Kurnool

News March 14, 2025

కర్నూలు జిల్లా వాసికి ఆల్ ఇండియా 199వ ర్యాంకు

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్, కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ తుది పరీక్ష ఫలితాలలో కర్నూలు జిల్లా పెద్దకడబూరుకు చెందిన వంశీ కృష్ణారెడ్డి అనే వ్యక్తి 199వ ర్యాంకు సాధించాడు. దీంతో ఇన్కమ్ టాక్స్ ఉద్యోగానికి ఎంపికయ్యాడని తండ్రి వెంకటరెడ్డి తెలిపారు. కృష్ణారెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడు కీ.శే వెంకటరెడ్డికి ముని మనవడు కావడం విశేషం. కృష్ణారెడ్డికి పలువురు అభినందనలు తెలిపారు.

News March 14, 2025

అక్రమాలకు పాల్పడకుండా పర్యవేక్షణ చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల వివరాలతో పాటు ప్రతిపాదించిన ప్రాజెక్టులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జలవనరుల శాఖ అధికారులను కలెక్టర్ పీ.రంజిత్ బాషా ఆదేశించారు. గురువారం కర్నూలు కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టుల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. నీటి విడుదలలో అక్రమాలకు పాల్పడకుండా పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు.

News March 13, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

image

➤ మంత్రాలయంలో ఆకట్టుకున్న భారీ రంగోలి
➤ రూ.2.06 కోట్ల నిధుల వినియోగానికి పచ్చజెండా: మేయర్
➤ హౌసింగ్ లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సహాయం: కలెక్టర్
➤ రేపు పత్తికొండలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ కు భూమిపూజ
➤ ఆదోని నియోజకవర్గ సమస్యలపై MLA పార్థసారథి అసెంబ్లీలో గళం 
➤ వైసీపీపై అసెంబ్లీలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఆగ్రహం
➤ కూటమి ప్రభుత్వంపై బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి తీవ్ర విమర్శలు

News March 13, 2025

రూ.2.06 కోట్ల నిధుల వినియోగానికి పచ్చజెండా: మేయర్

image

కర్నూలులో మౌలిక వసతుల కల్పనే తమ ప్రధాన లక్ష్యమని నగర మేయర్ బీవై రామయ్య అన్నారు. గురువారం కర్నూలు నగర పాలక కార్యాలయంలో స్థాయి సంఘ సమావేశం నిర్వహించారు. 10 తీర్మానాలను, సాధారణ నిధుల నుంచి రూ.2.06 కోట్ల నిధుల వినియోగానికి పచ్చజెండా ఊపారు. మేయర్ మాట్లాడుతూ.. ప్రజా విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు.

News March 13, 2025

రేపు పత్తికొండలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్‌కు భూమిపూజ

image

పత్తికొండ మండలంలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు మరో ముందడుకు పడింది. రూ.11కోట్ల వ్యయంతో కోతిరాళ్ల పంచాయతీ పరిధిలో ఈ యానిట్ ఏర్పాటుకు రేపు భూమి పూజ జరగనుంది. మంత్రి TG భరత్, ఎమ్మెల్యే శ్యామ్‌కుమార్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించనున్నారు. కాగా పత్తికొండ, మద్దికెర, తుగ్గలి, క్రిష్ణగిరి, వెల్దుర్తి మండలాల్లో టమాటా అధికంగా సాగువుతోంది. ఈయూనిట్ ప్రారంభమైతే తమకు ధర లభిస్తుందని రైతులు ఆశిస్తున్నారు.

News March 13, 2025

రేపు పత్తికొండలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్‌కు భూమిపూజ

image

పత్తికొండ మండలంలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు మరో ముందడుకు పడింది. రూ.11కోట్ల వ్యయంతో కోతిరాళ్ల పంచాయతీ పరిధిలో ఈ యానిట్ ఏర్పాటుకు రేపు భూమి పూజ జరగనుంది. మంత్రి TG భరత్, ఎమ్మెల్యే శ్యామ్‌కుమార్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించనున్నారు. కాగా పత్తికొండ, మద్దికెర, తుగ్గలి, క్రిష్ణగిరి, వెల్దుర్తి మండలాల్లో టమాటా అధికంగా సాగువుతోంది. ఈయూనిట్ ప్రారంభమైతే తమకు ధర లభిస్తుందని రైతులు ఆశిస్తున్నారు.

News March 13, 2025

భవన నిర్మాణానికి 24 గంటల్లో అనుమతులు

image

భవన నిర్మాణ అనుమతుల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఇక ఉండదని, దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో అనుమతులు పొంది నిర్మాణాలు ప్రారంభించుకోవచ్చని పట్టణ ప్రణాళిక శాఖ అనంతపురం ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్ విజయ భాస్కర్ తెలిపారు. బుధవారం కర్నూలులో ఉమ్మడి కర్నూలు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. దరఖాస్తు పోర్టల్‌లో అప్లోడ్ చేసిన గంటల వ్యవధిలోనే అనుమతులు పొంది పనులు ప్రారంభించుకోవచ్చని తెలిపారు.

News March 13, 2025

ప్రభుత్వ సేవలకు లబ్ధిదారుల్లో సంతృప్తి ఉండాలి: కలెక్టర్

image

మహిళా సంఘాల సభ్యులతో ఎంఎస్ఎమ్ఈల ఏర్పాటుకు డీపీఆర్‌లు రూపొందించాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా సంబంధిత శాఖల అధికారులను బుధవారం ఆదేశించారు. కర్నూలు కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో సీఎం అధ్యక్షతన నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో చర్చించిన అంశాలు, తీసుకున్న చర్యలపై జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సేవలకు సంబంధించి లబ్ధిదారుల్లో సంతృప్తి ఉండాలని సూచించారు.

News March 12, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యంశాలు

image

➤ఆదోని ఘటనపై సీఎం, మంత్రుల దిగ్భ్రాంతి
➤ మహిళపై అత్యాచారయత్నం.. వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ కేసు
➤ హీరో బైక్ గెలుచుకున్న కర్నూలు యువకుడు
➤ ఆదోనిలో సంచలనంగా ఈశ్వరప్ప మృతి
➤ ఇంటర్ పరీక్షలు.. ఇద్దరు విద్యార్థుల డిబార్
➤ పోసాని కృష్ణమురళి విడుదలకు బ్రేక్.. గుంటూరుకు తరలింపు
➤ విద్యార్థులను మోసం చేసింది చంద్రబాబే: ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
➤ రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం ఆపండి

News March 12, 2025

కర్నూలు జిల్లాలో ఇద్దరు విద్యార్థుల డిబార్

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా బుధవారం ఇంటర్మీడియట్ రెండో సంవత్సర విద్యార్థులకు ఫిజిక్స్‌ పేపర్ 2, ఎకనామిక్స్‌ పేపర్ 2 పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలో ఇద్దరు విద్యార్థులను డిబార్ చేసినట్లు ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి గురువయ్య శెట్టి తెలిపారు. 20,499 మంది పరీక్షకు హాజరు కాగా 401 విద్యార్థులు గైర్హాజరైనట్లు వివరించారు. మద్దికేరలోని ఏపీ మోడల్ జూనియర్ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు డిబార్ అయినట్లు చెప్పారు.