India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వెల్దుర్తి జడ్పీ బాలుర పాఠశాలను శనివారం డీఈవో శ్యాముల్ పాల్ తనిఖీ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన PAL ల్యాబ్లను, తరగతి గదిని తనిఖీ చేశారు. తరగతి గది దుమ్ము, ధూళి, చెత్తాచెదారంతో ఉండి కనీస వెలుతురు లేకుండా ఉండటంతో ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు బోధనను, టెక్నాలజీని సులభతరంగా అర్థం చేసుకోవడానికి ప్రభుత్వం PAL ల్యాబ్లను తీసుకుని వచ్చిందన్నారు.
ఆటో డ్రైవర్ గొప్ప మనసు చాటుకున్నాడు. దివ్యాంగురాలిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆదర్శంగా నిలిచాడు. సీ.బెళగల్(మం) పొనకల్కు చెందిన దివ్యాంగురాలు వెంకటేశ్వరమ్మ, గూడూరు(మం) సంగాలకు చెందిన ఆటో డ్రైవర్ మద్దిలేటి ప్రేమించుకున్నారు. నందవరం(మం) గురజాలలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో దివ్యాంగుల సాధికారత ఫోరం JAC అధ్యక్షుడు నాగరాజు సమక్షంలో శనివారం పెళ్లి చేసుకుని ఇద్దరూ ఒక్కటయ్యారు.
కర్నూలులోని ఓ పాఠశాల ఆవరణలో 441 మంది విద్యార్థులతో 1వ ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకలను శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి పుల్లారెడ్డి కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ సురేశ్, ప్రధానోపాధ్యాయురాలు మీనాక్షి హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విద్యావేత్త రాజశేఖర్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతిరోజూ క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని సూచించారు.
ఇష్టం లేని పని చేయలేక ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం అనంతపురంలో చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబలంకి చెందిన శివ (14) తల్లిదండ్రుల బలవంతంపై అనంతపురంలో తన అన్నతో కలిసి సెంట్రింగ్ పనులు చేస్తున్నాడు. తాను వ్యవసాయం చేసుకుంటానని సెంట్రింగ్ పనులు చేయలేనని తల్లిదండ్రులకు చెప్పినా వినకపోవడంతో అనంతపురంలోని తన గదిలో ఉరేవేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు టూ టౌన్ పోలీసులు తెలిపారు.
కర్నూలు జిల్లాలో నేడు ప్రాజెక్టు కమిటీ ఎన్నికలు జరగనున్నాయి. ఎల్లెల్సీ, గాజులదిన్నె, తెలుగుగంగ, కేసీకాల్వ, ఎస్సార్బీసీ ప్రాజెక్టు కమిటీలకు ఉదయం 9 గంటల నుంచి ఎన్నికలు జరుగుతాయి. ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను ఎన్నుకుంటారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇటీవల జరిగిన సాగునీటి సంఘం ఎన్నికల్లో అధ్యక్షులు, డీసీలను ఎన్నుకున్న విషయం తెలిసిందే.
పర్యావరణం, జీవ వైవిధ్యం పట్ల సున్నితమైన ఆలోచనలను సమాజంలో పెంపొందించే లక్ష్యంతో విప్రో సంస్థ విప్రో ఎర్తియన్ పేరుతో అందించే జాతీయ అవార్డును మహానంది మోడల్ స్కూల్ సొంతం చేసుకుందని ప్రిన్సిపల్ లక్ష్మణరావు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల ద్వారా 1,550కి పైగా వచ్చిన ప్రాజెక్టుల నుంచి తమ పాఠశాల పంపిన జీవ వైవిధ్యం ప్రాజెక్ట్కు జాతీయ అవార్డు వరించిందని ఆయన పేర్కొన్నారు.
ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు తమిళనాడులో జరిగే జాతీయ స్థాయి జూనియర్ బాలికల హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్లో ఏపీ జట్టు పాల్గొంటున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం కర్నూలులో జట్టు క్రీడాకారుల వివరాలు తెలిపారు. జట్టులో సీహెచ్ దేవిక, జీ.దేవి, ఎస్.పుష్ప, సీహెచ్ గాయత్రి, వెంకటలక్ష్మి, ఝాన్సీ, రిషిత, జ్యోతి, హన్సిక, అనన్య, త్రివిధ, లక్ష్మీ, శ్రీవాణి, షాహిదా ఉన్నారన్నారు.
దేవనకొండ మండలం కప్పట్రాళ్లకు చెందిన ఆరుగురిని ఓ హత్య కేసులో నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. 2001లో కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడుపై బాంబులతో దాడికి పాల్పడిన ఘటనలో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. దాడిచేసిన వారిపై వెంకటప్ప నాయుడు అనుచరులు ప్రతిదాడి చేశారు. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో జీవిత ఖైదీ అనుభవిస్తున్న ఆరుగురిని నిర్దోషులుగా హైకోర్టు తీర్పు ఇచ్చింది.
నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేశ్ ప్రపంచ ధ్యాన దినోత్సవం పురస్కరించుకొని వినూత్నంగా పెన్సిల్ ముక్కపై ధ్యానం చేస్తున్న వ్యక్తి, ప్రపంచ భూగోళం సూక్ష్మ చిత్రాలను వాటర్ కలర్స్తో మైక్రో బ్రష్ ద్వారా చిత్రించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏడాది డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవం జరుపుకోవాలని ఏకగ్రీవంగా ఐక్యరాజ్య సమితి ఆమోదించిందన్నారు.
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న వివిధ రకాల కోర్టు కేసుల పరిష్కారం పై న్యాయశాఖ పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని మైనారిటీ న్యాయ సంక్షేమ శాఖ మంత్రిఫరూక్ హోం మంత్రి అనిత అధికారులకుసూచించారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ప్రత్యేక కోర్టుల అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని మంత్రి అన్నారు.
Sorry, no posts matched your criteria.