India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజంపేటలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. కోవెలకుంట్లకు చెందిన కిరణ్ రాజంపేట ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. శనివారం కిరణ్ పుట్టినరోజు కావడంతో పులివెందులకు చెందిన ఫ్రెండ్ బన్నీ చెన్నైలో చదువుతూ రాజంపేటకు వచ్చారు. కాగా వీరి ఇరువురినీ ఆర్టీసీ బస్సు ఢీకొని పుట్టినరోజు నాడే మృతి చెందగా.. అదే చివరి రోజైందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
నంద్యాల కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కోర్టు ఆవరణలో నిర్వహించామని మూడవ అదనపు జిల్లా జడ్జి వాసు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లోక్ అదాలత్లో సీసీ కేసులు 92, సివిల్ కేసులు 41, క్రిమినల్ కేసులు 118, ఎక్సైజ్ 16 కేసులు చొప్పున మొత్తం 362 కేసులు పరిష్కారం అయ్యాయని న్యాయమూర్తి వాసు తెలిపారు. పలు కేసుల్లో రాజీ అయిన కక్షిదారులకు 8.56 కోట్ల రూపాయలను పరిహారంగా అందించామన్నారు.
ఏపీలో ఐదు ప్రధాన నగరాలను ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో రాయలసీమలోని కర్నూలుకు సీఎం చంద్రబాబు చోటు కల్పించారు. కర్నూలు జిల్లాలో విత్తన కేంద్రం, రక్షణ-పౌర విమానయానం, సౌర, పవన విద్యుత్ సంబంధించిన కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
నంద్యాల జిల్లా కొలిమిగుండ్లకు చెందిన బీటెక్ విద్యార్థి శ్రీ హర్ష (20) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ రమేశ్ బాబు వివరాల మేరకు.. శ్రీ హర్ష గుజరాత్లోని వొడదొరలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. తన కొడుకు బలవన్మరణానికి ప్రేమవ్యవహారమే కారణమని తండ్రి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని వివరించారు.
కర్నూలు జిల్లాలో నేడు సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. కేసీ కెనాల్, SRBC, తెలుగు గంగ, మైనర్ ఇరిగేషన్, మైలవరం పరిధిలోని ఆయకట్టు రైతులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సుమారు 3లక్షల మంది రైతులు నేడు ఓటేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాటు పూర్తి చేశారు. పలు చోట్ల 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
తన మిత్రుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్పై నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఇంకా స్పందించలేదు. నిన్న మధ్యాహ్నం బన్నీ అరెస్ట్ కాగా శిల్పా రవి ఇంకా స్పందించకపోవడంతో ఫ్యాన్స్ విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే శిల్ప రవి నిన్న నంద్యాలలో జరిగిన రైతు ధర్నాలో పాల్గొన్నారు. ఇవాళ హైదరాబాద్లో అల్లు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తనపై నంద్యాలలో నమోదైన కేసులో ఉపశమనం పొందిన హీరో అల్లు అర్జున్ మరో కేసులో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఎన్నికల వేళ బన్నీపై నంద్యాలలో కేసు నమోదు కాగా ఇటీవలే ఏపీ HC కొట్టేసిన విషయం తెలిసిందే. అయితే పుష్ప-2 ప్రీమియర్ షో వీక్షించేందుకు HYDలోని సంధ్య థియేటర్కు బన్నీ రాగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. మహిళ మృతి చెందడంతో నమోదైన కేసులో ఆయన ఒకరోజు జైలులో గడపాల్సి వచ్చింది.
పత్తికొండ టమోటా మార్కెట్లో రైతుల నుంచి టమోటా కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డుకు 42 ఉత్పత్తులు వచ్చాయని, ఇందులో 13 టన్నులు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేసి రాష్ట్రంలోని వివిధ రైతు బజార్లకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. టమోటా కిలో కనిష్ఠ ధర రూ.4 లకు కొనుగోలు చేయాలని ఆదేశించారు.
బనగానపల్లె నెహ్రూ పాఠశాలలో గురువారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. మంత్రి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మేళాను ప్రారంభించారు. 30కి పైగా కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొనగా.. 1000 మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించాయి. ఎంపికైన అభ్యర్థులకు ఇందిరా రెడ్డి ఆఫర్ లెటర్లను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
పత్తికొండ నుంచి టమాటా ఎగుమతులకు డిమాండ్ తగ్గడంతో ధరలు భారీగా పడిపయాయి. ఇతర ప్రాంతాల్లో నాణ్యతను బట్టి కిలో రూ.20కిపైగా అమ్ముడుపోతుండగా ఇక్కడ మాత్రం కిలో ₹1 నుంచి ₹8 వరకు పలకడం విశేషం. పత్తికొండ మార్కెట్కు వచ్చే టమాటాను తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలకు తరలిస్తారు. ఆయా చోట్ల స్థానిక దిగుబడి పెరగడంతో పత్తికొండ మార్కెట్పై ఎఫెక్ట్ పడింది. దిగుబడులను రైతులు రోడ్ల పక్కన పారబోస్తున్నారు.
Sorry, no posts matched your criteria.