Kurnool

News April 25, 2024

26న స్క్రూటినీ ప్రక్రియకు హాజరు అవ్వండి: జేసీ

image

ఈ నెల 26న జరిగే నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియకు రాజకీయ పార్టీ ప్రతినిధులు తప్పనిసరిగా హాజరయ్యే విధంగా చూడాలని పాణ్యం రిటర్నింగ్ అధికారి/జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య రాజకీయ పార్టీ ప్రతినిధులకు తెలిపారు. బుధవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్‌లో రాజకీయ పార్టీ ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

News April 25, 2024

కర్నూలు జిల్లాలో 180 నామినేషన్లు దాఖలు

image

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కర్నూలు జిల్లాలో నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. తొలి రోజు నుంచి నేటి వరకు జిల్లాలోని పార్లమెంట్‌తో పాటు 8 నియోజకవర్గాలకు 180 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు తెలిపారు. పాణ్యం, కర్నూలు, కోడుమూరు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలకు సంబంధించి 161 మంది అభ్యర్థులు 180 నామినేషన్ పత్రాలను అందజేశారన్నారు.

News April 25, 2024

సూపర్ రేంజర్స్ పార్టీ మేనిఫెస్టో విడుదల

image

సూపర్ రేంజర్స్ పార్టీ మేనిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర బుధవారం విడుదల చేశారు. కుటుంబానికి రూ.లక్ష, యువతులకు మొబైల్ ఫోన్, మహిళలకు కొత్త గ్యాస్ కనెక్షన్, యువకులకు ఉచితంగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే వారికి రూ.2 లక్షల అందజేస్తామన్నారు. కర్నూలు ఎమ్మెల్యేగా గెలిపించిన 5 ఏళ్లలో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.

News April 25, 2024

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ

image

కర్నూలు జిల్లా వెల్దుర్తిలోని ఫ్యాక్షన్ గ్రామాల పికెట్లు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను బుధవారం ఎస్పీ జి. కృష్ణకాంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పకడ్బందీగా విధులు నిర్వహించాలని
సిబ్బందికి సూచనలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.

News April 25, 2024

కర్నూలు టీడీపీ అభ్యర్థి ఆస్తి విలువ రూ.278.27 కోట్లు

image

కర్నూలు టీడీపీ అభ్యర్థిగా టీజీ భరత్ మంగళవారం రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. టీజీ భరత్ మెుత్తం ఆస్తుల విలువ రూ.278.27 కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. చరస్తుల విలువ రూ.83.08కోట్లు, స్థిరాస్తుల విలువ రూ.195.19 కోట్లుగా పేర్కొన్నారు. అప్పులు రూ.19.38 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు.

News April 25, 2024

పాణ్యంలో గెలుపునకు వారే కీలకం

image

పాణ్యం, గడివేముల, ఓర్వకల్లు, కల్లూరు మండల పరిధిలో కర్నూలు కార్పొరేషన్‌లోని 16 వార్డులు కలిపి 2009లో నియోజకవర్గంగా ఏర్పడింది. కాగా పాణ్యం మండలంలో 36,893 ఓటర్లు, ఓర్వకల్లు మండలం 48,121, గడివేముల 34,411, కల్లూరు మండలంలో 2,03,068 మంది ఓటర్లతో కలిపి మెుత్తం ఓటర్లు 3,22,493 ఉన్నారు. పాణ్యం నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపులో కల్లూరు మండల ఓటర్లు కీలక పాత్ర వహించనున్నాయి.

News April 25, 2024

REWIND: ఆలూరు ఏకైక మహిళా ఎమ్మెల్యే నీరజారెడ్డి

image

ఆలూరు నియోజకవర్గం మొదటి మహిళా ఎమ్మెల్యేగా నీరజారెడ్డి ఎన్నికయ్యారు. 1955 నుంచి 2019 వరకు ఎన్నికల వరకు అందరూ పురుషులే ఎమ్మెల్యేలు కాగా నీరజారెడ్డి మాత్రమే మహిళా ఎమ్మెల్యే కావడం గమనార్హం. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ప్రజారాజ్యం పార్టీ నుంచి బరిలో ఉన్న గుమ్మనూరు జయరాంపై విజయం సాధించారు. 2004లో మసాల పద్మజ, 2014లో కోట్ల సుజాతమ్మ కాంగ్రెస్, 2019లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు

News April 25, 2024

కాటసాని కుటుంబం పేరిట 245.6 ఎకరాల భూమి

image

కాటసాని రాంభూపాల్ రెడ్డి మొత్తం ఆస్తుల విలువ రూ.75.19 కోట్లుగా నామినేషన్ అఫిడవిట్‌లో ఎన్నికల అధికారులకు సమర్పించారు. కుటుంబం మెుత్తం చరాస్తుల విలువ రూ.26.95 కోట్లు, స్థిరాస్తులు విలువ రూ.48.24 కోట్లు.. అప్పులు రూ.3.01కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. భూమి ఎకరాల్లో కాటసాని పేరుతో 10.87, ఆయన సతీమణికి 164.33, కుమారుడు, కుమార్తెల పేరిట 70.40 ఎకరాలు ఉన్నట్లు పేర్కొన్నారు. కాటసానిపై ఒక్క కేసు ఉంది.

News April 25, 2024

39 మంది అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ: కలెక్టర్

image

నంద్యాల ఎంపీ స్థానానికి మంగళవారం నలుగురు, అసెంబ్లీ స్థానాలకు 35 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సమర్పించారని పేర్కొన్నారు. నంద్యాల పార్లమెంట్‌కు నలుగురు, ఆళ్లగడ్డకు ఆరుగురు, శ్రీశైలానికి ఆరుగురు, నందికొట్కూరుకు నలుగురు, నంద్యాలకు 11 మంది, బనగానపల్లెకు ఆరుగురు, డోన్‌కు ఇద్దరు దాఖలు చేశారన్నారు.

News April 25, 2024

ప్రశాంత ఎన్నికలే లక్ష్యం: ఎస్పీ

image

ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కర్నూలు ఎస్పీ జి. కృష్ణ కాంత్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను మంగళవారం పరిశీలించారు. సి.బెలగళ్ పోలీసుస్టేషన్ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలైన పోలకల్, గొల్లల దొడ్డి గ్రామాలను సందర్శించి పరిశీలించారు. అక్కడ భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు.