India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, గౌరు వెంకటరెడ్డి దంపతులను సినీ నటుడు నటుడు రాజకుమార్ కలిశారు. కర్నూలులోని గౌరు దంపతుల స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. జ్ఞాపిక అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు అంశాలపై కాసేపు ముచ్చటించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీడీపీ ఎంపీలతో బుధవారం నిర్వహించిన చిట్చాట్లో కీలక సూచనలు, సలహాలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి స్పందించారు. ‘మీ విలువైన సమయం మాకు కేటాయించి కీలక సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు మోదీ సార్’ అంటూ ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో తాము భాగస్వామ్యం అయ్యేందుకు ఎదురుచూస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలుచోట్ల వాతావరణం చల్లగా మారింది. ఆకాశంలో మేఘాలు దట్టంగా కమ్ముకుని ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. చిటపట చినుకులు కురిపించేందుకు నల్లటి మేఘాలు సిద్ధంగా ఉన్నట్లు చూపరులకు అనిపిస్తోంది. అందమైన వాతావరణం ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుండగా మహానంది సమీపంలో ఓ నెటిజన్ క్లిక్ మనిపించిన దృశ్యం ఆకట్టుకుంటోంది.
మహానంది మండల పరిధిలో సంచరిస్తున్న చిరుత పులి సంచారంపై నంద్యాల కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి గ్రామంలో దండోరా వేస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. అయితే గ్రామాలలో ఎక్కడా చిరుత పులి సంచారంపై దండోరా కానీ ప్రజలను అప్రమత్తం చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.
ఆస్పరి మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైల్వే స్టేషన్ మీదుగా గురువారం ఉదయం 8 గంటల సమయంలో భారత్ ఎక్స్ప్రెస్ రైలు వెళ్లిందని స్టేషన్ మాస్టర్ తెలిపారు. ఈ రైలు హుబ్లీ మీదుగా గుంతకల్లుకు వెళ్తుందని చెప్పారు. మొదటిసారిగా వందేభారత్ రైలు ఆస్పరి మీదుగా రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పెద్దకడబూరు మండలం మేకడోణలో ఏరువాక ఎద్దుల పండుగ సందర్భంగా 140 కేజీల నల్ల రాతి గుండు బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో వైసీపీ కో ఆప్షన్ మెంబర్ రెడ్డి షేర్ ఖాన్ పటేల్ గెలుపొందారు. పోటీలను చూడటానికి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల యువకులు, ప్రజలు పెద్ద సంఖ్యలతో తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండ పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు.
ఈనెల 29, 30వ తేదీల్లో నంద్యాల నంది పైప్స్ బ్యాడ్మింటన్ అకాడమీలో జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఆ క్రీడ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి వంశీధర్ తెలిపారు. 29న అండర్-11, 13, 15 బాలబాలికలకు సింగిల్స్, డబుల్స్ విభాగంలో, 30న అండర్-17, 19 బాలబాలికల విభాగాలతో పాటు సీనియర్ విభాగంలో పురుషులకు, మహిళలకు సింగిల్స్, డబుల్స్లో విడివిడిగా పోటీలు జరుగుతాయన్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో 6, 7, 8, 9వ తరగతిలో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు APSWREIS కో-ఆర్డినేటర్ ఐ.శ్రీదేవి తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఆయా పాఠశాలల్లో పొంది ఈ నెల 28వ తేదీ లోగా అదే పాఠశాలల్లో అందజేయాలన్నారు. రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు.
కేజీబీవీల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు రుచికర భోజనం వడ్డించాలని ప్రిన్సిపల్స్కు ఆదేశాలు జారీ చేసినట్లు డీఈవో శామ్యూల్ తెలిపారు. బుధవారం కోడుమూరు, కోసిగి కేజీబీవీలను తనిఖీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కోసిగి కేజీబీవీలో విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనం నాణ్యతగా లేకపోవడం, వంట గది నిర్వహణ శుభ్రంగా లేకపోవడంతో ప్రిన్సిపల్, అకౌంటెంట్కు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు.
మహానంది అటవీ పరిసర ప్రాంతాలలో చిరుతపులి సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నంద్యాల జిల్లా కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో చిరుత పులి సంచారం – జాగ్రత్తలపై జాయింట్ కలెక్టర్ టి. రాహు కుమార్ రెడ్డితో కలిసి అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అనురాగ్ మీనా, నంద్యాల డీఎఫ్ఓ శివ శంకర్ రెడ్డిలతో సమీక్షించారు.
Sorry, no posts matched your criteria.