణంలోని పప్పులబట్టి బజార్‌కు చెందిన జాకీర్ అనే వ్యక్తి మద్యం తాగడానికి భార్య డబ్బులు ఇవ్వలేదని బ్లేడుతో గొంతు కోసుకున్న ఘటన శుక్రవారం జరిగింది. మధ్యాహ్నం ఓ పార్టీ నాయకులు జాకీర్ కుటుంబానికి ఓట్ల డబ్బులు పంపిణీ చేశారు. తన ఓటు డబ్బులు తనకే ఇవ్వాలని భార్యను జాకీర్ బెదిరించాడు. అయినా భార్య డబ్బులు ఇవ్వకపోవడంతో జాకీర్ బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

News May 10, 2024

కుల, మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా జగన్ వ్యాఖ్యలు: తిక్కారెడ్డి

image

కర్నూలు జిల్లాలో సీఎం జగన్ బహిరంగ సభ అట్టర్ ప్లాప్ అయిందని ఎంపీ సంజీవ్ కుమార్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సోమిశెట్టి, మంత్రాలయం ఇన్‌ఛార్జ్ తిక్కారెడ్డి అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా జగన్ మాట్లాడడం దుర్మార్గమన్నారు. వైసీపీ పాలకుల ఇసుక దోపిడీ వల్ల సుంకేసుల జలాశయంలో నీటి కొరత ఏర్పడిందని ఆరోపించారు.

News May 10, 2024

మహానంది: ఈ మార్గంలో ప్రయాణించే వారు జాగ్రత్త

image

నంద్యాల-గాజులపల్లె మార్గంలో చలమ రేంజ్ అటవీశాఖలోని పెద్ద పులులు, ఎలుగుబంట్లు సంచరిస్తుండటంతో ప్రయాణీకులు జాగ్రత్తలు పాటించాలని చలమ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఈశ్వరయ్య తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ మార్గంలో ప్రయాణం చేసేవారు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేశారు.

News May 10, 2024

కర్నూలు: మరో 3 రోజుల్లో ఎన్నికల సమరం

image

ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. మరో 3 రోజుల్లో ప్రజాస్వామ్యంలో కీలక ఘట్టమైన ఓట్ల పండుగను మే 13న ఈసీ నిర్వహించనుంది. రేపటితో ప్రచార పర్వానికి తెరపడనుండటంతో అభ్యర్థులు ఈ 2 రోజుల పాటు తమ ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. మరోవైపు కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు డాక్టర్ జీ.సృజన, డాక్టర్ కే.శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

News May 10, 2024

వేసవికి ప్రత్యేక రైలు ఏర్పాటు

image

వేసవి సెలవులు దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే శాఖ కర్నూలు జిల్లా ప్రజలకు శుభవార్త చెప్పింది. ఆదోని మీదుగా సికింద్రాబాబ్-తిరుపతి(07489) ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మే 11వ తేదీ నుంచి రైలు అందుబాటులో ఉంటుందన్నారు. సికింద్రాబాద్‌లో రాత్రి 10:05 గంటలకు బయలుదేరి గద్వాల, రాయచూర్ మీదుగా ఆదోనికి రాత్రి 3:10 గంటలకు చేరుకుంటుందన్నారు.

News May 10, 2024

11వ తేదీ సాయంత్రం ప్రచారం సమాప్తం

image

11వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుందని ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ సృజన పేర్కొన్నారు. ఆ తర్వాత ఎవరూ ప్రచారం చేయకూడదని, ప్రచారం చేసినా, ఓటర్లకు నగదు, కానుకలు పంపిణీ చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాకు సంబంధం లేని ఇతర జిల్లాల ఓటర్లు వెంటనే జిల్లా నుంచి వెళ్లిపోవాలన్నారు. శనివారం రాత్రి 7 గంటల నుంచి 13వ తేదీ రాత్రి 7 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేస్తామన్నారు.

News May 10, 2024

ఫోన్లకు అనుమతి లేదు: కలెక్టర్

image

పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్ల అనుమతి లేదని కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ జీ.సృజన పేర్కొన్నారు. ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లు తమ వెంట సెల్ ఫోన్లు తీసుకురావొద్దని సూచించారు. ఎన్నికల కేంద్రంలో ప్రిసైడింగ్ ఆఫీసర్ (పీఓ)కు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్ని ఓటర్లు గమనించాలని కోరారు.

News May 10, 2024

కర్నూలు: ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

image

కర్నూలు జిల్లాలోని 8 నియోజకవర్గాలకు సంబంధించి ఫెసిలిటేషన్ సెంటర్లలో 4 రోజులుగా నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ గురువారం ముగింసింది. పోలింగ్ సిబ్బంది, పోలీసులు, వయో వృద్ధులు, వికలాంగులు.. ఇలా అందరూ కలిపి 23,612 మంది పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకోగా.. 20,733 (81.87శాతం) మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.