India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గోనెగండ్లకు చెందిన సుంకులమ్మ (81) అనే మహిళ కాలిన గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందిందని సీఐ గంగాధర్ తెలిపారు. సీఐ వివరాల మేరకు.. ఎస్సీ కాలనీలో ఉండే సుంకులమ్మ నవంబర్ 28న వేడి నీళ్ల కోసం పొయ్యి దగ్గరకు వెళ్లగా చీరకు నిప్పు అంటుకొని మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు పేర్కొన్నారు. కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసామన్నారు.
నంద్యాల జిల్లాలో డిసెంబర్ 8న ప్రశాంత వాతావరణంలో సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఎన్నికల నిర్వహణపై నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డిసెంబర్ 5న సాగునీటి సంఘాల ఎన్నికలకు ప్రకటన వెలువడుతుందని తెలిపారు.
ఏపీ క్యాబినెట్ భేటీ ఈనెల 3న నిర్వహిస్తున్నట్లు చీఫ్ సెక్రటరీ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. మొదట ఈ నెల 4న నిర్వహించాలని భావించగా, దానిని 3వ తేదీకి మారుస్తూ తాజాగా సీఎస్ ఉత్తర్వులిచ్చారు. CM చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్, టీజీ భరత్ హాజరుకానున్నారు.
కర్నూలులో త్వరలోనే హైకోర్టు బెంచ్ ప్రారంభించనున్నట్లు మంత్రులు ఎన్ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. శనివారం ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ దేవాలయ ప్రాంగణంలో టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన కార్యక్రమం నిర్వహించారు. మంత్రులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించి చేయలేదన్నారు. తమ ప్రభుత్వం హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తుందన్నారు.
తెలంగాణ షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు వాసులు ఇద్దరు మృతిచెందారు. రెడ్డిపాలెంలో పత్తి తీసేందుకు కర్నూలు నుంచి వలస కూలీలు శుక్రవారం రాత్రి ట్రైన్లో తిమ్మాపూర్కు వెళ్లారు. తిరిగి శనివారం రాత్రి ఓ ట్రాక్టర్లో వస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో సోమమ్మ(55), మమత(5) అక్కడికక్కడే మృతిచెందారు. గాయాలైన ఇద్దరిని షాద్నగర్ ఆస్పత్రికి తరలించారు.
వికారాబాద్ జిల్లా లగచర్లలో ఇటీవల కలెక్టర్, అధికారులపై దాడి నేపథ్యంలో తెలంగాణ CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారుల మీద దాడులు చేయాల్సి వస్తే శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు కట్టేవాళ్లా? అంటూ ‘రైతు పండుగ‘ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘విపక్షాల ఉచ్చులో పడొద్దు.. కుటుంబాలు నాశనం చేసుకోవద్దు.. మహబూబ్నగర్ జిల్లాపై పగబట్టి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు’ అని అన్నారు.
క్యాన్సర్ వ్యాధిని మొదటి దశలోనే గుర్తిస్తే నివారణ సాధ్యమని కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. కర్నూలు వైద్య కళాశాలలో నిర్వహించిన స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ తొలి సదస్సులో ప్రివెంటివ్ ఆంకాలజీ, ప్యాలియేటివ్ కేర్ అన్న అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కర్నూలు జిల్లాలో ఏర్పాటు కావడం గర్వకారణమన్నారు.
డిసెంబరు 7న మెగా పేరెంట్స్ టీచర్లు మీటింగ్ డేను ఉత్సాహభరితమైన వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా విద్యా శాఖాధికారులను ఆదేశించారు. శనివారం కర్నూలు కలెక్టరేట్ నుంచి మెగా టీచర్స్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ డే అపార్ కార్డుల జనరేషన్ పురోగతిపై సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అపార్ ఐడి జనరేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
డిసెంబర్ 2న కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని కలెక్టర్ రంజిత్ బాషా శనివారం తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రాజకీయ పార్టీల నాయకులు అందించిన ఫిర్యాదులను పారదర్శకంగా విచారణ చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. శనివారం నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం-2025లో భాగంగా జిల్లా కలెక్టర్ జీ. రాజకుమారి, జేసీ విష్ణుచరణ్తో కలిసి ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ కె.కన్నబాబు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో సమీక్ష నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.