Kurnool

News December 23, 2024

పత్తికొండ గ్రామ చరిత్ర తెలుసా?

image

పత్తికొండలో పూర్వం ఒక గొర్రెల కాపరి అడవిలో గొర్రెలు మేపుతూ.. క్రమంగా అడవిని నరికి పత్తి పండించాడని రాజుల చరిత్ర తెలిసిన వారు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో పంటలు బాగా పండటంతో ఇతరులు వచ్చి పంటలు పండిస్తూ ఉండిపోయారట. ఇలా గ్రామంగా ఏర్పడిన తర్వాత విజయనగర యువ రాజు వేంకటరాజా ఈ గ్రామాన్ని సమీపంలోని కొండ ప్రాంతానికి తరలించాడని చరిత్ర. అందువల్ల ఈ గ్రామానికి పత్తికొండ అనే పేరు వచ్చిందని గ్రామస్థులు అంటున్నారు.

News December 23, 2024

నేడు కలెక్టరేట్‌లో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ

image

నంద్యాల పట్టణం కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ హలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే ప్రక్రియను పబ్లిక్ గ్రీవెన్స్ ద్వారా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 9:15 గంటలకు అధికారులు హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు.

News December 22, 2024

చిరుత సంచారంపై ఫారెస్టు అధికారి ఆరా

image

పెద్దకడబూరులోని 76 కాలువ సమీపంలో పిల్లగుండ్లు పరిసర పొలాల్లో వారం రోజులుగా చిరుత సంచారం కలకలం రేపుతోంది. చిరుత సంచారానికి సంబంధించి దాని పాదాల జాడలు పొలాల్లో కనిపించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సమాచారం తెలుసుకున్న ఫారెస్టు అధికారి సమీవుల్లా చిరుత సంచారంపై పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి, చిరుత జాడలను పరిశీలించారు. చిరుత కనిపిస్తే సమాచారం ఇవ్వాలని రైతులకు సూచించారు.

News December 22, 2024

రోడ్డు ప్రమాదంలో నర్సు మృతి

image

దోర్నాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీశైల దేవస్థానం వైద్యశాల నర్సు మల్లిక మృతి చెందారు. శ్రీశైలానికి చెందిన ఆమె.. భర్త, పాపతో కలిసి కర్నూలుకు షాపింగ్ నిమిత్తం నిన్న వెళ్లారు. రాత్రి పుష్ప-2 సినిమా చూసి, తిరుగు పయనమయ్యారు. తెల్లవారుజామున మంచు కారణంగా వారు ప్రయాణిస్తున్న కారు టూరిస్ట్ బస్సును ఢీకొంది. మల్లిక అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె భర్త, పాపకు ఏమీ కాలేదని వారి సన్నిహితులు తెలిపారు.

News December 22, 2024

కర్నూలు: క్లాస్‌రూములో ఉండగానే టీచర్‌ కిడ్నాప్‌..?

image

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అల్లుగుండు ప్రభుత్వ పాఠశాలలో టీచర్ మునీర్ అహ్మద్ కిడ్నాప్ అయినట్టు తెలుస్తోంది. క్లాస్ రూములో ఉండగానే కిడ్నాప్ చేశారంటూ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మునీర్ అహ్మద్ కిడ్నాప్ కావడం ఇది మూడోసారి అని, కర్నూలు సెంట్రల్ స్కూల్ వెనుక రూ.20 కోట్లు విలువ చేసే భూ వివాదంలో కిడ్నాప్ చేశారని ఆరోపిస్తున్నారు. మునీర్ అహ్మద్ సోదరుడు మక్బూల్ బాషా కూడా కనిపించడం లేదని అంటున్నారు.

News December 22, 2024

గుండెపోటుతో పాత్రికేయుడి మృతి

image

గడివేముల మండల విలేకరి మహబూబ్ బాషా గుండెపోటుతో ఆదివారం తెల్లవారుజామున మృతిచెందారు. 4 రోజుల నుంచి అస్వస్థతతో చికిత్స తీసుకుని కోలుకున్నారు. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో ‘Iam Back’ అంటూ వాట్సప్ స్టేటస్ పెట్టారు. అయితే నేడు అకాల మరణంతో కుటుంబ సభ్యులు, తోటి విలేకరులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈయన APUWJ సభ్యుడిగా పాత్రికేయ
రంగానికే వన్నెతెచ్చిన వ్యక్తిగా పేరు గడించారని పలువురు విలేకరులు కొనియాడారు.

News December 22, 2024

ఇంట్లో బంధించి మహిళపై ఆత్యాచారం.. నిందితుడికి రిమాండ్

image

మతిస్థిమితం లేని మహిళపై ఆత్యాచారం చేసిన జోగి హనుమంతును శనివారం రిమాండుకు తరలించినట్లు సీఐ మస్తాన్ వల్లి తెలిపారు. గత నెల 17న మతిస్థిమితం లేని మహిళను ఆదోనిలో అనాథాశ్రమంలో చేర్పిస్తానని మహిళ తల్లిదండ్రులతో నచ్చజెప్పి తీసుకొని జోగి హనుమంతు తన స్వగ్రామం ఆస్పరి మండలం ముత్తుకూరుకు తీసుకొచ్చాడు. ఇంటిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపామన్నారు.

News December 22, 2024

మత్స్య శాఖ వనరులను అభివృద్ధి పరచండి: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో మత్స్య శాఖ వనరులను అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ జీ.రాజకుమారి మత్స్య శాఖ ఉప డైరెక్టర్ రాఘవరెడ్డిని ఆదేశించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్‌లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. అత్యల్పంగా చేపల పెంపకం మన జిల్లాలోనే ఉందన్నారు. మత్స్య సంపద అభివృద్ధి చెందడానికి కృషి చేయాలన్నారు.

News December 21, 2024

రెవెన్యూ సదస్సులో 5,586 దరఖాస్తుల స్వీకరణ

image

కర్నూలు జిల్లా పరిధిలో ఈనెల ప్రారంభమైన రెవెన్యూ సదస్సులో ఇప్పటి వరకు 5,586 అర్జీలు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా పేర్కొన్నారు. అలాగే శనివారం ఆదోని రెవెన్యూ డివిజన్‌లోని కుర్నూరులో 11, పూలచింతలో 4, రాళ్లదొడ్డిలో 15, ఆగశన్నూరులో 11, కగళ్లులో 2, ముచ్చగేరిలో 1, ఆరెకల్‌లో 35, మార్లమడికిలో 13, కౌతాళంలో 51, పలు గ్రామాల్లో భూ సమస్యలపై అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు.

News December 21, 2024

రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులు ఆన్‌లైన్లో నమోదు చేయాలి: కలెక్టర్

image

ప్రజలు, రైతులు తమ సమస్యలపై రెవిన్యూ సరస్సులలో అందించిన దరఖాస్తులను ఆన్‌లైన్లో పొందుపరచాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ ఛాంబర్ నుంచి జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులకు సూచనలు, సలహాలు చేశారు. నిర్ణీత సమయంలోపు అర్జీలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. తహశీల్దార్ ఆఫీసులలో రికార్డు రూములు సక్రమంగా ఉంచుకోవాలన్నారు.