Kurnool

News November 29, 2024

సీసీ రోడ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయండి: కలెక్టర్

image

జిల్లాలో ప్రారంభించిన సీసీ రోడ్ల నిర్మాణ పనుల పూర్తికి 4 వారాలు మాత్రమే సమయం ఉందని, నాణ్యత ప్రమాణాలు పాటించి మండలాల వారీగా కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ రాజకుమారి పంచాయతీరాజ్ ఇంజినీర్లను ఆదేశించారు. నంద్యాల కలెక్టరేట్లో ఆమె మాట్లాడారు. 1,026 సీసీ రోడ్ల నిర్మాణానికి గాను 255 రోడ్లు పూర్తి అయ్యాయని, మిగిలిన 771 సీసీ రోడ్ల లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.

News November 28, 2024

తుంగభద్ర తీరంలో మొసలి కలకలం

image

తుంగభద్ర నది తీరంలో మొసలి కలకలం లేపింది. కౌతాళం మండలం గుడి కంబాలి సమీపంలో గురువారం తుంగభద్ర నది ఒడ్డున పెద్ద మొసలి పొలాల వైపు రావడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఏడాదిలో తుంగభద్ర నది తీరంలోని అనేక గ్రామాల పంట పొలాలలో మొసళ్లు కంటబడుతున్నాయి. నది చాగీ, కుమ్మలనూరు, మురళి గ్రామాల సమీపంలో 2 నెలల నుంచి మొసళ్లు సంచరిస్తూనే ఉన్నాయని, అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.

News November 28, 2024

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి: కలెక్టర్

image

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ప్రభుత్వ, ఎయిడెడ్ ఇంటర్మీడియట్ కళాశాలల ప్రిన్సిపల్‌లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం పెంపు పై ప్రభుత్వ, ఎయిడెడ్ ఇంటర్మీడియట్ కళాశాలల ప్రిన్సిపల్ లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

News November 28, 2024

తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రం అభివృద్ధి: కలెక్టర్

image

తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు సమగ్ర వివరాలతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేందుకు నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం నంద్యాల కలెక్టర్ ఛాంబర్‌లో శ్రీశైల మహాక్షేత్ర అభివృద్ధిపై జేసీ సీ.విష్ణు చరణ్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ అధికారి రాము నాయక్, తదితర అధికారులు ఉన్నారు.

News November 28, 2024

పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్

image

పదో తరగతి విద్యార్థులపై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని విద్యాశాఖ కార్యాలయంలో పదో తరగతి విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వర్చువల్ రూమ్‌ను ఆయన పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులకు వర్చువల్ విధానం ద్వారా నాణ్యమైన బోధన అందించాలని సూచించారు.

News November 28, 2024

జ్యోతిరావు పూలే ఆశయాలను సాధిద్దాం: టీడీపీ

image

సంఘసంస్కర్త, సామాజికవేత్త మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను సాధిద్దామని టీడీపీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకేపోగు ప్రభాకర్ అన్నారు. పూలే వర్ధంతి సందర్భంగా గురువారం కర్నూలులోని పార్టీ కార్యాలయంలో కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో కలిసి నివాళులు అర్పించారు. ప్రభాకర్ మాట్లాడుతూ.. సమాజిక వర్గ విభేదాలను రూపుమాపేందుకు పూలే పోరాటం సలిపారన్నారు.

News November 28, 2024

బేతంచెర్లలో యువకుడి ఆత్మహత్య

image

బేతంచెర్లలో నివాసం ఉంటున్న షేక్ హిమాయత్ (26) అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖరప్ప వివరాల మేరకు.. ఈ నెల 25న అదృశ్యమైన ఆయన నిన్న ఇంటికి వచ్చారు. నాపరాయ పరిశ్రమలో నష్టాలు రావడంతో మనస్తాపానికి గురై ఇవాళ ఇంట్లో ఉరివేసుకొని చనిపోయాడు. కాగా ఆయన భార్య కుబ్రా రెండు సంవత్సరాల క్రితం మృతి చెందారు. ఈ ఘటనపై హిమాయత్ తండ్రి మహమ్మద్ రఫీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News November 28, 2024

నంద్యాల జిల్లాకు వర్ష సూచన

image

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇవాళ తుఫానుగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాయలసీమలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ముఖ్యంగా నంద్యాల జిల్లాలో ఈ నెల 30, డిసెంబర్ 1వ తేదీన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

News November 28, 2024

నంద్యాల జిల్లాకు వర్ష సూచన

image

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇవాళ తుఫానుగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాయలసీమలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ముఖ్యంగా నంద్యాల జిల్లాలో ఈ నెల 30, డిసెంబర్ 1వ తేదీన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

News November 28, 2024

మహిళతో అసభ్య ప్రవర్తన.. నంద్యాల వ్యక్తికి జైలు శిక్ష

image

నంద్యాలకు చెందిన ఎస్.కరీముల్లా అనే వ్యక్తి మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు నంద్యాల 1వ పట్టణ సీఐ జి.సుధాకర్ రెడ్డి తెలిపారు. నిందితుడిని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా 7 రోజుల జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు. మహిళలు, బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు.