India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బేతంచెర్ల: గోరుమానుకొండ సమీపాన మోడల్ స్కూలును కడప ఆర్జెడీ శామ్యూల్ పాల్ మంగళవారం సందర్శించారు. పాఠశాల ఉత్తీర్ణతను, పిల్లల అడ్మిషన్ల ప్రక్రియను, అదనపు తరగతుల నిర్మాణ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. స్టూడెంట్ కిట్టుపై విస్తృతంగా చర్చించారు. విద్యార్థుల బట్టలు, బూట్లు, సాక్షులు విషయాల గురించి ఆరా తీశారు. ఇంటర్ విద్యార్థులకు భవిష్యత్ అవకాశాల గురించి ముచ్చటించారు.

కర్నూలు జిల్లా పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉరుకుంద శ్రీ ఈరన్న నరసింహస్వామి ఆలయ భద్రత ఏర్పాట్లను మంగళవారం ఎస్పీ బిందు మాధవ్ పరిశీలించారు. శ్రావణ మాస ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని నిర్వాహకులు, పోలీసులను ఎస్పీ ఆదేశించారు. ఆదోని DSP శివ నారాయణ స్వామి, EO వెంకటేశ్వర్లు, CIలు నాగరాజు యాదవ్, ప్రసాద్, SI నరేంద్ర కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

శ్రీశైలం డ్యామ్కు లైట్లు ఏర్పాటు చేయాలంటూ Way2Newsలో ప్రచురితమైన కథనానికి జలవనరుల శాఖ అధికారులు స్పందించారు. డ్యామ్ రేడియల్ క్రస్ట్ గేట్లకు మంగళవారం లైట్లు ఏర్పాటు చేశారు. దీంతో రాత్రి వేళలో పాల నురగలాంటి కృష్ణమ్మ పరవళ్లను తిలకిస్తూ, జల్లులో తడుస్తూ సందర్శకులు మంత్రముగ్ధులవుతున్నారు. జలాశయం 7 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది.

శ్రీశైలం డ్యామ్కు కృష్ణానది పరీవాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో శ్రీశైలం పోలీసులు అప్రమత్తమయ్యారు. జలాశయం బ్యాక్ వాటర్లో పడవలు నడపొద్దు అంటూ ఏపీ టూరిజం మేనేజర్కు, స్థానిక మత్స్యకార బోట్ ఆపరేటర్లకు శ్రీశైలం సీఐ ప్రసాదరావు నోటీసులు అందజేశారు. వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోందని, సందర్శకుల శ్రేయస్సు దృష్ట్యా నోటీసులు జారీ చేశామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పన్నారు.

నల్లమల అభయారణ్యంలో వెలసిన శ్రీ ఇష్టకామేశ్వరి దేవి అమ్మవారి దర్శనానికి ఆగస్టు 1 తేదీ నుంచి అనుమతి నిలిపివేశారు. ఎన్టీసీఏ న్యూఢిల్లీ ఆదేశాల మేరకు నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వులో నక్కంటి రేంజ్ పరిధిలో జంగిల్ రైడ్ను తాత్కాలికంగా నిలిపివేశారు. పులులు, వన్యప్రాణుల సంయోగ సమయంగా (గర్భం దాల్చే) పరిగణిస్తూ నల్లమల అభయారణ్యంలోని పర్యాటక ప్రదేశాలకు అనుమతి నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

పొలం గట్టు విషయంలో ఘర్షణపడి దాయాదిని హత్య చేశారు. పోలీసుల వివరాలు.. ఎమ్మిగనూరు(M) గుడేకల్కి చెందిన గోపాల్ సోమవారం పొలం గట్టున రాళ్లను పాతుతుండగా బాబాయ్ కామయ్య అడ్డుచెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. కామయ్యపై గోపాల్, అతడి బంధువులు గడ్డపారతో దాడిచేయగా మృతిచెందాడు. మృతుడి కుమారుడు పెద్దయ్య ఫిర్యాదు మేరకు గోపాల్, వీరేశ్, రామకృష్ణ, మహదేవ, నాగిరెడ్డి, నారయణ, ఉరకుందమ్మపై కేసు నమోదుచేశారు.

సీఎం చంద్రబాబు ఆగస్టు 1న శ్రీశైలం రానున్నట్లు అధికారులు తెలిపారు. సీఎం ప్రత్యేక హెలికాప్టర్లో ఉండవల్లి నివాసం నుంచి 10.30 సున్నిపెంట హెలిప్యాడ్ గ్రౌండ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్లో శ్రీశైలం చేరుకొని మల్లన్న దర్శించుకొనున్నారు. అనంతరం డ్యామ్ వద్ద కృష్ణమ్మకు జల హారతి, తదితర కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. గత ఏప్రిల్ 22నే ఆయన శ్రీశైలం వచ్చారు.

అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం ఓ హత్యకు దారితీసింది. TG, రాజోలి(M) పెద్దధన్వాడకి చెందిన శేషిరెడ్డి, సోదరులు చిన్ననాగిరెడ్డి, మహేశ్వర్రెడ్డి మధ్య 20ఏళ్లుగా ఆస్తి వివాదాలు ఉన్నాయి. చిన్నశేషిరెడ్డి తన సోదరులపై దాడికి పాల్పడినట్లు రాజోలిలో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు <<13730370>>మృతదేహాన్ని<<>> బైక్పై తీసుకొచ్చి సి.బెళగల్(M) కొత్తకొటలో పడేశారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదుచేశారు.

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను రాష్ట్ర అడిషనల్ డీజీపీ ఆర్కే మీనా సోమవారం దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్ద ఆయనకు ఈవో పెద్దిరాజు, అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం దేవస్థానం తరఫున శేష వస్త్రం, లడ్డు ప్రసాదాలు, జ్ఞాపికతో సత్కరించారు. ఆయన వెంట శ్రీశైలం సీఐ జి.ప్రసాదరావు ఉన్నారు.

సీఎం చంద్రబాబు నాయుడు ఆగస్టు 1న శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్నట్లు సమాచారం. ఈ విషయమై జిల్లా అధికారులతో పాటు శ్రీశైలం ప్రాజెక్ట్ జల వనరుల శాఖ అధికారులకు ప్రాథమికంగా సమాచారం అందినట్లు తెలిసింది. శ్రీశైలం డ్యామ్ వద్ద సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించి కృష్ణమ్మకు జల హారతి ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ మేరకు అధికారులు డ్యామ్ వద్ద తగు ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు.
Sorry, no posts matched your criteria.