Kurnool

News May 7, 2024

REWIND: నంద్యాల జిల్లాలో సిల్వర్ జూబ్లీ పార్లమెంటేరీయన్‌

image

నంద్యాల జిల్లా రాజకీయ ప్రస్థానంలో పెండేకంటి సుబ్బయ్యది ప్రత్యేక స్థానంగా చెప్పవచ్చు. ఆయన 1957 నుంచి 1977 వరకు వరసగా నాలుగుసార్లు నంద్యాల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత 1978 నుంచి 1984 వరకు ఎంపీగా గెలుపొంది సిల్వర్ జూబ్లీ పార్లమెంటేరీయన్‌గా గుర్తింపు పొందారు.1985 నుంచి 88 వరకు బిహర్ గవర్నర్‌గా, 1988నుంచి 90వరకు కర్ణాటక గవర్నర్‌గా పనిచేశారు. కేంద్రమంత్రిగా కూడా సేవలు అందించారు.

News May 7, 2024

కర్నూలు: హోమ్ ఓటింగ్‌లో పాల్గొన్న 634 మంది

image

కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మొదటి రోజు హోమ్ ఓటింగ్‌కు సంబంధించి 997 మందికి గాను 634 మంది (64 శాతం) పాల్గొన్నారని జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన తెలిపారు. మరో రెండు రోజుల్లో హోం ఓటింగ్ కార్యక్రమాన్ని 100% ఓటింగ్ నమోదయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు ఆమె వివరించారు.

News May 6, 2024

ఎన్డీయే ప్రభుత్వం వస్తేనే ఆంధ్రప్రదేశ్‌కు పూర్వవైభవం: బైరెడ్డి శబరి

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా పాణ్యంలో జరిగిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి నంద్యాల ఎంపీ అభ్యర్థి శబరి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. వైసీపీ అరాచక పాలనలో అభివృద్ధిలో వెనుకబడ్డ రాష్ట్రానికి మళ్లీ పూర్వ వైభవం రావాలంటే ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలన్నారు. నంద్యాల పార్లమెంటు పరిధిలోని 7నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

News May 6, 2024

నంద్యాల జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

image

సంజామల మండలకేంద్రంతో పాటు పలు గ్రామాల్లో భారీ ఉరుములు, మెరుపులతో  కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది.దీంతో విద్యుత్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో వాహనాల రాకపోకలు కాసేపు ఎక్కడికక్కడ స్తంభించాయి. అవుకు మండలంలో కూడా తేలికపాటి వర్షాలు కురిశాయి. గత కొద్ది రోజుల నుంచి తీవ్ర ఎండల నేపథ్యంలో ఉక్కపోతకు విలవిలలాడిన ప్రజలు.. తాజాగా వర్షం కురవడంతో ప్రకృతిని, చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించారు.

News May 6, 2024

మొదటిరోజు పోస్టల్ బ్యాటింగ్ ఓటింగ్ 29.60% మాత్రమే

image

ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగస్తులకు కేటాయించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అప్డేట్‌కు సంబంధించి మొదటి రోజు బుల్లెటిన్‌ను జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన విడుదల చేశారు. కర్నూలు 1093, ఎమ్మిగనూరు 1120, పాణ్యం 1222, పత్తికొండ 573, కోడుమూరు 806, మంత్రాలయం 226, ఆదోని 611, ఆలూరు 611మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటిరోజు సమయానికి ముగిసేసరికి 29.60% పోలింగ్ నమోదైందని కలెక్టర్ తెలిపారు

News May 6, 2024

కర్నూలు: 3గంటల పోస్టల్ బ్యాలెట్ బులిటెన్ ..23.72% నమోదు

image

ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగస్థులకు కేటాయించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అప్డేట్‌కు సంబంధించి 3గంటల బుల్లెటిన్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన విడుదల చేశారు. కర్నూలు 868, ఎమ్మిగనూరు 848, పాణ్యం 917, పత్తికొండ 536, కోడుమూరు 646, మంత్రాలయం 220, ఆదోని 470, ఆలూరు 462మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మధ్యాహ్నం 3 గంటల సమయానికి జిల్లా వ్యాప్తంగా 23.72% పోలింగ్ నమోదైందని కలెక్టర్ తెలిపారు.

News May 6, 2024

కర్నూలు: పీఎం విశ్వకర్మ యోజన జిల్లా కమిటీ సభ్యుడి మృతి

image

పీఎం విశ్వకర్మ యోజన కార్యచరణ జిల్లా కమిటీ సభ్యుడిగా ఉన్న కాళింగి నరసింహ వర్మ అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. నరసింహ వర్మ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా సేవలను అందించారు. కేంద్ర గణేష్ మహోత్సవ సమితిలో సైతం ఆయన సేవలను అందించి హిందూ ధర్మంతో పాటు సంప్రదాయ పరిరక్షణకు కోసం నిరంతరం కృషి చేశారు.

News May 6, 2024

నంద్యాల: రోకలి బండతో దాడి.. యువకుడి మృతి

image

రుద్రవరం మండల కేంద్రంలో ఆదివారం దారుణం జరిగింది. రోకలి బండతో దాడి చేయడంతో కిరణ్(29) అనే యువకుడు మృతి చెందినట్లు ఎస్సై నిరంజన్ రెడ్డి తెలిపారు.
గ్రామానికి చెందిన చిటికెల కిరణ్ తన భార్య ప్రణతికి మధ్య శనివారం రాత్రి చిన్నపాటి గొడవ జరిగింది. ఈ విషయాన్ని ప్రణతి తన అన్న పగిడి శ్రీనుకు ఫోన్ చేసి చెప్పింది. W.కొత్తపల్లి గ్రామం నుంచి శ్రీను రుద్రవరం వచ్చి రోకలి బండతో కిరణ్ తలపైన కొట్టగా మృతిచెందాడు.

News May 6, 2024

కర్నూలు: నేడు చంద్రబాబు నాయుడు రాక 

image

 తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాకు రానున్నాడు. ఆయన ఉదయం 10.05 గంటలకు అనంతపురం జిల్లా నుంచి హెలికాప్టర్‌లో 10.45 గంటలకు కర్నూలు ఏపీ ఎస్పీ రెండో బెటాలియన్‌లోకి చేరుకుంటారు. 11 గంటలకు నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కల్లూరు చెన్నమ్మ కూడలి వద్ద ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 12.40 గంటలకు చెన్నమ్మ కూడలి నుంచి ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. 2.30 గంటలకు విమానంలో విశాఖపట్నం వెళ్తారు.

News May 6, 2024

REWIND ఆళ్లగడ్డ: చనిపోయిందని తెలిసినా MLAగా గెలిపించారు

image

ఆళ్లగడ్డ నియోజకవర్గంలొ 2014లో ఓటర్లు విలక్షమైన తీర్పు ఇచ్చారు. భూమా శోభానాగ్గిరెడ్డి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. 2014 ఏప్రిల్ 23న షర్మిల నంద్యాలలో నిర్వహించన సభకు హజరై వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. HYDలో కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఎన్నికలో టీడీపీ గంగుల ప్రభాకర్ రెడ్డిపై 17,928 ఓట్ల మెజార్టీతో ప్రజలు ఆమెను గెలిపించారు. కానీ ఆమె విజయాన్ని చూడలేకపోయింది.