India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మండల కేంద్రమైన వెలుగోడులో బుధవారం కేంద్ర సాయుధ బలగాలు, పోలీసులతో కలిసి ఎస్పీ కవాతు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే పోలీసుల ధ్యేయం అన్నారు. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రజల భద్రతకు భరోసా కల్పించడం కోసం కవాతు నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
వడదెబ్బతో యువతి మృతిచెందిన ఘటన చాగలమర్రి మండల పరిధిలోని పెద్ద బోధనం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సీ కాలనీకి చెందిన రాజా, శివమ్మ దంపతుల కుమార్తె డొంక సంధ్య(22) వడదెబ్బ కారణంగా విరోచనాలు, వాంతులతో అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దగాపడిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసేలా కూటమి మేనిఫెస్టో ఉందని, యువతీ యువకుల కలలను సాకారం చేసేలా మేనిఫెస్టో రూపొందించిన ఘనత కూటమి పార్టీలకే దక్కిందని నంద్యాల లోక్ సభ టీడీపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. నంద్యాలలో ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొలి సంతకం మెగా డీఎస్సీపై చేయనున్నారని, యువతకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.
హోం ప్రక్రియ ఓటింగ్ పకడ్బందీగా నిర్వహించాలని మైక్రో అబ్జర్వర్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.శ్రీనివాసులు ఆదేశించారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో సుమారు 15,509 మంది దివ్యాంగులు, 5వేల మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నట్లు వెల్లడించారు. వారికి ఎన్నికల కమిషన్ ఇంటి వద్ద ఓటు హక్కు కల్పించిన నేపథ్యంలో హోం ఓటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు జిల్లాలో 45మంది మైక్రో అబ్జర్వర్లను కేటాయించామన్నారు.
వైసీపీ నాయకుల నుంచి తనకు ప్రాణహాని ఉందని కర్నూలు స్వతంత్ర అభ్యర్థి ఎస్.ఇంతియాజ్ బాష ఆరోపించారు. రాత్రి 12 గంటల సమయంలో వైసీపీకి చెందిన ఇద్దరూ గరీబ్ నగర్లోని తన ఇంటికి వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరించారని అన్నారు. ఈ విషయమై ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో మంగళవారం బాధితుడు ఫిర్యాదు చేశారు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన వ్యక్తిని ఖైరతాబాద్ పోలీసులు రిమాండ్కు తరలించారు. పోలీసుల వివరాలు..బేతంచెర్ల(M) మెుద్దవరానికి చెందిన మధు రెండేళ్ల కిందట ఓ యూట్యూబ్ ఛానల్లో కెమెరామెన్గా పనిచేశాడు. అక్కడ రైటర్గా పనిచేస్తున్న యువతిని పెళ్లిచేసుకుంటానని నమ్మించాడు. ఆమె తన తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లికి ఏర్పాట్లు చేశాక పారిపోయాడు.బాధితురాలి ఫిర్యాదు మేరకు అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నంద్యాల జిల్లాలో ఓటు హక్కును వినియోగించుకునే ఓటర్ల తుది జాబితాను జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 13,89,307మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 6,80,402మంది, మహిళలు 7,08,647 మంది, ఇతరులు 258 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో అత్యధికంగా నంద్యాల నియోజకవర్గంలో 2,73,938 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా శ్రీశైలం నియోజకవర్గంలో 1,96,116మంది ఓటర్లు ఉన్నారు.
నంద్యాల జిల్లాలో ఎన్నికల నిర్వహణలో 16మంది అభ్యర్థుల కంటే ఎక్కువ ఉంటే రెండు బ్యాలెట్ యూనిట్లు కేటాయించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కె.శ్రీనివాసలు తెలిపారు. నంద్యాల ఎంపీ స్థానానికి 31, ఎమ్మెల్యే స్థానాల్లో నందికొట్కూరు 16, బనగానపల్లి 28, శ్రీశైలం 18, ఆళ్లగడ్డ 18, నంద్యాల 28, డోన్ 16మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నందికొట్కూరు, డోన్ మినహ అన్ని స్థానాల్లో రెండేసి ఈవీఎంలు కేటాయించనున్నారు.
ఓటర్ స్లిప్లను 4 రోజులలోపు పంపిణీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా జి.సృజన సంబంధిత అధికారులను టెలీ కాన్ఫరెన్స్లో ఆదేశించారు. మంగళవారం ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్, పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాటు, ఈవిఎమ్ కమిషనింగ్, పెన్షన్ పంపిణీ తదితర అంశాలపై రిటర్నింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కర్నూలు నగరంలోని బి క్యాంపు లో ఉన్న కర్నూలు డీఎస్సీ స్టేడియంలో మే 5న అండర్ 19 బాలుర క్రికెట్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి దేవేందర్ గౌడ్ తెలిపారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. 2005 తర్వాత జన్మించిన వారు మాత్రమే ఈ పోటీలకు అర్హులని వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.