India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నైరుతి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం కొనసాగుతుందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. దీని ప్రభావంతో శుక్రవారం కర్నూలు, నంద్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్పోర్టు సైజు ఫొటోను 97036 22022కు వాట్సాప్ చేయండి.
రైతుల భూ సమస్యలు పరిష్కరించడమే రెవెన్యూ సదస్సుల లక్ష్యమని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. గురువారం ప్యాపిలి మండలం బూరుగలలో రెవెన్యూ సదస్సులో ఆమె పాల్గొన్నారు. రైతులకు ఏ సమస్య వచ్చినా రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజల నుంచి భూ సంబంధిత సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించి, త్వరతిగతిన పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కర్నూలు జిల్లా అస్పరి మండలంలోని ఓ గ్రామంలో మతిస్థిమితం లేని ఓ మహిళ(35)పై బుధవారం హనుమంతు అనే కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళను ఆశ్రమంలో విడిచిపెడతానని తల్లిదండ్రులకు నచ్చజెప్పి తీసుకెళ్లిన అతను.. ఆశ్రమానికి తీసుకెళ్లకుండా తన ఇంటికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ట్రైనీ డీఎస్పీ ఉషశ్రీ తెలిపారు.
కర్నూలు జిల్లాలో 16 మంది డిగ్రీ విద్యార్థులు డిబార్ అయ్యారు. మాస్ కాపీయింగ్కు పాల్పడటంతో డిబార్ చేసినట్లు ఇన్ఛార్జి వీసీ ఎన్టీకే నాయక్ తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం జరిగిన మొదటి సెమిస్టర్ పరీక్షకు 10,504 మందికి గానూ 9,125 మంది, ఐదో సెమిస్టర్ పరీక్షకు 62 మందికి గానూ 48 మంది హాజరయ్యారు.
కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్కు ఉత్తమ ప్రశంసా పత్రం లభించింది. డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు చేతుల మీదుగా ఆయన ఉత్తమ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. లోక్ అదాలత్లో 7,913 కేసులను పరిష్కరించి రాష్ట్రంలోనే కర్నూలు పోలీస్ శాఖను మొదటి స్థానంలో నిలపడంతో ఎస్పీని డీజీపీ తిరుమల రావు ప్రత్యేకంగా అభినందించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. నంద్యాలలోని పలు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమంలో భాగంగా పట్టణ, ట్రాఫిక్ సీఐలు, పోలీసులు తగిన ఏర్పాట్లు చేపట్టారు. బుధవారం పాఠశాలలు, కళాశాలలు, ప్రధాన కూడళ్ల వద్ద ప్రజలకు అవగాహన కల్పించారు. స్పీడ్ బ్రేకర్లు, ప్రమాదాల గుర్తింపు సూచిక బోర్డులు, తదితర వాటిని ఏర్పాటు చేశారు.
నిరుద్యోగ యువత వివిధ వృత్తి నైపుణ్య రంగాల్లో రాణించేందుకు అవసరమైన ఉపాధి శిక్షణ ఇవ్వాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జీ.రాజకుమారి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సమావేశంలో ఆమె మాట్లాడారు. నిరుద్యోగ యువతకు వివిధ ఉపాధి రంగాలలో వృత్తి నైపుణ్యాల శిక్షణ ఇచ్చి ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
డోన్లో కొండపేట ప్రాంతానికి చెందిన గిరిబాబు(45), గోసానిపల్లెకు చెందిన రామాంజనేయులు(45) అనే లారీ డ్రైవర్లు గుండెపోటుతో మృతిచెందారు. డోన్ మోటార్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శివరాం బుధవారం వారి స్వగృహాలకు వెళ్లి మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రభుత్వాలు రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
కర్నూలులోని జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నెకల్ సురేంద్ర రెడ్డి కుమార్తె వివాహా రిసెప్షన్కు మాజీ సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. నూతన వధూవరులు డాక్టర్ కె.చతుర, డాక్టర్ కె.నిఖిల్లకు వివాహా శుభాకాంక్షలు చెప్పి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కన్వెన్షన్ సెంటర్లో జగన్ అభిమానులు సెల్ఫీల కోసం పోటీ పడ్డారు. అనంతరం జిల్లా నేతలతో ఆయన కాసేపు ముచ్చటించారు.
Sorry, no posts matched your criteria.