Kurnool

News May 10, 2024

నంద్యాల జిల్లాకు విచ్చేసిన 9మంది ట్రైనీ ఐపీఎస్‌లు

image

ట్రైనింగ్‌లో భాగంగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి భద్రత పరమైన చర్యలను గురించి తెలుసుకునేందుకు తొమ్మిదిమంది ట్రైనీ ఐపీఎస్‌లకు జిల్లాకు విచ్చేశారు. వారు ఎస్పీ రఘువీర్ రెడ్డిని గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారికి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి తీసుకుంటున్న చర్యలు, బందోబస్తు ఏర్పాట్ల గురించి ఎస్పీ వివరించారు.

News May 9, 2024

కర్నూలు జిల్లాలో 11వ తేదీ నుంచి మద్యం దుకాణాలు బంద్

image

ఎన్నికల దృష్ట్యా కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఈనెల 11వ తేదీ నుంచి 13వ తేదీ పోలింగ్ ముగిసే వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్/ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.సృజన సంబంధిత అధికారులను గురువారం ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఓ ప్రకటన విడుదల చేశారు. క్షేత్రస్థాయి అధికారులు మద్యంపై నిఘా ఉంచాలన్నారు.

News May 9, 2024

48 గంటల ముందు నుంచే మద్యం దుకాణాలు బంద్:  కలెక్టర్

image

ఎన్నికల దృష్ట్యా ఈనెల 11వ తేదీ నుంచి 13వ తేదీ పోలింగ్ ముగిసే వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

News May 9, 2024

ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షపాతం వివరాలు

image

ఎండలు, వడగాల్పులతో అల్లాడుతున్న ప్రజలు వర్షాలతో చల్లబడ్డారు. బుధవారం నంద్యాల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవగా.. కర్నూలు జిల్లాలో మోస్తరు వర్షాలు కురిశాయి. అవుకు మండలంలో 102.మి.మీ, చాగలమర్రి 76.4, శిరివెళ్ల 72, గడివేముల 65.2, బండి ఆత్మకూరు 64.2, వెలుగోడు 52.2, పాణ్యం 51.4, గూడూరు 39.6, తుగ్గలి 36, పత్తికొండ 15.2 మి.మీ వర్షపాతం నమోదైంది.

News May 9, 2024

గిరిజన విద్యార్థులకు జాతీయ ఓవర్సీస్ స్కాలర్షిప్

image

2024-25 విద్యా సంవత్స రానికి సంబంధించి గిరిజన విద్యార్థినీ, విద్యార్థుల ఉన్నత విద్యకు జాతీయ ఓవర్సీస్ స్కాలర్షిప్ అందిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి రంగ లక్ష్మిదేవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్కాలర్షిప్ పొందేందుకు మాస్టర్ లెవెల్ పీహెచ్ఏ, పోస్టు డాక్టరల్ రీసర్చ్ ప్రోగ్రాంలో ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ నెల 31వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News May 9, 2024

కర్నూలులో వైఎస్ జగన్ నేటి పర్యటన షెడ్యూల్

image

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కర్నూలుకు రానున్నారు. ఉదయం 10.15 గంటలకు విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతారు. 10.35 గంటలకు కర్నూలుకు చేరుకుంటారు. 10.55 గంటలకు ఎస్టీబీసీ కళాశాల మైదానం సమీపంలోని వైఎస్ఆర్ సర్కిర్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొని స్రసంగిస్తారు. 11.50 గంటలకు సభ ముగించుకుని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం బయలుదేరుతారు.

News May 9, 2024

పోలింగ్ కేంద్రాల్లో అన్ని సదుపాయాలను కల్పించాం: కర్నూలు కలెక్టర్

image

జిల్లాలో మే 13వ తేదీన సజావుగా ఎన్నికలు నిర్వహించేలా పోలింగ్ కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించామని జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన బుధవారం తెలిపారు. పోలింగ్ స్టేషన్‌లలో నిర్దేశించిన కనీస మౌలిక వసతుల ఏర్పాటు చేయడంతో పాటు వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ల నియామకం, తగినంత పోలీసు బలగాలను నియమించిన అంశాలపై సమావేశాన్ని నిర్వహించారు.

News May 9, 2024

కర్నూలు:‘ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు రవాణా సదుపాయం’

image

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు మే 12వ తేదిన వారికి కేటాయించిన నియోజకవర్గాలకు ఆర్టీసీ బస్సుల ద్వారా రవాణా సదుపాయం కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా వారికి కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

News May 8, 2024

నంద్యాల జిల్లాలో ఓటింగ్ శాతం పెంచాలి: కలెక్టర్

image

18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం స్వీప్ యాక్టివిటీ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు వినియోగంపై టోపీలను ఆవిష్కరించారు. ఎన్నిక‌ల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని త‌మ‌కు న‌చ్చిన వారికి ఓటు వేసి జిల్లాలో ఓటింగ్ శాతాన్ని పెంచాల‌ని అన్నారు.

News May 8, 2024

పోలీస్ అధికారులపై ఫిర్యాదు చేసిన తిక్కారెడ్డి

image

కర్నూలు జిల్లాలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కొంతమంది పోలీస్ అధికారులపై ఎన్నికల పోలీస్ అబ్జర్వర్ ఉమేష్ కుమార్‌కి కర్నూలు టీడీపీ అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి బుధవారం ఫిర్యాదు చేశారు. జిల్లాలో వైసీపీ నాయకులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆయన కోరారు. కర్నూలు ఎంపీ సంజీవ కుమార్‌, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నంద్యాల నాగేంద్ర ఉన్నారు.