India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఈనెల 15, 16వ తేదీలలో కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు వెల్లడించారు. 15న కర్నూలులోని కిమ్స్ హాస్పిటల్ ఆటో స్టాండ్ నుంచి ర్యాలీ ప్రారంభమై కొండరెడ్డి బురుజు వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. రాత్రికి కర్నూలులోనే బస చేసి, 16న ఎమ్మిగనూరులో సాయంత్రం 4 గంటలకు, కోసిగిలో సాయంత్రం 6 గంటలకు ప్రసంగిస్తారని వివరించారు.
చంద్రబాబు, లోకేశ్ ప్రోద్బలంతోనే సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిందని ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విరుపాక్షి ఆరోపించారు. ఆదివారం ఆలూరులో అయన విలేకర్లతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి జరగడం దారుణమని, ప్రతిపక్ష నాయకులు ఓటమి భయాన్ని తట్టుకోలేక దాడులకు పాల్పడ్డారని అన్నారు. మరొకసారి వైసీపీకి ప్రజలు అధికారం కట్టబెడతారని ధీమా వ్యక్తం చేశారు.
రాజ్యాంగ స్ఫూర్తితో అంబేడ్కర్ సేవలను కొని అడుగుదామని కలెక్టర్ డా.జి.సృజన అన్నారు. భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం కర్నూలులోని పెద్ద బస్టాండ్లో ఉన్న ఆయన విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువతరం అంబేడ్కర్ అడుగుజాడల్లో నడిచి దేశాభివృద్ధికి కృషి చేయాలన్నారు.
కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి డాక్యుమెంటేషన్ సరిగా లేనందున ప్రచార అనుమతుల కోసం వచ్చిన వాటిలో 27 దరఖాస్తులను తిరస్కరించినట్లు నోడల్ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. మొత్తం 54 దరఖాస్తులు వచ్చాయని, 27 దరఖాస్తులకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. పబ్లిక్ మీటింగ్లు, ఇంటింటి ప్రచారం, ర్యాలీలు, కరపత్రాల పంపిణీ, హోల్డింగ్ల ఏర్పాటు.. ఇలా 20 రకాల కార్యక్రమాలకు అనుమతులు తప్పనిసరని అన్నారు.
వెల్దుర్తి మండల కేంద్రంలోని సచివాలయం-3లో విధులు నిర్వహిస్తున్న అదే గ్రామానికి చెందిన చంద్రనారాయణ (జేఎల్ఎమ్), డోన్లో నివాసముంటున్న ఇంజినీరింగ్ అసిస్టెంట్ స్రవంతి శుక్రవారం ప్రేమ వివాహం చేసుకున్నారు. శనివారం స్రవంతి తమ్ముడు, తల్లి, మరికొందరు వెల్దుర్తికి వచ్చి చంద్రనారాయణ ఇంటి వద్ద గొడవ చేశారు. దీంతో తమకు రక్షణ కల్పించాలని ఆ జంట కర్నూలు పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించింది.
దేవనకొండ మండలం తెర్నెకల్లోని పేద కుటుంబానికి చెందిన కిరణ్, జయలక్ష్మి దంపతుల కూతురు అనూష ఆరెకల్లోని బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ చదువుతోంది. శుక్రవారం విడుదలైన ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 965 మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచింది. మంచి మార్కులు సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకురావడంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
ఓటు హక్కును నమోదు చేసుకోనివారు నమోదుకు మూడు రోజులు మాత్రమే గడువు ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జి.సృజన శనివారం పేర్కొన్నారు. కొత్తగా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 15తో ముగియనుందన్నారు. 2006 మార్చి 31లోపు పుట్టిన వారు ఓటు హక్కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. ఇప్పటికే 18ఏళ్లు నిండినా ఓటు హక్కు లేని వారు కూడా అప్లై చేసుకోవాలని సూచించారు.
ఆల్ ఇండియా క్యారమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గత నెలలో వారణాసిలో జరిగిన జాతీయస్థాయి క్యారమ్స్ న్యాయం నిర్ణేతలు పరీక్షలో కర్నూలు జిల్లాకు చెందిన నాగేంద్ర హాజరై పరీక్షల ఉత్తీర్ణత సాధించినట్లు జిల్లా సంఘం కార్యదర్శి చెన్నకేశవరాజు తెలిపారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ.. జాతీయ స్థాయి న్యాయం నిర్ణేతగా అర్హత సాధించిన రెండో జిల్లా వాసిగా గర్వకారణం ఉందన్నారు.
చదువుకి పేదరికం అడ్డు కాదని కోసిగికి చెందిన S.లోకేష్ నిరూపించాడు. కోసిగి ప్రభుత్వ కాలేజీలో చదివి ఇంటర్ బైపీసీలో 964 మార్కులు సాధించాడు. తల్లిదండ్రులు బెంగళూరుకి వలస వెళ్లారు. కుటుంబానికి అండగా ప్రభుత్వ ఉద్యోగమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నానని విద్యార్థి తెలిపాడు.
జూపాడుబంగ్లా మండలంలోని మండ్లెం గ్రామంలో జరిగిన కర్రెమ్మ దేవత ఉత్సవాల సందర్భంగా దేవతకు బలి ఇచ్చిన దున్నపోతు మాంసం కోసం ఇరు వర్గాలకు చెందిన యువకులు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో పదిమందికి గాయాలయ్యాయి. అందులో ఒకరు తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం నందికొట్కూరు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రి వద్ద కూడా యువకులు ఘర్షణ పడటంతో పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.
Sorry, no posts matched your criteria.