Kurnool

News July 1, 2024

ఆదోని: రైల్వే పోలీసులు చేతివాటం

image

అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాల్సిన ఓ పోలీసు అధికారి అక్రమార్జనకు తెరలేపిన ఘటన ఆదోని రైల్వే డివిజన్ పరిధిలోని ఓ స్టేషన్‌లో ఆదివారం వెలుగుచూసింది. రూ.కోటి విలువైన బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యాపారిని అదుపులో తీసుకున్న పోలీసు అధికారి.. పైఅధికారుల సహకారంతో పైరవీలు చేసి రూ.6లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని వదిలేసిన్నట్లు సోమవారం సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

News July 1, 2024

బనగానపల్లె: పింఛన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి

image

బనగానపల్లె పట్టణంలోని తెలుగుపేటలోని ఇంటింటికీ సచివాలయ సిబ్బందితో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎన్నికల వేళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన పెన్షన్ రూ.4000 అలాగే 3 నెలల పెంపు రూ.3000 కలిపి ఒకేసారి రూ.7000 పింఛన్ లబ్ధిదారులకు బి.సి.జనార్దన్ రెడ్డి పంపిణీ చేశారు.

News July 1, 2024

ఆదోని: ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

image

కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతకుడ్లూరులో శనివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్న బసవరాజు(22)అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం నిద్ర లేచి పక్క గదిలో ఫ్యాన్‌కు వేలాడుతున్న భర్తను చూసిన భార్య కవిత వెంటనే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు తెలిపింది. 2 నెలల క్రితమే హత్రి బెలగల్ గ్రామానికి చెందిన కవితకు బసవరాజుకు వివాహమైంది. వివాహమైన రెండు నెలలకే ఇలా జరగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి

News July 1, 2024

కర్నూలు: నేటి నుంచి బియ్యం, జొన్నల పంపిణీ

image

నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పౌరసరఫరాలశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు అన్ని గోదాముల్లో తూనికలు, కొలతలశాఖ అధికారులు సరకుల నాణ్యత పరిశీలించి నివేదికలు ఇవ్వనున్నారని JC నారపురెడ్డి మౌర్య పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జులై నెలకు సంబంధించి కార్డుదారులకు బియ్యం, జొన్నలు మాత్రమే పంపిణీ చేయాలని ఉత్తర్వులు వచ్చినట్లు చెప్పారు. కార్డుదారులు 3 కిలోల వరకు జొన్నలను బియ్యానికి బదులుగా ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.

News July 1, 2024

నంద్యాలలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

నంద్యాల కలెక్టరేట్‌లోని సెంటినరీ హాలులో ఈ రోజు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నామని కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే ప్రక్రియను పబ్లిక్‌ గ్రివియన్స్‌ రెడ్రెస్సల్‌ సిస్టం (పీజీఆర్‌ఎస్‌) ద్వారా చేపట్టనున్నట్లు వెల్లడించారు.

News June 30, 2024

కర్నూలు: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

ఆదోని ఆర్ఎస్ సమీపంలో ఆదివారం రైలు కింద‌ప‌డి వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ మేరకు రైల్వే ఎస్ఐ గోపాల్ వెల్లడించారు. మృతుడి కుడి భుజంపై త్రిశూలం, చేతికి రాజు అని ప‌చ్చ‌బొట్టు, నీలం క‌ల‌ర్ ఫుల్ డ్రాయ‌ర్‌, గ్రే క‌ల‌ర్ పంచ‌, చిన్న నిలువు గీత‌లున్న ష‌ర్ట్‌, రెండు కాళ్ల‌కు దారాలు, హీరో సైకిల్ ఉంద‌న్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News June 30, 2024

కర్నూలు: ‘అధికారులు మారినా.. సూచిక బోర్డులు మారలేదు’

image

జిల్లా ఉన్నతాధికారులు మారినప్పటికీ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం వారి పేర్లతో పాటు ఫొటోలతో సూచిక బోర్డులు దర్శనమిస్తున్నాయి. నూతన కలెక్టర్‌గా రంజిత్ బాషా బాధ్యతలు తీసుకున్నా.. అప్పటి కలెక్టర్ డాక్టర్ సృజన ఫొటోతో పాటు అప్పటి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్ వెంకట రంగారెడ్డి ఫొటో ఉన్న సూచిక బోర్డు అలాగే ఉన్నాయి. అధికారులు మారినా బోర్డులు మార్చకపోవడంపై ప్రజలు విమర్శిస్తున్నారు.

News June 30, 2024

కర్నూలు: తుంగభద్ర డ్యాంలో 5 టీఎంసీల నీటి నిల్వ

image

ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా వచ్చి చేరుతోందని తుంగభద్ర డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో డ్యాముకు ఆదివారం 6,308 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని వెల్లడించారు. ప్రస్తుతం జలాశయంలో 5.79 టీఎంసీల నీటి నిల్వ ఉందని పేర్కొన్నారు.

News June 30, 2024

ఆదోని: రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

ఆదోని పట్టణంలోని స్థానిక రాయనగర్ సమీపాన గుర్తు తెలియని వ్యక్తి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్సై గోపాల్ తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని గుర్తించి పంచనామా నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

News June 30, 2024

RU: 1 నుంచి PG సెమిస్టర్ పరీక్షలు

image

రాయలసీమ విశ్వవిద్యాలయంలో పీజీ-4వ సెమిస్టర్ పరీక్షలను జులై 1 నుంచి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ఆచార్య వెంకటసుందరానంద్ పుచ్చ తెలిపారు. వర్సిటీ కళాశాలతో పాటు మరో ఐదు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రెగ్యులర్ 468 మంది, సప్లిమెంటరీ 103 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.