India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లా పోలీస్ మైదానంలో 62వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం జిల్లా ఎస్పీ బిందు మాధవ్, హోంగార్డ్ కమాండెంట్ ఎం.మహేశ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసులతో సమానంగా హోంగార్డులు శాంతిభద్రత పర్యవేక్షణలో మంచి సేవలు అందిస్తున్నారని తెలిపారు. హోంగార్డుల సమస్యల పట్ల పోలీసు యంత్రాంగం తరఫున తన వంతు కృషి చేస్తానన్నారు.
హోళగుంద మం. హెబ్బటంలో తల్లీ, కూతురు <<14801963>>మృతిచెందిన<<>> విషయం తెలిసిందే. సకరప్ప, సలీమా(21)కు పెళ్లైన ఏడాదికి పుట్టిన ఆడబిడ్డ 40రోజులకు చనిపోయింది. తర్వాత సమీరా(3)కు జన్మనిచ్చింది. ప్రస్తుతం గర్భిణి. అయితే మరోసారి ఆడపిల్లే పుడుతుందేమోనని భర్త రోజూ గొడపపడేవాడు. గురువారమూ వీరి మధ్య గొడవజరిగి, ఆవేశంతో కర్రతో సలీమా తలపై కొట్టి చంపాడు. అదంతా పాప చూడటంతో చిన్నారిని కూడా గొంతు నులిమి చంపి పోలీసులకు లొంగిపోయాడు.
ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ ఈనెల 7న నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పీరంజిత్ బాషా వెల్లడించారు. గురువారం కర్నూలు కలెక్టరేట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థి ప్రగతి తెలుసుకోవడానికి, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, నాణ్యమైన విద్య అందించడానికి ఈ సమావేశం ఉపయోగపడుతుందని తెలిపారు. తల్లిదండ్రులు, టీచర్లు, విద్యార్థులకు మధ్య మంచి సంబంధాలు నెలకొనేందుకు ఉపయోగపడతాయన్నారు.
హోళగుంద మండలం హెబ్బటంలో గురువారం సాయంత్రం తల్లీ, కూతురు అనుమానాస్పద స్థితిలో మృతించెందారు. కంబదహాల్కు చెందిన సకరప్పకు, ఇంగళదహల్కు చెందిన సలీమా(21)కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఉపాధి కోసం రెండేళ్ల క్రితం హెబ్బటం వచ్చారు. వీరికి మూడేళ్ల కూతురు సమీరా ఉంది. గురువారం భార్యభర్తల మధ్య గొడవ జరిగిందని, నీ కూతురు, మనవరాలు చనిపోయి ఉన్నారని పక్కింటి వారు తమకు ఫోన్ చేసి చెప్పారని మృతురాలి తల్లి తెలిపారు.
ఆదోనిలోని ప్రభుత్వ టీచర్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పట్టణంలోని పూల బజార్ వీధిలో నివాసముంటున్న ఎస్ఎం భారతి గురువారం సాయంత్రం ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు భర్త శివ ప్రకాశ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని ఆదోని జనరల్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల పూర్తి సమాచారం తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.
హంద్రీ దినోత్సవం సందర్భం కర్నూలులోని పింగళి సూరన తెలుగు తోటలో ‘హంద్రీ నది పరిరక్షణ అవశ్యకత-తీసుకోవాల్సిన చర్యలు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గాడిచర్ల ఫౌండేషన్ అధ్యక్షుడు చంద్ర శేఖర కల్కుర, మానవశక్తి పరిశోధన కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షుడు ఆచార్య మన్సూర్ రెహమాన్ పాల్గొన్నారు. అనేక గ్రామాలకు, పట్టణాలకు, నగరాల పుట్టుకకు హంద్రీ నది కారణమైందన్నారు.
నవంబర్ 28వ తేదీ వరకు తీసుకున్న క్లెయిమ్స్, అభ్యంతరాలను ఈనెల 24వ తేదీ లోపు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా ఈఆర్ఓలు, తహశీల్దార్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి స్పెషల్ సమ్మరీ రివిజన్-2025పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు త్వరలో రోల్ అబ్జర్వర్ వచ్చే అవకాశం ఉందని, ఇందుదకు సంబంధించిన రికార్డులన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు.
భూ సమస్యలను ఎదుర్కొంటున్నామని వచ్చిన అర్జీలను 45 రోజుల్లో రెవెన్యూ సమస్యలను ద్వారా పరిష్కరిస్తామని కలెక్టర్ రంజిత్ భాషా అన్నారు. గురువారం కర్నూల్ కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ నవ్యతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు నిర్వహించే గ్రామ సభలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జిల్లాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ కొనసాగుతోంది. ‘పుష్ప-2’ విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. అల్లు అర్జున్ కటౌట్స్కి పాలాభిషేకాలు, పూలమాలలు వేస్తూ డప్పులు, వాయిద్యాలతో రచ్చ చేస్తున్నారు. బేతంచర్లలోని వెంకటేశ్వర థియేటర్ వద్ద బన్నీ ఫ్యాన్స్ ఏకంగా పొట్టేలు బలి ఇచ్చారు. ఆ రక్తంతో అభిషేకం చేశారు. భారీ నిమ్మకాయల దండ, అల్లు అర్జున్ కటౌట్స్తో పట్టణ వీధుల్లో తిరిగారు.
హైదరాబాద్లోని సంధ్య థియేటర్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి బుధవారం రాత్రి నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ‘పుష్ప-2’ ప్రీమియర్ షోను వీక్షించి ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్తో దిగిన ఫొటోను శిల్పా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీనికి పుష్ప-2 వైల్డ్ ఫైర్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.