Kurnool

News April 28, 2024

కర్నూల్‌లో క్లీన్ స్వీప్ చేస్తున్నాం: చంద్రబాబు

image

కర్నూలులో జిల్లాలో ఈ సారి క్లీన్ స్వీప్ చేస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. మంత్రాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మీకు తాగడానికి నీళ్లు ఇవ్వలేదుగాని, ఇసుకను దొంగిలించాడని ఆరోపించారు. ఆయన ఉద్యోగం, నీళ్లు, రోడ్డు పనులు ఏమైనా చేశాడా అని ప్రశ్నించారు. ఆయన బడుగు బలహీన వర్గాల రక్తాలు తాగే వ్యక్తని సంచలన వ్యాఖ్యలు చేశారు.

News April 28, 2024

పత్తికొండ: ఆర్డీటీ సెట్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

ప్రభుత్వ పాఠశాలలో చదివి పదో తరగతి స్టేట్ సిలబస్‌లో 500 మార్కులు, సెంట్రల్ సిలబస్‌లో 420 మార్కులు సాధించిన విద్యార్థులు ఆర్డీటీ సెట్ 2024కు దరఖాస్తు చేసుకోవాలని ఏరియా టీం లీడర్ రెహనా తెలిపారు. అర్హులైన విద్యార్థులు మే 4వ తేదీ నుంచి 10 వరకు దరఖాస్తులను ఆర్డీటీ కార్యాలయంలో అందజేయాలని, మే 19న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు యశోద గార్డెన్‌లోని ఆర్డీటీ ఆఫీసును సంప్రదించాలన్నారు.

News April 28, 2024

ఓపెన్ స్కూల్ పరీక్ష ఫలితాల విడుదల

image

ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ లక్ష్మీ నారాయణ తెలిపారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా 5,777 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయగా.. 1,445 మంది ఉత్తీర్ణత సాధించారు. 1,404 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా.. 209 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం అధికార వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆయన తెలపారు.

News April 28, 2024

బీఈడీ రెండో సెమిస్టర్ ఫలితాలు

image

కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో బీఈడీ 2023 విద్యా సంవత్సరానికి సంబంధించిన రెండో సెమిస్టర్ ఫలితాలను శనివారం వైస్ ఛాన్స్‌లర్ సుధీర్ ప్రేమ్ కుమార్ విడుదల చేశారు. ఈ పరీక్షకు 2,828 మంది విద్యార్థులకు హాజరు కాగా.. 2,591 మంది పాసయ్యారని పేర్కొన్నారు. సప్లమెంటరీ పరీక్షకు 528 మంది విద్యార్థులకు గాను 440 మంది విద్యార్థులు పాసయ్యారన్నారు.

News April 28, 2024

కర్నూలు: రైలు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

రైలు ప్రమాదంలో వ్య‌క్తి మృతి చెందిన ఘ‌ట‌న ఆదోని ఆర్ఎస్ యార్డు కిమీ 494/3-1 వ‌ద్ద శ‌నివారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్ఐ కే.గోపాల్ తెలిపిన వివ‌రాల‌ మేర‌కు.. మృతుని వ‌ద్ద ఎలాంటి ఆధారాలు ల‌భ్యం కాలేద‌న్నారు. ఎడ‌మ చేతిపై మామ్‌, డాడ్ అని ప‌చ్చ‌బోట్లు ఉన్నాయ‌ని, మెడ‌లో శ్రీఆంజ‌నేయ‌ స్వామి డాల‌ర్ చైన్ ఉంద‌ని తెలపారు. ఎవరైనా గుర్తిస్తే స‌మాచారం అందించాల‌ని కోరారు.

News April 28, 2024

ALERT.. అగ్నిగుండంలా రాయలసీమ.. హాటెస్ట్ సిటీగా నంద్యాల

image

భానుడి ప్రతాపానికి శనివారం రాయలసీమ ప్రజలు అల్లాడిపోయారు. దేశంలోనే నంద్యాలలో 44.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా.. కర్నూలులో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశంలోనే హాటెస్ట్ సిటీగా నంద్యాల నిలవడం గమనార్హం. అనంతపురం 43.7, కడప 43.4, తిరుపతి 42.9, నెల్లూరులో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు రావద్దని నిపుణులు సూచిస్తున్నారు.

News April 28, 2024

కర్నూలు జిల్లాలో చంద్రబాబు నేటి పర్యటన షెడ్యూల్ ఇదే..!

image

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.45 గంటలకు హెలికాఫ్టర్‌లో కౌతాళంలోని జెడ్పీ హైస్కూల్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు బస్టాండ్ సెంటర్‌లో ప్రసంగిస్తారు. సాయంత్రం 6.10 గంటలకు గూడూరుకు చేరుకుని బస్టాండ్ సర్కిల్‌లో 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు సభలో మాట్లాడతారు. రాత్రికి గూడూరులోనే బస చేస్తారు.

News April 28, 2024

రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: కలెక్టర్

image

ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ సిబ్బంది కి సంబంధించి రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను ఆన్లైన్ సాఫ్ట్‌వేర్‌లో పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డా. జి.సృజన తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జనరల్ అబ్జర్వర్లు జాఫర్, మీర్ తారిఖ్ ఆలీ సమక్షంలో పోలింగ్ సిబ్బందికి సంబంధించిన రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు.

News April 27, 2024

ఏపీ సెట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

image

కర్నూలు: విశ్వవిద్యాలయాలతో పాటు డిగ్రీ కళాశాల అధ్యాపకుల అర్హత పరీక్ష ఆదివారం నిర్వహిస్తున్నట్లు పరీక్షల కన్వీనర్ శనివారం ప్రకటనలో వెల్లడించారు. కర్నూలులోని 9 పరీక్ష కేంద్రాల్లో దాదాపు 3,883 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఉదయం 9:30 గంటలకల్లా పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు చేరుకోవాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పరీక్షను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

News April 27, 2024

పతకాలు సాధించే క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు: కలెక్టర్

image

పతకాలు సాధించే క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్ డా.జి.సృజన అన్నారు. శనివారం స్థానిక జొహరాపురంలోని టెన్నిస్ కోర్టులో నిర్వహించిన రెండు రోజుల గ్రేటర్ రాయలసీమ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో గెలుపొందిన క్రీడాకారులకు ట్రోఫీ, ప్రశంసా పత్రాలను అందజేశారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉంటానన్నారు.