Kurnool

News May 8, 2024

నంద్యాల: గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

image

శ్రీశైలంలోని ఎస్టీ కాలనీలో గంజాయి విక్రయిస్తున్న బొడ్డపాటి మల్లికార్జున అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ జి.ప్రసాద్ రావు బుధవారం తెలిపారు. సమాచారం మేరకు తనిఖీలు చేయగా మల్లికార్జున వద్ద నుంచి 105 గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి అతడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఏఎస్ఐ గురవయ్య, సుంకన్న, రఘునాథుడు, బాలకృష్ణ, మహేశ్, శివ మహేంద్ర రెడ్డి ఉన్నారు.

News May 8, 2024

ఈనెల 9న కర్నూలుకు వైఎస్ జగన్ రాక

image

ఈనెల 9న వైసీపీ అధినేత వైఎస్ జగన్ కర్నూలుకు రానున్నట్లు జిల్లా అధ్యక్షురాలు సత్యనారాయణమ్మ తెలిపారు. నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో వైసీపీ నాయకుడు ఎస్వీ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్, రీజినల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డితో కలిసి ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. 9న వైఎస్సార్ సర్కిల్లో బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు.

News May 8, 2024

కర్నూలు: బీటెక్ పరీక్ష ఫలితాల విడుదల

image

రాయలసీమ విశ్వవిద్యాలయ పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలకు సంబంధించి బీటెక్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు వీసీ సుధీర్ ప్రేమ్ కుమార్ వెల్లడించారు. గతేడాది డిసెంబరులో రెగ్యులర్ 1, 3, 5వ సెమిస్టర్లు, ఈ ఏడాది జనవరిలో జరిగిన అన్ని సెమిస్టర్ల పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఫలితాల కోసం విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.

News May 8, 2024

నంద్యాల: ఆ నియోజకవర్గంలో జనసేన పార్టీ కంటే NOTAకే ఎక్కువ ఓట్లు

image

NOTA గురించి అందరికీ తెలిసిందే. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు ఓటర్లు ఓటు వేయొద్దనుకుంటే NOTAకు వేయొచ్చు. ఈ అవకాశం 2013 నుంచి ఉండగా.. గత ఎన్నికల్లో బనగానపల్లె నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని ఎక్కువ మందే వినియోగించుకున్నారు. వరుసగా YCP (99,998), TDP (86,614), కాంగ్రెస్(2,166) ఓట్లు పడగా.. NOTAకు 1,628 ఓట్లు వేశారు. జనసేన పార్టీకి 1,512 ఓట్లు పోలయ్యాయి. మీరెపుడైనా నోటాకు ఓటేశారా?

News May 8, 2024

రెండో రోజు కొనసాగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

image

మంత్రాలయం 145 నియోజకవర్గంలో కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోస్టర్ బ్యాలెట్ ఓటింగ్ రెండో రోజు కొనసాగింది. మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వివరాలు ఇలా ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 222 నమోదు కాగా, హోమ్ ఓటింగ్ 12 నమోదు అయ్యాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మురళి ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో మంత్రాలయం తహశీల్దార్ పాల్గొన్నారు.

News May 7, 2024

చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది: రామసుబ్బారెడ్డి

image

చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుని అసత్య ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం కర్నూలులోని జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్, ఎంపీ అభ్యర్థి రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్సీ మోహన్ రెడ్డితో కలిసి కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మరోసారి రాష్ట్రానికి జగన్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

News May 7, 2024

మే 10న అండర్-23 బాలుర క్రికెట్ ఎంపిక పోటీలు

image

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10న ఉదయం 10 గంటలకు కర్నూలులోని అవుట్ డోర్ స్టేడియంలో బాలుర క్రికెట్ ఎంపిక పోటీలు జరగనున్నాయి. అండర్-23, సీనియర్ క్రికెట్ అంతర్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్‌ కోసం ఈ ఎంపికలు చేపట్టనున్నారు. ఆసక్తి గల క్రీడాకారులు పాల్గొనవచ్చని కార్యదర్శి దేవేందర్ గౌడ్ తెలిపారు. 2001 సెప్టెంబర్ 1వ తేదీ తరువాత జన్మించిన వారు అండర్-23కి అర్హులన్నారు.

News May 7, 2024

కర్నూలు: 12గంటల బులిటెన్ విడుదల చేసిన కలెక్టర్

image

ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగస్థులకు కేటాయించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ రెండవ రోజు 12 గంటల బుల్లెటిన్‌ను జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన విడుదల చేశారు. కర్నూలు 587, ఎమ్మిగనూరు 245, పాణ్యం 337, పత్తికొండ 232, కోడుమూరు 320, మంత్రాలయం 97, ఆదోని 319, ఆలూరు 560మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మధ్యాహ్నం 12గంటల సమయానికి జిల్లా వ్యాప్తంగా 2325 మంది ఉద్యోగస్తులు ఓటు వేశారు.

News May 7, 2024

కర్నూలు: అత్తను హత్య చేసిన అల్లుడు

image

భార్య కాపురం రాకపోవడానికి అత్తనే కారణామని అల్లుడు హత్య చేసిన ఘటన పాణ్యంలో జరిగింది. అయ్యపురెడ్డి కాలనీకి చెందిన లక్ష్మీ(48) ఆమె కుతూరు రాజ్యలక్ష్మిని 11ఏళ్ల క్రితం శ్రీనివాసులుతో వివాహమైంది. భర్త మద్యానికి బానిసవ్వడంతో రాజ్యలక్ష్మి కొద్దికాలంగా పుట్టింట్లో ఉంటుంది. భార్యను కాపురానికి పంపాలని 5న రాత్రి గొడవకు దిగి అత్త తలపై కర్రతో కొట్టాడు. నంద్యాల ఆసుపత్రి.. కర్నూలు తరలిస్తుండగా మృతిచెందారు.

News May 7, 2024

ఓటు పండగకు శుభలేఖ పంపిన జిల్లా కలెక్టర్

image

వివాహాది శుభ కార్యాలకు ఆహ్వాన పత్రికలను అట్టహాసంగా ముద్రించడం పరిపాటి. ఎన్నికల సమయంలో ఓటరు స్లిప్పులు మాత్రమే పంచి పెడతారు. కానీ కర్నూలు కలెక్టర్ జి.సృజన వినూత్నంగా ఆలోచించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు మించిన శుభకార్యం వేరే ఏముంది అనుకున్నారు. ‘ఎన్నికల పర్వం దేశానికే గర్వం’ అంటూ ఈ శుభ కార్యానికి జిల్లా పెద్దగా ప్రజలందరికీ ఆహ్వానం పంపారు. మే13న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు ఓటు వేయాలని కోరారు.