Kurnool

News April 25, 2024

పాణ్యం అభ్యర్థిగా నిరుద్యోగి నామినేషన్

image

పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థిగా నిరుద్యోగి అయ్యన్న నామినేషన్ వేశారు. రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ(RSP) తరఫున ఆయన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ.. పాణ్యం నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారమే ఎజెండాగా ప్రజల ముందుకు వస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.

News April 25, 2024

కుంభోత్సవం వేడుకలకు ముస్తాబవుతున్న శ్రీశైలం

image

కుంభోత్సవం సందర్భంగా శ్రీశైలం ఆలయం ముస్తాబవుతుంది. ఈ మేరకు శ్రీశైలం ఆలయ ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇప్పటికే కుంభోత్సవం ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆలయాన్ని వివిధ రకాల ద్రవ్యాలతో విశేషంగా అలంకరిస్తున్నారు. ఆలయ పరిధిలో పక్షి, జంతుబలులు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

News April 25, 2024

కడిమెట్లలో 40 ఏళ్ల తర్వాత తొలిసారి ప్రచారం

image

ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల MLA చెన్నకేశవ రెడ్డి స్వగ్రామం. 40 ఏళ్లుగా ఈ ఊరును MLA తన కంచుకోటగా మార్చుకున్నారు. ఇక్కడ ప్రతిసారి ఏకపక్షంగా ఓట్లు పడేవి. ఈ ఊరిలో ప్రత్యర్థులు ప్రచారం చేసేవాళ్లు కాదు. దాదాపు 40 ఏళ్ల తర్వాత తొలిసారి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవీ జయనాగేశ్వర రెడ్డి ఆ గ్రామంలో ప్రచారం చేశారు. కడిమెట్లతో పాటు పరిసర గ్రామాల్లో 12 వేల ఓట్లు ఉండగా.. ఈసారి ఓటింగ్‌పై అందరి దృష్టి నెలకొంది.

News April 25, 2024

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ

image

ఫ్యాక్షన్ గ్రామాల పికెట్లు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కర్నూలు ఎస్పీ జీ.కృష్ణకాంత్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా చేసుకుని విధులు నిర్వహించాలని ఆదేశించారు. కొత్త వ్యక్తులు వస్తే ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు.

News April 25, 2024

రేపు శ్రీశైలంలో కుంభోత్సవం

image

ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహా క్షేత్రంలో శుక్రవారం కుంభోత్సవం నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. భ్రమరాంబ దేవికి సాత్విక బలి, స్వామివారికి అన్నాభిషేకం, కుంభ హారతి, (స్త్రీ వేషంలో పురుషులు అమ్మవారికి హారతి) సమర్పిస్తారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని స్వామి, అమ్మవార్ల కళ్యాణోత్సవం, ఏకాంత సేవ, అన్ని ఆర్జిత సేవలు నిలుపివేశారు.

News April 25, 2024

కర్నూలు: రానున్న మూడు రోజులు భగ భగలే..!

image

రానున్న రెండు, మూడు రోజుల పాటు 46-47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. బుధవారం మహానందిలో 44.2 డిగ్రీలు, బనగానపల్లె, డోన్‌లో 44.1, కోడుమూరులో 43.9, కర్నూలులో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంత్రాలయం, కోడుమూరు, గూడూరు, దేవనకొండ, డోన్, చాగలమర్రి, గడివేముల, దొర్నిపాడు, రుద్రవరం మండలాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.

News April 25, 2024

కర్నూలు: కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా విడుదల

image

కర్నూలు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను బుధవారం డీసీసీ అధ్యక్షుడు కే.బాబురావు విడుదల చేశారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా షేక్ జిలానీ బాషా, ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎం.కాశీం వలి, మంత్రాలయం అసెంబ్లీ స్థానానికి పీఎస్ మురళీకృష్ణ రాజు పేర్లను ఖరారు చేసినట్టు ఆయన వెల్లడించారు.

News April 25, 2024

వైసీపీ కర్నూలు పార్లమెంట్ పరిశీలకుడిగా గోరంట్ల మాధవ్

image

వైసీపీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడిగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కురువ సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణమ్మను ఇప్పటికే ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా నియమించింది. తాజాగా ఇదే సామాజిక వర్గానికి చెందిన మాధవ్‌ నియామకంతో పార్టీకి కలిసి వస్తుందని అధిష్ఠానం భావిస్తోంది.

News April 25, 2024

కర్నూలు: నిరుద్యోగి నామినేషన్ దాఖలు

image

కర్నూలు జిల్లా ఆస్పరికి చెందిన బోయ రంగస్వామి అనే నిరుద్యోగి బుధవారం ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేశారు. తహశీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. రంగస్వామి మాట్లాడుతూ.. పాలక, ప్రతిపక్ష పార్టీలు అవలంబిస్తున్న నిరుద్యోగ విధానాలకు వ్యతిరేకంగా యువత నడుం బిగించాలనే ఉద్దేశంతో నామినేషన్ వేసినట్లు తెలిపారు. యువత మేలుకోవాలని, భవిష్యత్తును మనమే మార్చుకోవాలని అన్నారు.

News April 25, 2024

రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఎలక్షన్ కోఆర్డినేటర్‌గా జై కాంత్

image

రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ వ్యవహారాల ఎలక్షన్ కోఆర్డినేటర్ల బృందంలో జిల్లాకు చెందిన ఎస్.జై కాంత్‌ను నియమించినట్లు YCP కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ కమిటీ పని చేస్తుందని పేర్కొంది. క్రిస్టియన్ మైనార్టీ వ్యవహారాలు ఎలక్షన్ నిబంధనలో వ్యవహరించాల్సిన తీరును కోఆర్డినేటర్లు పరీక్షిస్తారని తెలిపింది. ఈ బృందంలో ఐదుగురు రాష్ట్రస్థాయి సభ్యులు ఉన్నారు.