Kurnool

News November 28, 2024

పర్యవేక్షణ అధికారులపై చర్యలు తప్పవు: కర్నూలు డీఈవో

image

జిల్లా వ్యాప్తంగా FA మార్కుల నమోదులో జాప్యం చేస్తున్న పర్యవేక్షణ అధికారులపై చర్యలు తప్పవని జిల్లా విద్యాశాఖ అధికారి సామ్యూల్ పాల్ హెచ్చరించారు. బుధవారం డీఈఓ కార్యాలయం నుంచి పర్యవేక్షణ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు 71% ప్రైవేట్ పాఠశాలలు 75%, ఎయిడెడ్ పాఠశాలలు 65%, కర్నూలు, ఆదోని, కోసిగి మండలాలు వెనక పడ్డాయన్నారు. 28వ తేదీ లోపు పూర్తి కావాలన్నారు.

News November 27, 2024

తుగ్గలి: భార్య గొంతుకోసి హత్య చేసిన భర్త

image

తుగ్గలి మండలం రాంపల్లి గ్రామంలో దారుణ హత్య చోటు చేసుకుంది. సరోజ (35) అనే మహిళను భర్త గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. భార్యపై అనుమానంతో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. మృతురాలు సరోజకు ఇద్దరు కుమారులు ఉన్నారు. తుగ్గలి పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

News November 27, 2024

మంత్రి ఫరూక్‌ను సత్కరించిన న్యాయవాదులు

image

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తూ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌ను బుధవారం నంద్యాల తెలుగుదేశం పార్టీ ఎన్నికల సెల్ విభాగం న్యాయవాదులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని గుర్తుచేశారు. ప్రత్యేకించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసినందుకు కృషి చేస్తున్నారన్నారు.

News November 27, 2024

ఐపీఎల్‌లో మన కర్నూలు కుర్రాళ్లెక్కడ?

image

IPLకు ఉన్న క్రేజ్ వేరు. ప్రతి క్రికెటర్ ఆ టోర్నీలో ఆడాలని కల కంటారు. అలాంటి IPLలో కర్నూలు జిల్లా క్రీడాకారుల భాగస్వామ్యం లేదు. జిల్లాలో యువ క్రికెటర్లు ఉన్నప్పటికీ ఆ స్థాయిలో నైపణ్యాలు లేకపోవడంతో వేలంలో పాల్గొనే అవకాశం కూడా దక్కలేదు. ఇప్పటికైనా జిల్లాలో టాలెంట్ ఉన్న ప్లేయర్లను గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరోవైపు జిల్లాకు చెందిన అంజలి, అనూష మహిళా క్రికెట్‌లో సత్తా చాటుతున్నారు.

News November 27, 2024

పత్తికొండలో వ్యభిచార గృహంపై దాడులు

image

పత్తికొండలోని గుత్తి రోడ్డులో వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై సీఐ జయన్న ఆధ్వర్యంలో ఎస్ఐ గోపాల్, పోలీసు సిబ్బంది మంగళవారం దాడులు నిర్వహించారు. వ్యభిచార గృహం నిర్వాహకురాలితో పాటు ఐదుగురు విటులను అదుపులోకి తీసుకుని, ఒక యువతిని ఐసీడీఎస్‌కు అప్పగించినట్లు సీఐ జయన్న తెలిపారు. విటులు, వ్యభిచార గృహం నిర్వాహకురాలిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

News November 27, 2024

డోన్ రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫారం సమీపంలో మృతదేహం

image

డోన్ రైల్వే స్టేషన్ 4f ఫ్లాట్‌ఫారం సమీపంలో యువకుని(23) మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు ప్యాపిలి మండలం రాచర్లకు చెందిన యువకుడిగా పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం జీఆర్‌పీ ఎస్ఐ 9030481295ను సంప్రదించాలని కోరారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 27, 2024

ఎస్పీ కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

image

భారత రాజ్యాంగం ఆమోదించబడి నేటికి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో భారత రాజ్యాంగ రూపకర్త డా.బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. మన దేశానికి ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం కావాలని అంబేడ్కర్ లాంటి మహానుభావులు కృషి చేసి రాజ్యాంగాన్ని తీసుకువచ్చారన్నారు.

News November 26, 2024

మాదకద్రవ్యాల నియంత్రణకు చర్యలు తీసుకోండి: కలెక్టర్

image

మాదకద్రవ్యాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ హాలులో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధించి ఎస్పీ బిందుమాధవ్‌తో కలిసి జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీల యాజమాన్యాలు విద్యార్థులకు మాదకద్రవ్యాల వాడకం వల్ల జరిగే నష్టాలపై అవగాహన కల్పించాలన్నారు.

News November 26, 2024

సాయుధ దళాల కుటుంబాల సంక్షేమానికి సహకరించాలి: కలెక్టర్

image

దేశ రక్షణకు నిరంతర సేవలు అందిస్తూ యుద్ధ సమయంలో అమరులు, పదవీ విరమణ చేసిన సాయుధ దళాల కుటుంబాల సంక్షేమానికి అన్ని వర్గాల ప్రజలు తమ వంతు సహాయ, సహకారాలు అందించాలని కలెక్టర్ రంజిత్ బాషా పిలుపునిచ్చారు. మంగళవారం తన ఛాంబర్‌లో త్రిసాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సాయుధ దళాల పతాక స్టిక్కర్స్, కార్ ప్లాగ్‌ను ఆవిష్కరించారు. జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారి రత్న రూత్ పాల్గొన్నారు.

News November 26, 2024

నంద్యాలలో ఫెన్సింగ్ పోటీలు ప్రారంభం

image

68వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్-19 ఫెన్సింగ్ పోటీలు పద్మావతి నగర్‌లోని జిల్లా క్రీడా శాఖ ఇండోర్ స్టేడియంలో మంగళవారం ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా విద్యావేత్త రామకృష్ణ, నంద్యాల ఎంఈవో బ్రహ్మం నాయక్, పోటీల రాష్ట్ర పరిశీలకులు భవాని హాజరయ్యారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. 11 జిల్లాల నుంచి 300 మంది క్రీడాకారులు వచ్చారు.