Kurnool

News July 4, 2024

5న ఆదోని మార్కెట్ యార్డుకు సెలవు

image

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు 5వ తేదీన సెలవు ప్రకటించినట్లు యార్డు అధికారులు బుధవారం తెలిపారు. అమావాస్య సందర్భంగా పంట దిగుబడుల క్రయవిక్రయాలు జరగవన్నారు. మార్కెట్ యార్డులో తిరిగి శనివారం యథావిధిగా వ్యాపారాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. రైతులు, వ్యాపారులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.

News July 4, 2024

నేటి నుంచి సంపూర్ణ అభియాన్: కలెక్టర్

image

అత్యంత వెనుకబడిన మండలాలైన హోళగుందలో గురువారం, మద్దికెరలో 5న, చిప్పగిరిలో 6న సంపూర్ణ అభియాన్ సభలు నిర్వహించాలని కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. 30 అంశాలను సాచురేషన్ పద్ధతిలో 100 శాతం తీసుకొని వెళ్లాలన్నదే భారత ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజలకు అవగాహన కల్పించే విధంగా విద్యార్థులతో 6 అంశాలకు సంబంధించిన ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించాలని ఎంపీడీవోలను ఆదేశించారు.

News July 4, 2024

కర్నూలు: నేడు విద్యాసంస్థల బంద్.. పోలీసుల అప్రమత్తం

image

విద్యార్థి సంఘాలు నేడు విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో కర్నూలు జిల్లా పోలీస్ పోలీసు శాఖ అప్రమత్తమైంది. కేంద్రం నిర్వహించే పలు పరీక్షలు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని, ఇతరత్రా డిమాండ్లతో SFI, AISF, PDSEU, AISA, NSUI, PDSU సంఘాలు ఉమ్మడిగా బంద్ చేపట్టనున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసు అధికారులు వారి పోలీస్ స్టేషన్ల పరిధిలో పాఠశాలల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

News July 4, 2024

కర్నూలు: కూటమిలో కలిసేందుకు వైసీపీ నేతల కసరత్తు

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూటమి పార్టీల్లో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. YCP పాలనలో చేసిన పనులకు బిల్లులు రాక, అవినీతి ఆరోపణలు ఎదుర్కొటున్న నేతలు కండువా మార్చే ప్రయత్నంలో ఉన్నారు. అయితే అలాంటి వారిని చేర్చుకోవద్దని స్థానిక నాయకులు తమ నేతలకు తెగేసి చెబుతున్నట్లు సమాచారం. కాగా కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ పురపాలికల్లో ఇప్పటికే పలువురు పార్టీ మారారు.

News July 4, 2024

నీటిపారుదల ప్రాజెక్టులపై నివేదిక ఇవ్వండి: జిల్లా కలెక్టర్

image

జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టుల పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జలవనరులు, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆలూరు బ్రాంచ్ కెనాల్, కేసీ కెనాల్, హంద్రీ నీవా, గాజుల దిన్నె ప్రాజెక్ట్, వేదవతి, ఆర్డీఎస్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి బ్యారేజి వివరాలు తెలుసుకున్నారు.

News July 3, 2024

ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,645 ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఇందులో ఎస్ఓటీ పోస్టులు 1,731 వరకు ఖాళీలు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ 84, సెకండ్ లాంగ్వేజ్ 113, ఎస్ఏ ఇంగ్లీషు 61, ఎస్ఏ గణితం 89, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ 63, ఎస్ఏ బయోలాజికల్ సైన్స్ 61, ఎస్ఏ సోషల్ స్టడీస్ 78, ఎస్ఏ పీఈటీ 211 పోస్టుల ఖాళీలు ఉన్నాయి. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది.

News July 3, 2024

డీఎస్సీ ద్వారా 2,645 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ: కలెక్టర్

image

డీఎస్సీలో భాగంగా జిల్లాలో 2,645 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు కలెక్టర్ రంజిత్ బాషా వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ, సమగ్ర శిక్ష అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో గతేడాది 62 శాతం మాత్రమే పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారన్నారు. ఈ ఏడాది ప్రతి విద్యార్థి పాస్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం ప్రణాళికను అమలు చేయాలన్నారు.

News July 3, 2024

ఆదోని ఎంపీపీ వైసీపీ నుంచి బీజేపీలో చేరిక

image

ఆదోని మండల పరిషత్ అధ్యక్షురాలు బడాయి దానమ్మ వైసీపీని వీడి బీజేపీలో చేరారు. ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాలులో ఎమ్మెల్యే పార్థసారథి కండువా కప్పి ఆహ్వానించారు. ఆమెతో పాటు కౌన్సిలర్లు లలితమ్మ, చిన్న, పద్మావతి, పలువురు సర్పంచులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ నుంచి చేరికలు మొదలయ్యాయని, ఆదోనిలో ఆ పార్టీ ఖాళీ అవ్వడం ఖాయమని ఎమ్మెల్యే అన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారికి సూచించారు.

News July 3, 2024

భోజన నాణ్యతలో రాజీపడొద్దు: డీఈవో

image

కేజీబీవీలో చదువుతున్న విద్యార్థినులకు వడ్డిస్తున్న భోజనంలో రాజీపడొద్దని, నాణ్యంగా అందించాలని కర్నూలు డీఈవో శామ్యూల్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న సమగ్రశిక్షా కార్యాలయంలో కేజీబీవీ ఎస్ఓలతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పదో తరగతిలో ఉత్తీర్ణత పెంచేందుకు ప్రతి ఎస్ఓ ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో ఏమైనా సమస్యలుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.

News July 3, 2024

డీఎస్సీ ద్వారా 2,645 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ: కలెక్టర్

image

డీఎస్సీలో భాగంగా జిల్లాలో 2,645 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు కలెక్టర్ రంజిత్ బాషా వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ, సమగ్ర శిక్ష అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో గతేడాది 62 శాతం మాత్రమే పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారన్నారు. ఈ ఏడాది ప్రతి విద్యార్థి పాస్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం ప్రణాళికను అమలు చేయాలన్నారు.