India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో ఎన్నికల కోడ్ పక్కాగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జీ.సృజన శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘించిన 32 మంది వాలంటీర్లను తొలగించామన్నారు. ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన 9 మంది రేషన్ డీలర్లతో పాటు ఇతరులపై చర్యలు తీసుకున్నామన్నారు.
అవుకు మండలంలోని కాశీపురం గ్రామానికి చెందిన కౌలు రైతు పుల్లయ్య(34) అప్పుల బాధతో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. పుల్లయ్య అదే గ్రామానికి చెందిన రైతు వద్ద 4 ఎకరాలు కౌలుకు తీసుకొని మిరప పంట సాగు చేశారు. ఈ ఏడాది మిరప పంట ధర పూర్తిగా పతనం కావడంతో సుమారు రూ.6 లక్షల మేర నష్టం వాటిల్లింది. దీంతో మనస్తాపం చెంది ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి శుక్రవారం జరిగిన నామినేషన్ స్క్రూటినీ ప్రక్రియ ముగిసిందని రిటర్నింగ్ అధికారి భార్గవ్ తేజ ప్రకటించారు. మొత్తం 40 నామినేషన్లు పరిశీలించగా.. అందులో 13 నామినేషన్లను వివిధ కారణాల వల్ల తిరస్కరించినట్లు ప్రకటించారు. 27 మంది అభ్యర్థుల నామినేషన్లను అనుమతించామని ప్రకటించారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యత గురించి ఆళ్లగడ్డకు చెందిన ప్రముఖ చిత్రకారుడు విజయ్ తమ కుంచె నుంచి వ్యంగ్య కార్టూన్ను రూపొందించారు. సామాజిక స్పృహ కలిగిన ఓటర్లు అందరూ నోటుకో , మద్యానికో .. తమ ఓటు అమ్ముకోకుండా ప్రతి ఒక్కరూ సమాజానికి ఉపయోగపడే సరైన నాయకుడిని ఎంచుకోవాలని ఆర్టిస్ట్ విజయ్ తమ కార్టూన్ రూపంలో తెలిపారు. ఈ చిత్రం పలువురిని ఆలోచింపజేస్తుంది.
ఈనెల 27న పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు నంద్యాల ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. జిల్లాలో 18 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, 5,460 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని, గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. గుంటూరు సెక్షన్లో భద్రతాపరమైన పనుల వల్ల ఈ ఏడాది ఏప్రిల్ వరకు రద్దు చేసిన డోన్-గుంటూరు-డోన్ (17227/28) రైలును పునరుద్ధరించనున్నట్లు వెల్లడించింది. డీఆర్సీసీ మెంబర్ జుబేర్ బాషా కృషి ఫలితంగా ఈరైలును పునరుద్ధరించనున్నట్లు అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
డోన్ నియోజకవర్గంలో 1952 నుంచి ఇప్పటి వరకు 15సార్లు సాధారణ ఎన్నికలు, రెండుసార్లు ఉపఎన్నికలు జరిగాయి. ఇందులో 8సార్లు కాంగ్రెస్, 4సార్లు టీడీపీ, రెండుసార్లు వైసీపీ గెలిచింది. 2014,19 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టీడీపీ అభ్యర్థి కేఈ ప్రతాప్పై గెలిచారు. ఈసారి ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిపై బుగ్గన గెలిచి హ్యాట్రిక్ కొట్టేనా..? కామెంట్ చేయండి.
కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి డా. సృజనకు అందజేశారు. బీవై రామయ్య కుటుంబం పేరిట రూ.2.98కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. రామయ్యకు అప్పు రూ.30.78లక్షలు ఉన్నట్లు వెల్లడించారు. ఆయనపై అస్పరి పోలీసు స్టేషన్లో ఈ ఏడాది ఒక కేసు నమోదైంది.
నామినేషన్ల స్వీకరణకు 25వ తేదీ చివరి గడువు కావడంతో నామినేషన్లు వెల్లువలా దాఖలు అయ్యాయి. కర్నూలు ఆర్వో కార్యాలయమైన మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఒకేరోజు 21 నామినేషన్లు అభ్యర్థులు దాఖలు చేశారు. నామినేషన్లు ముగిసే నాటికి మొత్తం కలిపి 56 నామినేషన్లు దాఖలు అయ్యాయని కర్నూలు మున్సిపల్ కమిషనర్, ఆర్వో ఏ.భార్గవ తేజ తెలిపారు.
ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థుల నిబంధనలు ఉల్లంఘనలపై ఫిర్యాదులు చేయవచ్చని జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. నంద్యాల పార్లమెంట్ పరిధిలో 08514-293917, ఆళ్లగడ్డ, నంద్యాల, బనగానపల్లె, అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 08514-293910, శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం పోలీస్ అబ్జర్వర్ హిమాన్సు శంకర్, 08514-293913 నంబర్లకు ఫిర్యాదులు అందించాలని విజ్ఞప్తి చేశారు.
Sorry, no posts matched your criteria.