Kurnool

News April 10, 2024

కర్నూలు జిల్లాలో ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేదెవరు..?

image

ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు YCP, TDP అధినేతలు జగన్, చంద్రబాబు వరాల జల్లులు కురిపిస్తున్నారు. అయితే ముస్లిం ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపుతారనేది జూన్ 4న తేలనుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధిక ముస్లిం ఓటర్ల కలిగిన నియోజకవర్గాల్లో.. కర్నూలు-85,000,
నంద్యాల-70,000, ఆదోని, పాణ్యం, ఆళ్లగడ్డ-50,000, శ్రీశైలం-47,000, బనగానపల్లె, నందికొట్కూరు-40,000, కోడుమూరు, ఎమ్మిగనూరు-32,000, డోన్-30,000 ఉన్నారు.

News April 10, 2024

కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే పోటీకి సిద్ధం: ఉమ్మి యూసుఫ్

image

ఆదోని ప్ర‌జ‌లు మార్పును కోరుకుంటున్నార‌ని, కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశిస్తే ఆదోని నుంచి ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా బ‌రిలో ఉంటాన‌ని ఉమ్మి యూసుఫ్ తెలిపారు. ఆయన ఇటీవ‌లే ఎంఐఎం నుంచి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆదోనిలోని ఆయ‌న నివాసంలో మంగళవారం విలేక‌రుల‌తో మాట్లాడారు. అధిష్ఠానం టికెట్ ఇత‌రుల‌కు ఇచ్చినా వారితో క‌లిసి ప‌ని చేస్తాన‌న్నారు. అభివృద్ధి జ‌ర‌గాలంటే ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్య‌మ‌న్నారు.

News April 10, 2024

పింఛన్ల పంపిణీలో నంద్యాలకు 3, కర్నూలు 6వ స్థానం

image

నంద్యాల: ఈనెల 3న ప్రారంభమైన పింఛన్ల పంపిణీ ముగిసింది. కర్నూలు జిల్లాలో 2,46,871 పింఛన్లకు గానూ 2,44,836 మందికి పంపిణీ చేశారు. వివిధ కారణాల వల్ల 2,035 మంది పింఛన్ తీసుకోలేదు. 99.18 శాతం పంపిణీతో రాష్ట్రంలో కర్నూలు జిల్లా 6వ స్థానంలో నిలిచింది. నంద్యాల జిల్లాలో 2,22,398 పింఛన్లు ఉండగా 2,21,228 మందికి పంపిణీ చేశారు. 99.23 శాతంతో రాష్ట్రంలో మూడవ స్థానంలో నిలిచింది.

News April 10, 2024

భానుడి భగభగలు.. ఆదోనిలో 42 డిగ్రీల నమోదు

image

భానుడి భగభగలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మంగళవారం ఆదోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలకు తోడు వడగాల్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మంత్రాలయంలో 41.3 డిగ్రీలు, చాగలమర్రిలో 40.6, కౌతాళంలో 40.3, గడివేములలో 40.2, బనగానపల్లె, డోన్, నందికొట్కూరు, గోస్పాడు మండలాల్లో 40.1, చిప్పగిరిలో 36.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News April 10, 2024

బీసీవై పార్టీ పత్తికొండ అభ్యర్థిగా మిద్దె వెంకటేశ్వర్లు

image

భారత చైతన్య యువజన పార్టీ(బిసివై) పత్తికొండ అసెంబ్లీ అభ్యర్థిగా మిద్దె వెంకటేశ్వర్లను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ మంగళవారం ప్రకటించారు. తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన వెంకటేశ్వర్లు సామాన్య రైతు కుటుంబం నుండి రాజకీయాల్లోకి వచ్చారు. బీసీ యువనేతగా ఉన్న ఆయనకు సర్వే ద్వారా సీటు కేటాయించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు.

News April 10, 2024

KNL: BCY పార్టీ అభ్యర్థులు వీరే

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 4 అసెంబ్లీ స్థానాలకు భారత చైతన్య యువజన పార్టీ(BCY) తరఫున MLA అభ్యర్థులను ఆ పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్ ప్రకటించారు. మిగిలిన 10 స్థానాలకు కూడా త్వరలో MLA, నంద్యాల, కర్నూలు ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. నంద్యాల – చింతలపల్లె సుధాకర రావు, డోన్- తరి గోపుల, బాలసుబ్బయ్య (బాలు యాదవ్) పత్తికొండ – మిద్దె వెంకటేశ్వర్లు ఆలూరు – మోహన్ ప్రసాద్ పేర్లను ఖరారు చేశారు.

News April 9, 2024

ఆస్పరి: మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారయత్నం

image

మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారయత్నం చేసిన నిందితుడు నగరుకు చెందిన ముత్తుకూరు రాముడును అరెస్టు చేసినట్టు సీఐ హనుమంతప్ప మంగళవారం తెలిపారు. బిణిగేరికి చెందిన మతిస్థిమితం లేని మహిళను రాముడు ఆదివారం రాత్రి బలవంతంగా అత్యాచారం చేస్తుండగా కొందరు వెళ్లేసరికి అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. సోమవారం బాధితురాలు అన్న ఫిర్యాదు మేరకు ఆస్పరిలో పోలీసులు అరెస్టు చేశారు.

News April 9, 2024

KNL: BCY పార్టీ అభ్యర్థులు వీరే

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 4 అసెంబ్లీ స్థానాలకు భారత చైతన్య యువజన పార్టీ(BCY) తరఫున MLA అభ్యర్థులను ఆ పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్ ప్రకటించారు. మిగిలిన 10 స్థానాలకు కూడా త్వరలో MLA, నంద్యాల, కర్నూలు ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. నంద్యాల – చింతలపల్లె సుధాకర రావు, డోన్- తరి గోపుల, బాలసుబ్బయ్య (బాలు యాదవ్) పత్తికొండ – మిద్దె వెంకటేశ్వర్లు ఆలూరు – మోహన్ ప్రసాద్ పేర్లను ఖరారు చేశారు.

News April 9, 2024

BREAKING: నంద్యాల టీడీపీ అభ్యర్థికి తప్పిన ప్రమాదం

image

నంద్యాలటీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి NMD ఫరూక్‌కు పెద్ద ప్రమాదం తప్పింది. మంగళవారం మధ్యాహ్నం కర్నూల్ వెళుతుండగా పాణ్యం సమీపంలోని తమ రాజుపల్లె వద్ద ఫరూక్ కాన్వాయ్ అదుపుతప్పి బర్రెలను ఢీకొంది. దీంతో కారులో బెలూన్స్ ఓపెన్ కావడంతో మాజీ మంత్రి ఫరూక్ స్వల్ప గాయాలతో బయటపడినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. పాణ్యం అభ్యర్థి గౌరు చరిత అక్కడికి చేరుకొని ఆయనను ఆసుపత్రికి తరలించారు.

News April 9, 2024

ఈనెల 16న ఎమ్మిగనూరుకు నందమూరి బాలకృష్ణ రాక

image

ఈనెల 16న ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ రోడ్ షో నిర్వహించనున్నట్లు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. వేముగోడు, పుట్టపాశం, హెచ్.కైరవాడి, గాజులదిన్నె స్టేజ్, గోనెగండ్ల, రాళ్లదొడ్డి, ఎర్రకోట మీదుగా ఎమ్మిగనూరు చేరుకుంటారన్నారు. సాయంత్ర 4 గంటలకు శివా సర్కిల్‌లో బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు తెలిపారు. ఈ సభకు అభిమానులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.