India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ పార్క్లో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటుతో రాయలసీమ రూపురేఖలు మారనున్నాయి. జపాన్ సంస్థ ₹14వేల కోట్లతో ఈ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. దీని ద్వారా ప్రత్యక్షంగా 2వేలు, పరోక్షంగా 10వేల మందికి ఉపాధి లభించే అవకాశముందని చెబుతున్నారు. దీనికి అనుబంధంగా మరిన్ని కంపెనీలు రానున్నాయి. వేలాది మందికి ఉపాధి లభించే ఛాన్స్ ఉండటంతో జిల్లా వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం ఎర్రమఠం గ్రామ సమీపంలోని పంట పొలాలలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. స్థానికుల వివరాల మేరకు.. ఎర్రమఠం గ్రామానికి చెందిన కొమ్ము శేఖర్ తన పొలానికి వెళ్లగా శవం కనిపించడంతో భయాందోళనకు గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది హత్యా? ఆత్మహత్యా? అన్నది పోలీసుల విచారణలో తేలనుంది.
కర్నూలు మార్కెట్లో ఎండు మిర్చి ధరలు భారీగా పడిపోయాయి. సోమవారం క్వింటా గరిష్ఠ ధర రూ.14,913 పలికింది. సరాసరి రూ.11,119, కనిష్ఠ ధర రూ.1,599తో విక్రయాలు సాగాయి. నెల క్రితం క్వింటా రూ.20 వేలు పలకగా ప్రస్తుతం భారీగా పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మొక్కజొన్న రూ.2,052, కందులు గరిష్ఠ ధర రూ.7,449లు పలికాయి. ఉల్లి క్వింటా గరిష్ఠ ధర రూ.3,200, సజ్జలు గరిష్ఠ ధర రూ.2,403లతో అమ్ముడయ్యాయి.
శ్రీశైలంలోని ఎడమ విద్యుత్ కేంద్రంలో సోమవారం 0.692 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేపట్టారు. ఇందుకోసం జలాశయం నుంచి 1406 క్యూసెక్కుల నీటిని వినియోగించుకున్నారు. అదే క్రమంలో హెచ్ఎంఎస్ఎస్ కు 1645 క్యూసెక్కులు, మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కు 2291 క్యూసెక్కులు, కేసీ కెనాల్కు 245 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు 1500 క్యూసెక్కుల చొప్పున మొత్తం 7296 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
నంద్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఎస్పీ అర్జీలను స్వీకరించారు. PGRS కార్యక్రమానికి 80 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రతి ఫిర్యాదును సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎస్పీ అధిరాజ్ సింగ్ హామీ ఇచ్చారు. ASP యుగంధర్ బాబు పాల్గొన్నారు.
చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించి చేనేత కార్మికులకు చేయూతను అందించాలని కలెక్టర్ జి.రాజకుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా బనగానపల్లె మండలం, నందివర్గం గ్రామ చేనేత స్టాల్ను ప్రారంభించి అధికారుల చేత చేనేత వస్త్రాలను కొనుగోలు చేయించారు. పేద స్థితిలో ఉన్న చేనేత సొసైటీలను ఆదరించి చేనేత ఉత్పత్తిదారులకు చేయూతను అందించాలని కలెక్టర్ తెలిపారు.
ఆదోనిలో సోమవారం విషాద ఘటన జరిగింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాలనీకి చెందిన నవీన్ (20) అనే బీటెక్ విద్యార్థి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నవీన్ బీటెక్ పరీక్షల్లో కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. దీంతో తన గదిలో ఊరివేసుకున్నాడు. ఘటనపై టూ టౌన్ పోలీసులు కేసున మోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అల్లుగుండు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు మునీర్ అహ్మద్ మూడోసారి కిడ్నాప్కి గురైన విషయం తెలిసిందే. అయితే దీనికి భూవివాదమే కారణమని తెలుస్తోంది. కర్నూలు సెంట్రల్ స్కూల్ వెనుక ఉన్న రూ.20 కోట్ల విలువచేసే భూవివాదమే కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ భూవివాదంలో మునీర్ ఇప్పటికే ఫిర్యాదుదారుగా ఉన్నారు. ప్రస్తుతం, దీనిపై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది.
కర్నూలు జిల్లాలో 201 డీలర్ పోస్టులను శాశ్వత ప్రాతిపాదికన భర్తీ చేసేందుకు కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో కర్నూలు డివిజన్లో 76, ఆదోని డివిజన్లో 80, పత్తికొండ డివిజన్లో 45 పోస్టులు ఉన్నాయన్నారు. అభ్యర్థులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అర్జీలను డిసెంబర్ 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు అందజేయాలని కోరారు.
30 గొర్రెలు మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలంలో జరిగింది. తిమ్మందొడ్డి గ్రామానికి చెందిన చిన్నకు సుమారు 600 గొర్రెలు ఉన్నాయి. వాటికి బలం వచ్చేందుకు వైద్యుల అనుమతి లేకుండానే సొంతంగా టానిక్ తాపారు. వికటించడంతో సుమారు 30 గొర్రెలు మృతిచెందాయి. టానిక్ అధిక డోసు ఇవ్వడంతోనే మృత్యువాతపడినట్లు పశువైద్యుల రిపోర్టులో తేలింది. భారీ నష్టం జరగడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.