India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నంద్యాల జిల్లా నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా బి.మాధవ స్వామి, నగిరి శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు హృదయ రాజు తెలిపారు. శనివారం నంద్యాల పట్టణంలోని జిహెచ్ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏపీటీఎఫ్ నంద్యాల జిల్లా సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నూతన కమిటీ కృషిచేయాలని హృదయ రాజు ఆకాంక్షించారు.
కర్నూలు జిల్లా తుగ్గలిలో తొలకరి జల్లులు కురవడంతో ఇక్కడి ప్రజలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. జొన్నగిరి గ్రామ పొలాల్లోకి వెళ్లి వజ్రాల అన్వేషణ ను శనివారం ప్రారంభించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వజ్రాల వేట సాగుతోంది. ఒక్క వజ్రం దొరికితే తమ తలరాత మారిపోతుందన్న ఆశతో వజ్రాలు వెదుకుతున్నారు. గతేడాది కోట్ల విలువ చేసే వజ్రాలు దొరకడంతో ఆశలు చిగురించి ఈఏడాది జనం భారీగా పొలాల్లోకి తరలి వస్తున్నారు.
ఆలూరు విద్యుత్ శాఖ ఏడీఈ నాగేంద్ర ప్రసాద్పై సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల ముందు రోజు హాలహర్వి మండలంలో పలుచోట్ల విద్యుత్ సేవలకు అంతరాయం ఏర్పడింది. హొలగుంద మండలంలో ట్రాన్స్ఫార్మర్, స్తంభాల అనధికారిక ఏర్పాట్లు, మే 13న పలు పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం వరకు విద్యుత్ అసౌకర్యం నెలకొనడంతో పాటు విధి నిర్వహణలో అలసత్వం వహించడం, అవినీతికి పాల్పడడంతో ఉన్నతాధికారులు ఆయనపై వేటు వేశారు.
శ్రీశైలం వెస్టర్న్ కాలనీలోని నల్లబోతుల మల్లికార్జున ఇంటి ఆవరణలో కట్టేసిన కుక్కను చిరుత పులి చంపిన ఘటన అర్ధరాత్రి చోటు చేసుకుంది. మల్లికార్జున తెలిపిన వివరాల మేరకు.. రాత్రి రెండు గంటల సమయంలో పెద్ద శబ్దం వచ్చిందని ఆ సమయంలో బయటకు రాకుండా ఉదయం చూస్తే కుక్క చనిపోయి ఉందన్నారు. అటవీశాఖ సిబ్బంది వచ్చి పరిశీలించి చిరుతపులి దాడి చేసినట్లు పేర్కొన్నట్లు తెలిపారు.
తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాల్లో కర్నూలు విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. కాసేపటి క్రితం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. టాప్-5లో కర్నూలు జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులు నిలిచారు. ఇంజినీరింగ్ విభాగంలో హర్ష స్టేట్ సెకెండ్ ర్యాంకు సాధించగా.. సాయియశ్వంత్ రెడ్డి ఐదో ర్యాంకు సాధించారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాబోయే ఐదు రోజుల్లో చిరు జల్లుల నుంచి తేలికపాటి వర్ష సూచన ఉందని శుక్రవారం బనవాసి ఫారం కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త అశోక్ కుమార్ తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 36.2 డిగ్రీల నుంచి 40 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 24.6 డిగ్రీల నుంచి 27.4 డిగ్రీల వరకు ఉంటాయన్నారు. వర్షాలు కురవడంతో రైతులు లోతు దుక్కులు చేసుకోవాలని సూచించారు. నిన్న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డాయి.
రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో వజ్రాల అన్వేషణ మొదలైంది. ఉమ్మడి జిల్లాతో పాటు, కడప, కర్ణాటక ప్రంతాల నుంచి పలువురు జొన్నగిరికి చేరుకుని వజ్రాలను అన్వేషిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలాలు, కొండ ప్రాంతాలలో వజ్రాల వేట సాగిస్తున్నారు. కాగా పలుసార్లు ఈ ప్రాంతంలో వజ్రాలు లభించిన విషయం తెలిసిందే.
డోన్ పట్టణ రైల్వే గేటు వద్ద ఈనెల 12న ఓ మగ బిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. డోన్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సిబ్బందితో కలిసి సీడీపీఓ.. పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించి బాబును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కర్నూలు చైల్డ్ హోమ్కు తరలించారు. బాలుడికి సంబంధించిన తల్లిదండ్రులు, బంధువులు తగిన ఆధారాలు చూపించి తీసుకెళ్లాలని శుక్రవారం కోరారు.
జూన్ 4న నిర్వహించనున్న ఎన్నికల కౌంటింగ్కు సచివాలయ సిబ్బంది సేవలు వినియోగించుకోవడం లేదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జీ.సృజన శుక్రవారం తెలిపారు. కౌంటింగ్ విధులకు తగినంత ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని పేర్కొన్నారు. అదనంగా సచివాలయ సిబ్బంది అవసరం లేదని స్పష్టం చేశారు.
ప్రజలు అతిసారం బారిన పడకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు ఆదేశించారు. శుక్రవారం కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రామతీర్థం, యర్రగుంట్ల గ్రామాల్లో వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న బాధితులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలన్నారు.
Sorry, no posts matched your criteria.