Kurnool

News November 30, 2024

వక్ఫ్, దేవాదాయ భూములు ఆక్రమణలకు గురి కాకుండా రక్షించాలి: కలెక్టర్

image

వక్ఫ్, దేవాదాయ భూములు ఆక్రమణలకు గురి కాకుండా రక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందని కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా వక్ఫ్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వక్ఫ్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేసి తొలి సమావేశాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు.

News November 30, 2024

డిసెంబర్ 2న కర్నూలు కలెక్టరేట్ ఎదుట వాలంటీర్ల మహా ధర్నా

image

డిసెంబర్ 2న కర్నూలు కలెక్టరేట్ వద్ద వాలంటీర్లు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు షేక్ నూర్ అహ్మద్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాజ్ విహార్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు అధిక సంఖ్యలో పాల్గొని మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

News November 30, 2024

నూతన వితంతు పింఛన్ల‌పై కర్నూలు కలెక్టర్ కీలక ప్రకటన

image

NTR భరోసా పింఛను పథకం ద్వారా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నూతన మార్గదర్శకాలు జారీ చేసిందని కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఈ మార్గదర్శకాల ప్రకారం పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యాజమాని మరణిస్తే వెంటనే అతని భార్యకు వితంతు పింఛన్ మంజూరు చేస్తామన్నారు. ఈ ఉత్తర్వులు 01.11.2024 తేదీ తర్వాత మరణించిన వారికి మాత్రమే వర్తిస్తాయని, అర్హులైన వారు వినియోగించుకోవాలని కోరారు.

News November 30, 2024

కోవెలకుంట్లలో ఆర్టీసీ బస్సు కింద పడి మెకానిక్ దుర్మరణం

image

నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో శనివారం విషాదం ఘటన జరిగింది. ఆర్టీసీ అద్దె బస్సులో ప్రైవేట్ మెకానిక్ చిన్న వెంకట రమణారావు (గణపతి) రిపేరు పని చేస్తున్నారు. ఈ క్రమంలో డ్రైవర్ చూసుకోకుండా బస్సును ముందుకు కదిలించడంతో బస్సు చక్రాలు మెకానిక్ తలపై నుంచి వెళ్లాయి. రమణారావు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

News November 30, 2024

లోక్‌సభలో కీలక బిల్లును ప్రవేశపెట్టిన నంద్యాల ఎంపీ

image

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్‌సభలో శుక్రవారం ఆమె కీలక బిల్లును ప్రవేశపెట్టారు. తన పార్లమెంట్ స్థానమైన నంద్యాల కేంద్రంలో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్(CICDP) ఏర్పాటు చేయాలని కోరుతూ ఎంపీ శబరి లోక్‌సభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. 

News November 30, 2024

కర్నూలులో క్వింటా ఉల్లి రూ.5,259

image

ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి. కర్నూలు మార్కెట్‌లో నిన్న గరిష్ఠంగా క్వింటా రూ.5,259 పలికింది. మధ్యస్థ ధర రూ.3,519గా ఉంది. ఉల్లి ధర అమాంతం పెరిగినా ఎండుమిర్చి ధరలు పతనమయ్యాయి. క్వింటా రూ.14,859 మాత్రమే పలికింది. గతేడాది ఇదే సమయానికి సుమారు రూ.25వేలు పలకడం విశేషం. ఇక వేరుశనగ కాయలు గరిష్ఠంగా రూ.6,850తో విక్రయాలు సాగుతున్నాయి.

News November 30, 2024

KNL: 153 మంది ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు నోటీసులు

image

హౌసింగ్‌కు సంబంధించి పురోగతి చూపని 153 మంది ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నోటీసులు పొందిన వారి వివరణల్లో సరైన కారణం లేకపోతే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. కాంట్రాక్టర్లతో పీడీ హౌసింగ్, సబ్ కలెక్టర్, ఆర్డీవోలు సమావేశం ఏర్పాటు చేసుకొని ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా చేయాలన్నారు.

News November 30, 2024

ఇస్తేమాకు అన్ని సౌకర్యాలూ కల్పిస్తాం: కలెక్టర్

image

ఇస్తేమాకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ఆత్మకూరులో జనవరిలో జరగనున్న ఉమామి తబ్లిగే ఇస్తేమా ఏర్పాట్లను ఆమె పరిశీలించి మాట్లాడారు. మత పెద్దలు కమిటీలను ఏర్పాటు చేసుకుని, అందరి సహకారంతో పనులు చేసుకోవాలన్నారు. ఏమైనా సౌకర్యాలు కావాలంటే తమకు తెలపాలని, అవాంఛనీయ ఘటనలు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని మత పెద్దలను కోరారు.

News November 30, 2024

ఎమ్ఎస్ఎమ్ఈ సర్వేను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

ఎంఎస్ఎంఈ సర్వేను వేగవంతం చేసి వచ్చే ఏడాది ఫిబ్రవరి 1తేదీ నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా ఎంపీడీవోలను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఎంఎస్ఎంఈ సర్వే, హౌసింగ్, ఉపాధి హామీ, పీజీఆర్ఎస్, రీసర్వే, తదితర అంశాలపై స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. శుక్రవారం నుంచి సర్వే ప్రారంభం అయ్యిందని, వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

News November 30, 2024

గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కల్పించాలి: కలెక్టర్

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కల్పించాలని కలెక్టర్ రంజిత్ బాషా ఎంపీడీవోలను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎమ్ఎస్ఎమ్ఈ సర్వే శుక్రవారం నుంచి ప్రారంభం అయిందన్నారు. ప్రభుత్వం ఈ అంశానికి ప్రాధాన్యత ఇస్తోందని, సర్వేను వేగవంతం చేయాలని ఆదేశించారు. సాగు నీటి సంఘాల ఎన్నికలను ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలన్నారు.