Kurnool

News December 8, 2024

బేతంచర్లలో ఇరు వర్గాల హిజ్రాల మధ్య ఘర్షణ

image

బేతంచెర్లలోని కొత్త బస్టాండు సమీపంలో ఆదివారం హిజ్రా వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నంద్యాలకు చెందిన హిజ్రాల వర్గం బేతంచర్లకు వచ్చి డబ్బువసూలు చేయకూడదని స్థానికులు వాగ్వాదానికి దిగారు. స్థానికుల సమాచారంతో బేతంచర్ల ఎస్సై రమేశ్ బాబు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో ఘర్షణ సద్దుమణిగింది.

News December 8, 2024

బనగానపల్లెలో టీచర్‌పై కేసు

image

ఓ ప్రైవేటు పాఠశాల టీచర్‌ను తల్లిదండ్రులు చితకబాది పోలీసులకు అప్పగించిన ఘటన బనగానపల్లెలో శనివారం జరిగింది. మ్యాథ్స్ టీచర్ ధృవకుమార్ విద్యార్థులకు మార్కులు ఎక్కువ వేస్తానని ఓ విద్యార్థిని వద్ద డబ్బు వసూలు చేసినట్లు యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదైనట్లు ఎస్సై తెలిపారు. అయితే దాంతో పాటు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిసి పేరెంట్స్ చితకబాది పోలీసులకు అప్పగించినట్లు సమాచారం.

News December 8, 2024

విద్యార్థులకు శ్లోక రూపంలో అవగాహన కల్పించిన కలెక్టర్

image

పిల్లల భవిష్యత్తు గుర్తించి పిల్లల్లో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత తల్లితండ్రులు, ఉపాధ్యాయులపై ఉందని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు. బేతంచెర్ల మండలం RS రంగాపురం ZPH స్కూల్లో మాట్లాడుతూ.. సమాజంలో గౌరవింపబడాలంటే 5వ కారాలతో కూడిన ప్రవర్తన ఉండాలన్నారు. వస్త్రేనా వపుషా వాచా విద్య యా వినయైన చవ కారైహి పంచ బి ర్యుక్తఃన రో భవతి పండితః అని శ్లోక రూపంలో వివరించి భావం తెలిపారు.

News December 7, 2024

కర్నూలు జిల్లాలో ‘నో డ్రగ్స్ బ్రో’ క్యాంపెయిన్

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో శుక్రవారం ఎస్పీ జి.బిందు మాధవ్ ఆదేశాల మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్, హోంమంత్రి అనిత స్ఫూర్తితో ‘నో డ్రగ్స్ బ్రో’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదోని మండలం దొడ్డనకేరి మోడల్ ప్రైమరీ స్కూల్లో ఓ దివ్యాంగ విద్యార్థి తన తల్లిదండ్రులతో కలిసి డ్రగ్స్ నిర్మూలనపై ప్లకార్డుతో అవగాహన కల్పించారు.

News December 7, 2024

కర్నూలు జిల్లా క్రైం న్యూస్

image

☛ దేవనకొండ మండలంలో బాలికపై అత్యాచారయత్నం.. గ్రామంలో ఉద్రిక్తత
☛ కర్నూలు పద్మావతినగర్‌లో బాలయ్య (63) అనే వృద్ధుడి ఆత్మహత్య
☛ ఓర్వకల్లు కస్తూర్బాలో ఇద్దరు విద్యార్థినులకు తేలు కాటు.. అస్వస్థత
☛ కర్నూలు బళ్లారి చౌరస్తాలో ప్రమాదం.. అచ్చెన్న అనే వ్యక్తి మృతి
☛ నంద్యాల: మహిళల పట్ల అసభ్య ప్రవర్తన.. వెంకటేశ్ అనే వ్యక్తికి 10 రోజుల జైలు శిక్ష
☛ ప్యాపిలి వద్ద బైక్ అదుపుతప్పి 20ఏళ్ల రాజు అనే యువకుడి మృతి

News December 7, 2024

కుమార్తె పెళ్లి రండి.. ప్రధానికి మంత్రి భరత్ ఆహ్వానం

image

మంత్రి టీజీ భరత్ ప్రధాని మోదీని కలిశారు. ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి కాసేపు చర్చించారు. ఈ సందర్భంగా గతంలో ఒక కమిటీకి ఛైర్మన్‌గా నాన్న టీజీ వెంకటేశ్ చేసిన కృషిని ఆయన గుర్తు చేసుకోవడం తనకు ఆనందాన్ని ఇచ్చిందని మంత్రి తెలిపారు. అనంతరం తన కుమార్తె శ్రీ ఆర్యపాన్య వివాహానికి రావాలని పెళ్లి పత్రిక అందజేశారు. నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. కాగా ఈ నెల 26న హైదరాబాద్‌లో వారి పెళ్లి జరగనుంది.

News December 7, 2024

శ్రీశైలం డ్యామ్‌ను సందర్శించిన హీరో నాగార్జున

image

శ్రీశైలం డ్యామ్‌ను ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున శుక్రవారం సందర్శించారు. మల్లన్న దర్శనార్థమై వచ్చిన ఆయన శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్తూ మార్గమధ్యలో డ్యామ్ వద్ద కాసేపు ఆగారు. జలాశయం అందాలను తిలకించారు. డ్యామ్ వద్ద ఉపాధి పొందే పలువురు ఫోటోగ్రాఫర్లు నాగార్జునతో ఫొటోలు దిగారు. అంతకుముందు నూతన వధూవరులు అక్కినేని నాగచైతన్య, శోభితతో కలిసి నాగార్జున శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు.

News December 7, 2024

నేటి నుంచి శ్రీశైలంలో స్పర్శ దర్శనం నిలిపివేత

image

శ్రీశైల క్షేత్రంలో వెలసిన మల్లికార్జున స్వామి స్పర్శదర్శనాన్ని శని, ఆది, సోమవారాల్లో తాత్కాలికంగా నిలిపివేసినట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. శని, ఆది, సోమవారాల్లో క్షేత్రానికి భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో ఈ 3 రోజుల్లో ఉచిత స్పర్శదర్శన సేవలు నిలిపివేసినట్లు తెలిపారు. తిరిగి మంగళవారం నుంచి శుక్రవారం వరకు యథావిధిగా స్పర్శ దర్శనం సేవలు కొనసాగుతాయని వెల్లడించారు.

News December 7, 2024

చంద్రబాబుపై నమ్మకంతోనే రాష్ట్రానికి పెట్టుబడులు: మంత్రి బీసీ

image

సీఎం చంద్రబాబు నాయుడుపై నమ్మకంతోనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు తరలివస్తున్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆయన మాట్లాడారు. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో గుంతలు పడ్డ రోడ్లకు మరమ్మతులు చేపడుతున్నామని చెప్పారు. ఇందు కోసం ఇప్పటికే నిధులను కేటాయించామన్నారు. త్వరలోనే పనులు పూర్తవుతాయని తెలిపారు.

News December 6, 2024

ప్రధానితో భేటీ అద్భుతమైన అనుభవం: మంత్రి భరత్

image

ప్రధాని మోదీని మంత్రి టీజీ భరత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో కలిసి పలు అంశాలపై ఆయనకు వినతి పత్రం అందజేశారు. ‘ప్రధాని మోదీని కలవడం గౌరవంగా భావిస్తున్నా. గతంలో ఒక కమిటీకి ఛైర్మన్‌గా మా నాన్న టీజీ వెంకటేశ్ చేసిన కృషిని ఆయన గుర్తు చేసుకోవడం నాకు ఆనందాన్ని ఇచ్చింది. పీఎంను కలిసి చర్చించే అవకాశం రావడం నాకు నిజంగానే ఒక అద్భుతమైన అనుభవం’ అని మంత్రి ట్వీట్ చేశారు.