Kurnool

News May 4, 2024

నిప్పుల కొలిమిలా నంద్యాల జిల్లా

image

ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత మరింత అధికమైంది. గత ఏడాది వరకు ఉష్ణోగ్రతలు గరిష్టంగా 46 డిగ్రీల వరకే ఉన్నాయి. మొదటిసారి నంద్యాల జిల్లాలోని మూడు మండలాల్లో శుక్రవారం దాదాపు 48 డిగ్రీలకు చేరువ కావడం గమనార్హం. బండిఆత్మకూరు, గోస్పాడులో 47.7 డిగ్రీలు, నందికొట్కూరులో 47.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది.

News May 4, 2024

రేపు కర్నూలు జిల్లాకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

image

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం ఎన్నికల ప్రచారానికి ఆదోనికి రానున్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్దకు ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు హెలికాఫ్టర్‌ ద్వారా చేరుకుంటారు. ఆర్ట్స్ కళాశాల నుంచి తిక్కస్వామి దర్గా మీదుగా భీమాస్ సర్కిల్ నుంచి కోట్ల కూడలి వరకు ప్రచార రథంలో రోడ్ షో నిర్వహిస్తారు. బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.

News May 4, 2024

మంత్రాలయం ఎన్నికల బరిలో ముగ్గురు రాఘవేంద్రరెడ్డి, ఇద్దరు నాగిరెడ్డిలు

image

మంత్రాలయం నియోజకవర్గంలో బరిలో 8మంది అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. వారిలో టీడీపీ అభ్యర్థి ఎన్. రాఘవేంద్రరెడ్డి పేరును పోలిన మరో ఇద్దరు, వైసీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి పేరున పోలిన పేరుతో ఒకరు ఎన్నికల బరిలో ఉన్నారు. జాతీయ జనసేన పార్టీ నుంచి ఆర్. రాఘవేంద్రరెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా ఎం. రాఘవేంద్రరెడ్డి పోటీలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా కె.నాగిరెడ్డి పోటీలో ఉన్నారు.

News May 4, 2024

నంద్యాల: మద్యం మత్తులో భార్యపై భర్త గొడ్డలితో దాడి

image

మద్యం మత్తులో గొడవపడి భార్యపై భర్త గొడ్డలితో దాడి చేసిన ఘటన శుక్రవారం జరిగింది. కొత్తపల్లి మండలం శివపురానికి చెందిన అర్జున్.. అదే గ్రామానికి చెందిన మార్తమ్మను 10 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మద్యానికి బానిసైన అర్జున్ తరచూ తాగి భార్యతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో శుక్రవారం మార్తమ్మపై దాడి చేయడంతో తల వెనుకభాగం, కుడిచేతి భుజం, మణికట్టు పైభాగం, మోచేతిపై తీవ్రగాయాలయ్యాయి.

News May 4, 2024

నంద్యాల జిల్లాలో ఈ సెగ్మెంట్ సమస్యాత్మకం: సీఈఓ

image

ఏపీలో 14 అసెంబ్లీ సెగ్మెంట్లు సమస్యాత్మకమైనవని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఇందులో నంద్యాల (D) ఆళ్లగడ్డ నియోజకవర్గ అసెంబ్లీ స్థానం ఒకటిగా ఆయన పేర్కొన్నారు. ఈ సెగ్మెంట్ పరిధిలో 100% వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. పోలీసులు, కేంద్ర బలగాలతో కూడిన భారీ భద్రత నడుమ ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఈఓ స్పష్టం చేశారు.

News May 3, 2024

చంద్రబాబు మాటలు నమ్మొద్దు: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

image

చంద్రబాబు నాయుడు గతంలో అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రిగా కొనసాగారని, మళ్లీ కొత్త అబద్ధాలు చెబుతూ మీ ముందుకు వస్తున్నారని, ఆయన మాటలు నమ్మొద్దని, మీ కుటుంబాలలో మంచి జరిగి ఉంటే వైసీపీకి ఓటు వేయాలని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రజలను కోరారు. శుక్రవారం పాములపాడు మండలంలోని వాడాల, మద్దూరు, వేంపెంట, బానకచర్ల, భానుముక్కల, గ్రామాల్లో ప్రచారం చేశారు.చంద్రబాబు అబద్ధాల కోరు అని విమర్శించారు.

News May 3, 2024

బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై ఆర్ఓకు ఫిర్యాదు

image

ఈ నెల 1వ తేదీన బుధవారం ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి వేల్పనూరు రోడ్డు షోలో ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసేలా ప్రసగించారని ఎమ్మెల్యే తనయుడు శిల్పా కార్తీక్ రెడ్డి ఎన్నికల ఆర్ఓకు ఫిర్యాదు చేశారు. ప్రత్యర్థి అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డిని అసభ్యకర పదజాలంతో దూషించారని అన్నారు. మెజారిటీ తగ్గితే.. బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

News May 3, 2024

ఉమ్మడి కర్నూలు జిల్లాలో మహిళా ఓటర్లదే పైచేయి

image

జిల్లాలోని 14 నియోజవర్గాల్లో 34,48,382 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అందుల్లో పురుషులు 16,98,607, మహిళలు 17,49,199, ఇతరులు 576మంది ఓటర్లు ఉన్నారు. పురుషులతో పోలిస్తే 50,592మంది మహిళా ఓట్లర్లదే పైచేయి. అందులో 11 నియోజకవర్గాల్లో మహిళ ఓటర్లు అధికంగా ఉండటం విశేషంగా చెప్పవచ్చు. నియోజకవర్గాల వారీగా పాణ్యం 3.32 లక్షల ఓటర్లతో అత్యధికం, 2.08 లక్షల ఓటర్లతో మంత్రాలయం ఓటర్లు అత్యల్పం.

News May 3, 2024

నేడు నంద్యాలకు నారా లోకేశ్

image

నంద్యాలలో శుక్రవారం నిర్వహించనున్న యవగళం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొంటారని నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్ తెలిపారు. నంద్యాల పట్టణంలోని రాణి మహారాణి థియేటర్ వెనుకభాగంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కావున జిల్లాలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.

News May 3, 2024

నంద్యాల: 8 మండలాల్లో 46 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు

image

నంద్యాల జిల్లాలోని 8 మండలాల్లో 46 డిగ్రీలపైన, 10 మండలాల్లో 45 డిగ్రీలకు పైన, 4 మండలాల్లో 44 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బనగానపల్లి, డోన్‌లో 46.7, ఆళ్లగడ్డలో 46.6, మహానందిలో 46.4, నందికొట్కూరు, సంజామలలో 46.3, దొర్నిపాడు, కోవెలకుంట్లలో 46.1, పాణ్యంలో 45.9, మిడుతూరులో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.