Kurnool

News September 26, 2024

కరివేన గ్రామంలో గొడ్డలితో దాడి

image

ఉమ్మడి కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలో ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. కరివేన గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. సతీశ్ అనే వ్యక్తి తన భార్యపై అనుమానంతో చలమయ్యపై కోపం పెంచుకున్నాడు. నిన్న చలమయ్య తన బాబాయ్ ఇంటికి వెళ్లిన సమయంలో సతీశ్ గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో చలమయ్యకు గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటనారాయణ రెడ్డి తెలిపారు.

News September 26, 2024

సీఎం కర్నూలు పర్యటన వాయిదా

image

సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన మళ్లీ వాయిదా పడింది. ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలో నేడు సీఎం పర్యటించాల్సి ఉంది. ఈ మేరకు జిల్లా అధికారులకు ఆదేశాలు కూడా అందాయి. తాజాగా ఈ పర్యటన మళ్లీ వాయిదా పడింది. గతనెల 31న సీఎం పత్తికొండకు రావాల్సి ఉండగా వర్షం కారణంగా పర్యటన రద్దైన విషయం తెలిసిందే.

News September 26, 2024

కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి: నంద్యాల ఎస్పీ

image

నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పోలీస్ కార్యాలయంలో ఆళ్లగడ్డ సబ్ డివిజన్‌కు సంబంధించి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులు, వాటి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. నమోదైన కేసుల్లో నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు తీరు, పురోగతిపై సంబంధిత పోలీస్ అధికారులతో ఆరా తీశారు. కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని సూచించాలి.

News September 25, 2024

పెద్దకడబూరు: బాలికలకు అసభ్యకర వీడియోలు పంపిన HM

image

పెద్దకడబూరులోని ఆది ఆంధ్ర MPP స్కూళ్లో పనిచేస్తున్న HM సుప్రసాద్ పై పోక్సో కేసు నమోదైనట్లు ఎస్సై నిరంజన్ రెడ్డి తెలిపారు. కాగా ఆయన ఈ ఏడాది ఆగస్టులో బాలికలకు ఫోన్లో అసభ్యకర వీడియోలను పంపించారు. దీనిపై MEO సువర్ణల సునియం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మంగళవారం కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

News September 25, 2024

కర్నూలు: వర్షానికి కూలిన మట్టి మిద్దె

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల నిన్న రాత్రి వరకు కురిసిన వర్షానికి లోత్టటు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నందవరం మండలం కనకవీడు గ్రామంలో నరసింహుడు అనే వ్యక్తి మట్టి మిద్దె వర్షానికి కూలిపోయింది. ఇంట్లో ఎవరూ లేకుపోవడంతో ప్రమాదం తప్పింది. పలు చోట్ల వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

News September 25, 2024

రాష్ట్రస్థాయి డాన్స్ పోటీల్లో బేతంచర్లకు ప్రథమ స్థానం

image

బేతంచెర్ల పట్టణానికి చెందిన డీజే మధు డాన్స్ బృందం విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటి ప్రథమ స్థానం కైవసం చేసుకుని రూ.50వేల నగదు బహుమతిని అందుకున్నారు. విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి డాన్స్ పోటీలకు 17 జట్లు హాజరయ్యాయి. ఈ పోటీల్లో బేతంచెర్ల డీజే మధు బృందం అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా పట్టణవాసులు బృందం సభ్యులను అభినందించారు.

News September 24, 2024

కర్నూలు జిల్లాలో భారీగా MPDOల బదిలీ

image

ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా భారీగా ఎంపీడీవోలు బదిలీ అయ్యారు. ఒకేసారి 42 మంది ఎంపీడీవోలకు స్థానాలు కేటాయిస్తూ జెడ్పి సీఈవో నాసరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ముగ్గురు ఎంపీడీవోలను కడప జిల్లా నుంచి జిల్లాకు కేటాయించగా, మరో ఆరుగురు ఎంపీడీవోలను అనంతపురం జిల్లా నుంచి కర్నూలు జిల్లాకు కేటాయించారు.

News September 24, 2024

బేతంచెర్లలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

బేతంచెర్ల మండలం ముచ్చట్ల దేవాలయానికి వెళ్లే రహదారిపై మంగళవారం ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. బేతంచెర్లకు చెందిన యువకులు బైకుపై వెళ్తుండగా, ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుంచే శ్రీనివాసులు(22) అక్కడికక్కడే మృతి చెందగా, గణేష్‌కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుణ్ని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News September 24, 2024

సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా సుబ్బారెడ్డి

image

డోన్ నియోజకరవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ సుబ్బారెడ్డికి కీలక నామినేటెడ్ పదవి వరించింది. సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ప్రభుత్వం ఆయనను నియమించింది. ఎన్నికల ముంగిట సీనియర్ నేత కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి కోసం ఎమ్మెల్యే సీటును త్యాగం చేయడం, వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించి కార్యకర్తలకు అండగా ఉండటంతో ఆయనకు టీడీపీ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది.

News September 24, 2024

గుజరాత్‌లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటన

image

సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. మంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రానికి చెందిన హై లెవెల్ కమిటీ సభ్యులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఆ రాష్ట్రంలో పీపీపీ విధానంలో జరుగుతున్న రోడ్ల అభివృద్ధి, ఇతర అనేక అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తోంది. నిన్న ఆ రాష్ట్ర ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి, చీఫ్‌ ఇంజినీర్లతో అహ్మదాబాద్‌లో సమావేశమై చర్చించారు.