Kurnool

News April 1, 2024

నందికొట్కూరు: టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత 

image

నందికొట్కూరు మండలం అల్లూరులో సోమవారం ఉదయం ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఐపీఎస్, టీడీపీ నేత ఇన్ఛార్జ్ శివానందరెడ్డి ఇంటికి 2012లో నమోదయిన ఓ కేసు విచారణ నిమిత్తం తెలంగాణ పోలీసులు చేరకున్నారు. అయితే తనకు నోటీసు ఇచ్చి విచారించాలంటూ శివానందరెడ్డి పోలీసులను కోరారు. ఈ క్రమంలో పోలీసులు నోటీసులు తయారు చేసేలోపే ఆయన తన ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

News April 1, 2024

కర్నూలు: 44 మందికి షోకాజ్ నోటీసులు

image

కర్నూలు జిల్లా పీవో, ఏపీవో శిక్షణ తరగతులకు పలువురు గైర్హాజరు కావడంపై కలెక్టర్ సృజన సీరియస్ అయ్యారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. పత్తికొండ నియోజకవర్గంలో 16 మంది, ఎమ్మిగనూరులో 12 మంది, ఆలూరులో తొమ్మిది మంది, మంత్రాలయంలో ఏడుగురు.. మొత్తంగా 44 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

News April 1, 2024

కర్నూల్: ఇద్దరు వాలంటీర్లపై వేటు

image

మార్చి 29న ఎమ్మిగనూరులో జరిగిన సీఎం జగన్ సిద్ధం సభకు వెళ్లినట్లు తేలటంతో ఇద్దరు వాలంటీర్లను విధుల నుంచి తొలగించినట్లు పత్తికొండ ఎంపీడీవో డి.రామారావు తెలిపారు. మండలానికి చెందిన బుల్లేని పాండు, ఎర్రమల శివ నిబంధనలను అతిక్రమించి సిద్ధం సభకు వెళ్లడంతో విధుల నుంచి తొలగించామన్నారు. కోడ్ ముగిసే వరకు వాలంటీర్లు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనొద్దన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

News April 1, 2024

ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి: ఎస్పీ

image

ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీస్ కవాతు నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలే లక్ష్యంగా సాయుధ బలగాలతో కవాతును నిర్వహించామన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలన్నారు.

News March 31, 2024

పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి:

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి విధుల్లో పాల్గొనే 33 శాఖలకు చెందిన వారికి కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పిస్తుందని కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. విధుల్లో ఉంటూ ఓటు వేయలేని వారు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవాలన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించారన్నారు.

News March 31, 2024

BREAKING: మద్దికేరలో ఘోర ప్రమాదం.. ఇద్దరు కూలీల మృతి

image

మద్దికేర మండల కేంద్రంలోని కోతులుమాను దగ్గర టాటా ఏసీ టైర్ పగిలి ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. వీరందరినీ గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరిని కర్నూలుకు తరలించారు. రోజు వారిగా చిప్పగిరి మండలానికి మిరప పంట కోతకు వెళ్లేవారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News March 31, 2024

రూ.2.49 కోట్లు స్వాధీనం: నంద్యాల కలెక్టర్

image

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై రూ.1.74 కోట్ల నగదు, రూ.59 లక్షల విలువైన మద్యం, రూ.16 లక్షల విలువ చేసే వస్తువులు.. మొత్తం కలిపి రూ.2.49 కోట్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని నంద్యాల కలెక్టర్ శ్రీనివాసులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్‌ను పటిష్ఠంగా అమలు పరుస్తున్నామని పేర్కొన్నారు. ఎంసీసీ ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు.

News March 31, 2024

కొలిమిగుండ్లలో కార్మికుడు మృతి

image

పొట్టకూటి కోసం క్లీనర్ పని చేసుకోవడానికి లారీ వెంట వచ్చిన కార్మికుడు గుండె పోటుతో మృతి చెందిన సంఘటన కొలిమిగుండ్ల మండలం అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా బూడిదపాడు గ్రామానికి చెందిన గురక రామిరెడ్డి(48) ఉన్నట్టుండి కుప్పకూలి మృతి చెందారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు PC నరసింహులు తెలిపారు.

News March 31, 2024

కర్నూలులో ఏడాది క్రితం మిస్సైన మూడు కూనలు హైదరాబాద్‌లో సేఫ్

image

కర్నూలు జిల్లాలో 2023 మార్చిలో నాలుగు పులి పిల్లలు మిస్ అయ్యాయి. అయితే వాటిని తిరుపతి SV జూ పార్క్‌కు తరలించి అధికారులు సంరక్షించారు. వాటిలో ఒకటి మరణించగా మరో మూడింటికీ రుద్రమ్మ, అనంత, హరిణి అని పేరు పెట్టారు. వీటిని ఆరు నెలల క్రితం హైదరాబాద్‌కి చెందిన జీఏఆర్ సంస్థ ఏడాది పాటు దత్తత తీసుకుంది. గడువు ముగిస్తే మళ్లీ అధికారుల ఆదేశాలతో నిర్ణయం తీసుకుంటామని SVజూపార్క్ క్యూరేటర్ సెల్వం తెలిపారు.

News March 31, 2024

తాగునీటి సమస్యల పరిష్కారానికి ఫిర్యాదుల విభాగం ఏర్పాటు: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో వేసవికాలంలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మనోహర్‌ను కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు ఆదేశించారు. జిల్లాలో ఎక్కడ తాగునీటి సమస్య ఏర్పడినా 08514-244424కు కాల్ చేసిన వెంటనే సంబంధిత అధికారులతో తనిఖీలు చేయించాలన్నారు. తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.