India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఏదో ఒక లింక్ పంపించి, ఆశ చూపడంతో అమాయక యువత వారి ఉచ్చులో పడి నిలువునా దోపిడీకి గురవుతున్నారన్నారు. ఉచితాలకు మోసపోయి సైబర్ నేరగాళ్ల వలలో పడవద్దు అన్నారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే ఘటన జరిగిన వెంటనే బాధితులు 1930 నంబర్కు సమాచారం అందించాలన్నారు.
కర్నూలు జిల్లాలో ఎల్లుండి నుంచి జరగాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ మేరకు కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లకు సమాచారం పంపిన ప్రభుత్వం.. తదుపరి నోటిఫికేషన్ జారీ తేదీని త్వరలో వెల్లడిస్తామని స్పష్టం చేసింది. కాగా, కొద్దిరోజులుగా తుఫాన్, భారీ వర్షాల నేపథ్యంలో సాగునీటి సంఘాల ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
సాగునీటి సంఘం ఎన్నికలపై దృష్టి సాధించాలంటూ ఎమ్మెల్యే విరుపాక్షి పేర్కొన్నారు. మంగళవారం ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల వైసీపీ కార్యాలయంలో ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. అన్నిచోట్లా వైసీపీ అభ్యర్థులు పోటీలో ఉంటారని ఆయన వెల్లడించారు. కూటమి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.
శ్రీశైల మల్లన్న సన్నిధిలో దర్శనాల్లో పలు సేవలను నిలుపుదల చేస్తూ దేవస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీస్వామివారి గర్భాలయ అభిషేకం (రూ.5000), ఉదయాస్తమాన సేవ (రూ.1,01,116), ప్రాతఃకాల సేవ (రూ.25,116), ప్రదోషకాల సేవ (రూ.25,116), సామూహిక అభిషేకము (రూ.1500), శ్రీస్వామివారి స్పర్శదర్శనం (రూ.500), వీఐపీ బ్రేక్ (రూ.500), అమ్మవారి ముఖమండపంలో కుంకుమ పూజలను నిలుపుదల చేశారు.
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన <<14776158>>శ్రీశైల<<>> క్షేత్రంలో స్వామి, అమ్మవార్ల దర్శనాల్లో ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రతి శని, ఆది, సోమవారాలు, ప్రభుత్వ సెలవు రోజులు, దేవస్థాన వైదిక కమిటీ నిర్ధారించిన రోజుల్లో భక్తులందరికీ కేవలం స్వామి వారి అలంకార దర్శనం మాత్రమే కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
డోన్లో క్రిఫ్టో కరెన్సీ పేరుతో మోసానికి పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ శ్రీనివాసులు వివరాల మేరకు.. నిందితుడు రామాంజినేయులు రూ.లక్షకు రూ.10వేలు ఇస్తానని మోసం చేస్తున్నట్లు తెలిపారు. ఫిర్యాదులు రావడంతో అరెస్ట్ చేశామన్నారు. సులభంగా డబ్బు వస్తుందనే మాయలో పడి ప్రజలు మోసకపోకండని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ ఇంతియాజ్ బాషా, ఎస్ఐలు శరత్ కుమార్ రెడ్డి, నరేంద్ర పాల్గొన్నారు.
ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం కింద గృహ వినియోగదారులకు రాయితీపై సోలార్ రూఫ్ టాప్లను ఏర్పాటు చేయనున్నామని, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. సోమవారం నంద్యాల పీజిఆర్ఎస్ హాలులో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం గోడపత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఆసక్తి ఉన్నవారు www. pmsuryaghar.gov.in/ APSPDCL వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వారు తెలిపారు.
రెవెన్యూ శాఖకు సంబంధించిన భూ వివాదాల కేసులు పరిష్కరించడం లేదని కలెక్టర్ రంజిత్ బాషా రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. రెవెన్యూలో ఎక్కువ శాతం రీఓపెనింగ్ జరుగుతున్నాయని అన్నారు. సబ్ కలెక్టర్, ఆర్డీఓలు, తహసీల్దార్లు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
రైలు ఢీకొని విద్యార్థి మృతి చెందిన ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న సతీశ్ అనే యువకుడు సోమవారం బొమ్మల సత్రం రైల్వే ట్రాక్ సమీపంలో బహిర్భూమికి వెళ్లాడు. తిరిగి వస్తున్న సమయంలో రైలు ఢీకొనడంతో మృతి చెందాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన యువకుడిపై ఆదోనిలో కేసు నమోదైంది. సీఐ శ్రీరామ్ వివరాల మేరకు.. ఆదోనికి చెందిన గురుప్రసాద్ బెంగళూరులో జాబ్ చేస్తున్నారు. మైసూరు యువతి చందన పరిచయమైంది. ఇరువురూ ప్రేమించుకుని పెళ్లికి సిద్ధమయ్యారు. కుటుంబ సభ్యులతో చర్చల తర్వాత యువకుడు పెళ్లికి నిరాకరించారు. దీంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రియుడితోపాటు కుటుంబ సభ్యులపై పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.