Kurnool

News August 27, 2024

నేర నియంత్రణకు కృషి చేయాలి: ఎస్పీ

image

పెండింగ్ కేసులు తగ్గించాలని ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సీఐలు, ఎస్సైలతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. కర్నూలు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు సబ్ డివిజన్‌లో దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్‌ కేసులపై ఆరా తీశారు. పోలీసు స్టేషన్ల వారీగా కేసుల పెండింగ్‌కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. నేర నియంత్రణకు కృషి చేయాలని సూచించారు.

News August 27, 2024

ఫ్రీ హోల్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేయకండి: కలెక్టర్

image

జిల్లాలోని ప్రీ హోల్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేయవద్దని సబ్ రిజిస్ట్రార్లను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. నిషేధిత ఆస్తుల జాబితాకు సంబంధించి సెక్షన్ 22ఏ పరిధిలోకి వచ్చే అసైన్డ్, ప్రభుత్వ, దేవాలయ భూములకు సంబంధించి అన్యాక్రాంతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జేసీ విష్ణు చరణ్, అధికారులు పాల్గొన్నారు.

News August 27, 2024

శ్రీశైలం జలాశయానికి 2 లక్షల వరద నీటి ప్రవాహం

image

కృష్ణానది పరివాహక ప్రాంతాల నుండి శ్రీశైల జలాశయానికి వరద నీటి ప్రవాహం పెరుగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల ద్వారా 2,08,001 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో డ్యామ్ నీటిమట్టం 884.30 అడుగులుగా, నిల్వ సామర్థ్యం 211.4759 టీఎంసీలుగా నమోదైంది. కుడి, ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 68,744 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

News August 27, 2024

పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలి: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలోని అన్ని ఫ్యాక్టరీలు, పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు పాటించి ఉద్యోగులు, కార్మికుల రక్షణకు ప్రాధాన్య‌తనివ్వాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత నిర్వాహకులను సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఇటీవ‌ల జ‌రిగిన ప్ర‌మాద ఘ‌ట‌న నేప‌థ్యంలో జిల్లాలోని ఫ్యాక్టరీలు, ప‌రిశ్ర‌మ‌ల నిర్వాహ‌కులకు పలు సూచనలు చేశారు. 28 వేల మంది వివిధ చోట్ల పని చేస్తున్నారన్నారు.

News August 27, 2024

నంద్యాల: గూడ్స్ ఆటో, కారు ఢీ.. చల్లాచెదురైన సామన్లు

image

పాణ్యంలోని భారత్ పెట్రోల్ బంకు సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్టీలు సామన్లతో వెళ్తున్న గూడ్స్ ఆటో, కారు ఢీకొనడంతో కారు డిక్కీ పూర్తిగా దెబ్బతింది. గూడ్స్ ఆటోలోని స్టీల్ సామన్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాదంలో ఆటో డ్రైవర్ గాయపడినట్లు స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 27, 2024

నంద్యాలలో భూమిని కొట్టేసేందుకు మంత్రి యత్నం: వైసీపీ

image

నంద్యాలలో మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అక్రమాలకు పాల్పడుతున్నారని వైసీపీ విమర్శించింది. ‘పేరుకేమో న్యాయశాఖ మంత్రి. చేసేది మాత్రం అక్రమాలు, అన్యాయాలు. నంద్యాలలో రూ.58 కోట్ల విలువైన భూమిని కొట్టేసేందుకు మంత్రి విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఆ భూమిపై కోర్టు తీర్పులున్నా పట్టించుకోవడం లేదు. మున్సిపల్ ఛైర్‌పర్సన్‌పై ఒత్తిడి తెస్తూ దొడ్డిదారిన కాజేసే కుట్ర చేస్తున్నారు’ అంటూ వైసీపీ ట్వీట్ చేసింది.

News August 27, 2024

ఆదోని వాసికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు

image

ఆదోని టౌన్‌కు చెందిన సంఘ సేవకుడు, సామాజిక కార్యకర్త వంకదారు శ్రీనాథ్‌ గుప్తా NTR జాతీయ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును మదర్‌ సర్వీస్‌ సొసైటీ ఆధ్వర్యంలో హ్యూమన్‌ రైట్స్‌ అసోసియేషన్‌ (హైదరాబాద్‌) అధ్యక్షుడు సూర్యనారాయణ రాజు, సొసైటీ ఛైర్మన్‌ ప్రసాద్‌ రావు అందజేశారు. శ్రీనాథ్‌ ఆర్య వైశ్య అఫిషియల్స్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ (ఆవోపా), ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ (వామ్‌)కు అధ్యక్షుడిగా ఉన్నారు.

News August 27, 2024

అవుకు రిజర్వాయర్‌లో గుర్తుతెలియని మృతదేహం

image

అవుకు రిజర్వాయర్‌లో గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైంది. జీఎన్ఎస్ఎస్ కాలువ మూడవ గేటు వద్ద నీళ్లలో కొట్టుకొచ్చిన మృతదేహాన్ని సోమవారం మండల వీఆర్వో హేమ్లా నాయక్ గమనించారు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అవుకు ఎస్ఐ రాజారెడ్డి తెలిపారు. మృతుడి వయసు 32 సంవత్సరాలుగా ఉంటుందని పేర్కొన్నారు.

News August 27, 2024

వేదవతి నదిపై ఎత్తిపోతల

image

విశ్రాంత డీఈఈ సుబ్బారాయుడు వేదవతి నదిపై ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించి ఎల్లెల్సీ కాల్వకు నీటిని మళ్లిస్తే కరవు కష్టాలు తీర్చవచ్చని సీఎం చంద్రబాబు, d.cm పవన్‌కు లేఖ రాశారు. 4 నెలల్లో పూర్తి చేయొచ్చంటూ సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఇందుకు సుమారు రూ.200 కోట్ల వరకు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వ ఉన్నతాధికారులు త్వరలో క్షేత్రస్థాయిలో పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News August 27, 2024

భారత సెపక్ తక్ర జట్టుకు శివకుమార్ ఎంపిక

image

సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు బ్యాంకాక్‌లో జరగనున్న కింగ్స్ కప్ సెపక్ తక్రా పోటీలకు కర్నూలు నుంచి శివకుమార్ ఎంపికయ్యారు. ఆయన భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నట్లు రాష్ట్ర సెపక్ తక్రా సంఘం కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. శివ కుమార్ గతంలో అనేక జాతీయ స్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.