India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో అదనంగా 5 ఇసుక డిసిల్టేషన్ పాయింట్లకు అనుమతులు జారీ చేసినట్లు కలెక్టర్ సిరి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. సీ బెలగల్ మండలంలోని కొత్తకోట, సింగవరం, ఈర్లదిన్నె, ముడుమాల, పల్లదొడ్డి గ్రామాల్లో ఇసుక లోడింగ్కు అనుమతులు ఇచ్చామన్నారు. వినియోగదారుల కోసం జిల్లాలో 12 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు.
కర్నూలు జిల్లాలో రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిరి అధికారులను ఆదేశించారు. ప్రమాదకరమైన బ్లాక్ స్పాట్ల వద్ద వెంటనే బారికేడింగ్, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. గుర్తించిన 84 అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. రాత్రిపూట ప్రమాదాల నివారణకు రోడ్లపై రోడ్ స్టడ్స్ (సూచికలు), సీసీ కెమెరాలను అమర్చాలని సూచించారు.
జిల్లాలో నాటు సారాను పూర్తిగా నిర్మూలించే చర్యలు తీసుకోవాలని, సారా వల్ల జరిగే దుష్పరిణామాలను ప్రజలకు వివరించాలని నవోదయం సమావేశంలో అధికారులను కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశించారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన నాటుసారా నిర్మూలనపై సమీక్షా సమావేం జరిగింది. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్గొన్నారు.
జిల్లాలో ప్రతి విద్యాసంస్థల్లో నో డ్రగ్స్పై అవగాహన కల్పిస్తామని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లాలో 250 పాఠశాలలో ఈగల్ టీములను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి శుక్రవారం విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పిస్తామన్నారు. గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.
దసరా సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లే ప్రజలు ముందస్తుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం వెల్లడించారు. విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో ఉంచాలన్నారు. ఇంటి బయట లోపల ఒకటి లేదా రెండు లైట్లు వేసి ఉంచాలని, సాధ్యమైనంత వరకు ఇళ్లకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలన్నారు. సెలవులు ముగిసేంత వరకు కాలనీలలో సంక్షేమ సంఘాలు గస్తీని ఏర్పాటు చేసుకోవాలన్నారు.
వాతావరణ శాఖ హెచ్చరికలతో రానున్న నాలుగు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు కలెక్టరు డాక్టర్ సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి, ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిగా వైకుంఠం జ్యోతి నియమితులయ్యారు. <<17795004>>వైకుంఠం<<>> ఫ్యామిలీ ఆవిర్భావం నుంచి టీడీపీలో కొనసాగుతోంది. జ్యోతి మామ శ్రీరాములు 1995లో KDCC బ్యాంకు ఛైర్మన్గా పనిచేశారు. 2006లో ఆయన హత్యకు గురయ్యారు. తర్వాత తనయుడు, జ్యోతి భర్త ప్రసాద్ 2011లో ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. పలుమార్లు MLA టికెట్ ఆశించినా అవకాశం రాలేదు. పార్టీలోనే కొనసాగుతున్న ఆ ఫ్యామిలీకి మరోసారి ఇన్ఛార్జి పదవి దక్కింది.
కర్నూలు రైల్వే స్టేషన్లో టౌన్ డీఎస్పీ బాబుప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం పోలీసులు నాకాబందీ నిర్వహించారు. ప్రయాణికుల బ్యాగుల్లో డ్రగ్స్, మాదకద్రవ్యాలు ఉన్నాయా అని స్నిఫర్ డాగ్స్తో తనిఖీలు చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ.. ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల నుంచి డ్రగ్స్ అక్రమంగా రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు తనిఖీలు చేసినట్లు చెప్పారు. డ్రగ్స్ సమాచారం తెలిస్తే 1972 టోల్ ఫ్రీకి సమాచారం ఇవ్వాలన్నారు.
ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్గా వైకుంఠం జ్యోతి ఎన్నికైనట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పల్లా శ్రీనివాస్ అధికారంగా ప్రకటించారు. ఈ సందర్భంగా వైకుంఠపు జ్యోతి మాట్లాడుతూ.. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యలు తీర్చడంలో తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు, పల్లా శ్రీనివాస్కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్గా వైకుంఠం జ్యోతి ఎన్నికైనట్లు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పల్లా శ్రీనివాస్ అధికారంగా ప్రకటించారు. ఈ సందర్భంగా వైకుంఠపు జ్యోతి మాట్లాడుతూ.. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యలు తీర్చడంలో తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు, పల్లా శ్రీనివాస్కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.