India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వివరాలకు వెళ్తే ఆదివారం లక్ష్మీ అనే వివాహిత పొలంలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో అక్కడిక్కడే మృతి చెందారు. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త వీరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
బేతంచెర్ల వైష్ణవ పుణ్యక్షేత్రమైన మద్దిలేటి ఆలయంలోని కోనేరులో ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. గద్వాల మండలం వడ్డేపల్లికి చెందిన కురువ మహేశ్ (34) అనే వ్యక్తి మద్దిలేటి స్వామి దర్శనం కోసం శనివారం మద్దిలేటి స్వామి ఆలయానికి వచ్చారు. ఈ రోజు10 గంటల సమయంలో కోనేరులో ఈతకు వెళ్లాడు. గుంత ఉండడంతో అందులో మునిగి కనిపించలేదు. ఆదివారం ఉదయం మృతదేహం బయటపడింది.
ఓ కాటన్ షాపు ప్రారంభోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథితో కలిసి సినీ నటుడు సుమన్ ఆదివారం ఆదోనిలో పర్యటించారు. పట్టణంలోని కేవీఆర్ కాలనీలో కాటన్ షాపును ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆదోని భవిష్యత్తు పూర్తిగా మారుస్తానని, పెద్దల సహకారంతో పరిశ్రమలను తీసుకొస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.
పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 18న కర్నూలు అవుట్ డోర్ స్టేడియంలోని యోగా హాలులో జిల్లాస్థాయి యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంఘం కార్యదర్శి అవినాశ్ శెట్టి తెలిపారు. 8-10 ఏళ్ల వయసు, 10-12, 12-14, 14-16, 16-18 ఏళ్ల వయసు వారికి విభాగాల వారీగా పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 9247400100 ఫోన్ నంబర్కు సంప్రదించవచ్చు అన్నారు.
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్యాస్ట్రో ఎంట్రాలజీ వార్డు సమీపాన నిమ్మకాయలు, రంగు దారాలు, పసుపు, కుంకుమ చల్లి క్షుద్ర పూజలు నిర్వహించారు. విషయం తెలిసి ఆసుపత్రి సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. రోగులకు నయం కావాలని పూజలు చేశారా?, వ్యాధి నయమై ఇంటికెళ్లే సమయంలో చేశారా? లేక నిజంగానే క్షుద్ర పూజలు చేశారా? అనేది తెలియాల్సి ఉంది.
కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మాతాశిశు విభాగం ఎదుట మురుగు చేరడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలల తరబడి మురుగు తిష్ట వేయడంతో దోమలు బెడదతో అల్లాడిపోతున్నట్లు రోగులు వాపోతున్నారు. దీని పక్కనే రోగులకు ఆహారం అందిస్తున్నా మురుగును అరికట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల 23న ఉమ్మడి జిల్లాల హాకీ ఎంపిక పోటీలు నంద్యాల ఎస్పీజీ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్నట్లు సంఘం కార్యదర్శి దాసరి సుధీర్ శనివారం తెలిపారు. 1.1.1995 తర్వాత జన్మించినవారు అర్హులన్నారు. జిల్లా జట్టుకు ఎంపికైన వారు ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు ధర్మవరంలో జరిగే 14వ సీనియర్ పురుషుల హాకీ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారన్నారు.
ఎమ్మిగనూరులో శనివారం సాయంత్రం NH167 హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన సంగతి తెలిసిందే. వారిలో ఒకరు ఎమ్మిగనూరు మండలం గుడికల్కి చెందిన శివ, మరొకరు నందవరం మండలం హాలహర్వికి చెందిన గురుస్వామిగా గుర్తించారు. శివ చదువుకుంటూ ఉండగా, గురుస్వామి ఓ బేకరీ షాప్లో పనిచేస్తున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రమాదంలో యువకుల మృతదేహాలు చెల్లాచెదురుగా ఉండటంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఈనెల 19, 20వ తేదీల్లో కేంద్ర కరువు బృందం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు తెలిపారు. అధికారులందరూ కరవు బృందానికి కరవు తీవ్రత విషయాలను వివరంగా తెలియజేయాలని సూచించారు . ఈ సందర్భంగా ఆయన అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పర్యటించే కరువు బృందానికి తీవ్రత తెలియజేసే ఫోటోలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అధికారులు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు స్వల్పంగా నీరు వచ్చి చేరుతోంది. శనివారం తుంగభద్ర నుంచి శ్రీశైలం జలాశయానికి 15,131 క్యూసెక్కులు చేరాయి. అదే సమయానికి జలాశయ నీటిమట్టం 810.90 అడుగులుగా ఉంది. ప్రస్తుత నీటి నిలువ సామర్థ్యం 34.8332 టీఎంసీలుగా ఉంది. ఎగువ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిస్తే అనుకున్న మేరకు నీటి ప్రవాహం వచ్చే అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.