Kurnool

News April 24, 2024

పెద్దకడబూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

పెద్దకడబూరు మండలంలోని హనుమాపురం గ్రామ శివారులోని ఎల్లెల్సి సమీపంలో జాతీయ రహదారిలో సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందారు. గుడేకల్ గ్రామానికి చెందిన వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 24, 2024

కర్నూలు: గవర్నమెంట్ స్కూల్‌లో చదివి..593 మార్కులు

image

దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామనికి చెందిన త్రివేణి  గవర్నమెంట్ స్కూల్‌లో చదివి టెన్త్ ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించింది. విద్యార్థిని తండ్రి నాగేశ్ ఆటో నడుపుతున్నాడు. పదో తరగతి ఫలితాలలో 600 మార్కులకుగాను 593 మార్కులు సాధించింది.

News April 24, 2024

మల్లన్నను దర్శించుకున్న నారా చంద్రబాబు దంపతులు

image

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీసమేతంగా సోమవారం శ్రీశైలం ఆలయానికి వచ్చారు. శ్రీ భ్రమరాంబికా, మల్లికార్జున స్వామి వారి దర్శనార్థం వచ్చిన నారా చంద్రబాబు నాయుడు దంపతులకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామి అమ్మవార్లను దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు. బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

News April 24, 2024

వైసీపీ MLA అభ్యర్థిగా బుగ్గన నామినేషన్

image

డోన్ నియోజకవర్గ వైసీపీ MLA అభ్యర్థిగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. బుగ్గన వెంట నంద్యాల పార్లమెంట్ వైసీపీ MP అభ్యర్థి పోచా బ్రహ్మానంద రెడ్డి ఉన్నారు. వరుసగా మూడోవ సారి డోన్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

News April 24, 2024

టెన్త్ ఫలితాల్లో.. రాష్ట్రంలో కర్నూలు జిల్లానే చివరి స్థానం

image

టెన్త్ ఫలితాల్లో రాష్ట్రంలో కర్నూలు జిల్లా మెుత్తం 30802 మందికి 19242 మంది పాసయ్యారు.62.47 ఉత్తీర్ణతతో చివరిస్థానంలో నిలిచింది. బాలురు 16276 మందికిగాను 9313మంది, బాలికలు 14526 మందికిగాను 9929 మంది ఉత్తీర్ణత సాధించారు. నంద్యాల జిల్లాలో 23787 మందికి గాను 20367 మంది పాసయ్యారు. 85.62ఉత్తీర్ణత శాతంతో 19వ స్థానంలో నిలిచింది. బాలురు 12283 మందికిగాను 10216.. బాలికలు 11504కు గాను 10151 మంది పాసయ్యారు.

News April 22, 2024

నంద్యాల: వివాహ వేడుకలో కారం చల్లి పెళ్లికూతురి ఆపహరణ

image

పెళ్లికూతురిని ఆహరణకు యత్నించిన ఘటన తూగో జిల్లా కడియం(M)లో జరిగింది. కడియం సీఐ వివరాలు..చాగలమర్రి(M) గొడిగనూరుకు చెందిన స్నేహ, కడియంకు చెందిన బత్తిన వెంకటనందు నరసరావుపేటలో ఓ కాలేజీలో చదివారు. ఈ క్రమంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వెంకటనందు తన ఇంట్లో చెప్పగా పెద్దలు అంగీకరించారు. ఆదివారం మరోసారి పెళ్లి చేస్తుండగా పెళ్లికుతూరు తరుఫువాళ్లు వచ్చి వారిపై కారం చల్లి స్నేహ అపహరణకు యత్నించారు.

News April 22, 2024

కర్నూలు: ఈ నియోజకవర్గంలో మెుదటి ఎమ్మెల్యే.. స్వతంత్ర అభ్యర్థి

image

ఆదోని నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరగగా అందులో రెండుసార్లు ఇండిపెండెంట్ అభ్యర్థులే గెలిచారు. 1952లో మెుదటిసారి జరిగిన ఎన్నికల్లో పదిమంది అభ్యర్థులు పోటీ పడ్డారు. స్వతంత్ర అభ్యర్థి హెచ్.రామలింగారెడ్డి.. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి టి.మల్లయ్యపై 5561 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 1962లో సీతారామరెడ్డి(ఇండిపెండెంట్).. తిమ్మారెడ్డి(కాంగ్రెస్)పై 4770 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

News April 22, 2024

నంద్యాల  జిల్లాలో చంద్రబాబు షెడ్యూల్

image

నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో కొలువైన శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు నేటి సోమవారం దర్శించుకున్నారు. హైదరాబాద్ బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10.15 గంటలకు సున్నిపెంటకు చేరుకుంటారు. 10.45 సాక్షిగణపతి దర్శించుకుంటారు. 11.20 వీరభద్రస్వామి దర్శనం,11.40 నుంచి12.30 గంటల మధ్య భ్రమరాంబ మల్లిఖార్జున స్వాములను దర్శించుకుంటారు.

News April 22, 2024

22వ తేది లోపు పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

image

పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన పీఓ, ఏపీఓలు ఏప్రిల్ 22వ తేదిలోపు దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులను జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.జి.సృజన అదేశించారు. ఆదివారం పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై రిటర్నింగ్ అధికారులు, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులు, తహసీల్దార్లతో కలెక్టర్ డా.జి.సృజన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

News April 21, 2024

ఆదోని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిపై కేసు నమోదు

image

ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద ఎన్డీఏ అభ్యర్థి పార్థసారథిపై ఆదివారం కేసు నమోదైందని టూ టౌన్ సీఐ గోపి తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్థసారథి శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారన్నారు. ఆ సమయంలో ఐదుగురికి బదులు 8 మంది వెళ్లడంతో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, గుడిసె కృష్ణమ్మ, సూరం భాస్కర్ రెడ్డి, మరో నలుగురిపై 188 సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు.