Kurnool

News January 3, 2025

జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు షేక్ ఆఫ్రిది

image

ఈనెల 5 నుంచి 12వ తేదీ వరకు గుజరాత్‌లో జరగనున్న 74వ సీనియర్ నేషనల్ బాస్కెట్ బాల్ పోటీల్లో పాల్గొనబోయే ఏపీ జట్టుకు కర్నూలు క్రీడాకారుడు షేక్ అఫ్రీద్ ఎంపికయ్యాడు. ఈ మేరకు జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షురాలు నీలిమ, కార్యదర్శి భానుప్రసాద్ తెలిపారు. షేక్ ఆఫ్రిది పశ్చిమగోదావరి జిల్లా మార్టేరులో డిసెంబర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచాడని పేర్కొన్నారు.

News January 3, 2025

ఉప వర్గీకరణ అంశంపై ఏకసభ్య కమిషన్ సభ్యుడు సమావేశం

image

షెడ్యూల్ కులాల్లోని ఉప వర్గీకరణ అంశానికి సంబంధించి ఏకసభ్య కమిషన్ సభ్యుడు రాజీవ్ రంజన్ మిశ్రా గురువారం కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ పీ.రంజిత్ భాషా హాజరయ్యారు. అనంతరం ఈ అంశంపై వ్యక్తులు, వివిధ సంస్థల నుంచి వినతిపత్రాలను రాజీవ్ రంజాన్ మిశ్రా స్వీకరించారు.

News January 2, 2025

సమష్టి కృషితో జిల్లా అభివృద్ధికి కృషి చేద్దాం: కలెక్టర్

image

2025 నూతన సంవత్సరంలో కర్నూలు జిల్లా అభివృద్ధికి మనమందరం సమష్టిగా కృషి చేద్దామని కలెక్టర్ పీ.రంజిత్ బాషా అధికారులకు పిలుపునిచ్చారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ డా.బీ.నవ్య, డీఆర్‌వో సీ.వెంకట నారాయణమ్మ, జిల్లా అధికారులు, ఇతర సిబ్బంది గురువారం కలెక్టర్‌ను కలిశారు. పూల మొక్కలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

News January 2, 2025

KNL: విద్యార్థినిపై లైబ్రేరియన్ లైంగిక వేధింపులు.. YCP ఫైర్

image

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని గురుకులంలో ఓ విద్యార్థినిపై లైబ్రేరియన్ <<15043665>>లైంగిక<<>> వేధింపులకు పాల్పడిన ఘటన నిన్న వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై వైసీపీ ఫైర్ అయింది. కూటమి ప్రభుత్వ చేతగానితనంతో ఏపీలో కామాంధులు ఇష్టారీతిన రెచ్చిపోతున్నారని ఆరోపించింది. లా అండ్ ఆర్డర్‌ను గాలికొదిలేసి కాలయాపన చేస్తున్నారా? అంటూ సీఎం CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనితను ప్రశ్నించింది.

News January 2, 2025

4 నెలలే దర్శనం.. ఈ ఆలయ చరిత్ర ఘనం!

image

సంగమేశ్వర దేవాలయం కర్నూలు <<15042913>>జిల్లాలో<<>> ప్రముఖ పుణ్యక్షేత్రం. ఆత్మకూరుకు 20 కి.మీ దూరంలో కృష్ణా నదిలో ఈ ఆలయం ఉంది. ఇది ఏడు నదులు కలిసే ప్రదేశం. తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి అనే ఏడు నదులు కలుస్తుండటంతో సంగమేశ్వరం అని పిలుస్తారు. ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శనభాగ్యం కలిగించే ఆలయం. వేల సంవత్సరాల చరిత్ర ఉండగా ఎందరో మునుల తపస్సుకు ఈ ప్రాంతం ఆశ్రయమిచ్చింది.

News January 2, 2025

ఫూటుగా పెగ్గులెత్తారు!

image

కర్నూలు జిల్లాలో మందు బాబులు కిక్కుతో 2024కు వీడ్కోలు పలికి.. 2025 సంవత్సరానికి వెల్‌కమ్ చెప్పారు. డిసెంబర్ 31న మద్యం ప్రియులు ఫూటుగా తాగడంతో జిల్లాలో రికార్డు స్థాయి మద్యం అమ్మకాలు జరిగాయి. 24 గంటల్లో ఏకంగా రూ.11.5 కోట్ల లిక్కర్ బిజినెస్ జరిగింది. కర్నూలు జిల్లాలో రూ.6.30 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.5.20 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి.

News January 2, 2025

మహిళను కాపాడిన శ్రీశైలం పోలీసులు

image

శ్రీశైలంలోని రుద్రాక్ష మఠం వద్ద నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యాలాల శ్వేతను శ్రీశైలం పోలీసులు కాపాడారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సీఐ ప్రసాదరావు తెలిపిన వివరాల మేరకు.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన శ్వేత భర్తతో గొడవపడి శ్రీశైలానికి వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడిందని అన్నారు. సమాచారం మేరకు తమ సిబ్బంది ఆమెకు చికిత్స అందించి, కుటుంబ సభ్యులకు అప్పగించారన్నారు.

News January 2, 2025

నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్‌ను కలిసిన రేషన్ డీలర్లు

image

నూతన సంవత్సరం 2025 సందర్భంగా నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ సీ.విష్ణు చరణ్, నంద్యాల ఆర్డీవోను నంద్యాల జిల్లా రేషన్ డీలర్లు కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు.  కార్యక్రమంలో నంద్యాల టౌన్ రేషన్ డీలర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మయ్య, డీలర్లు, తదితరులు పాల్గొన్నారు.

News January 1, 2025

మొన్నటి వరకు కాసులు.. ఇప్పుడు కన్నీళ్లు!

image

పత్తికొండ మార్కెట్‌లో టమాటా ధరలు భారీగా పడిపోయాయి. రెండు నెలల కిత్రం సెంచరీ కొట్టిన ధరలు ప్రస్తుతం ₹2 కూడా పలకని పరిస్థితి నెలకొంది. 25కిలోల బాక్సు కేవలం రూ.30కి అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. కూలీల ఖర్చులు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు 40 నుంచి 50 వేల ఎకరాల్లో టమాటా సాగుచేస్తారు. ప్రధానంగా పత్తికొండ, తుగ్గలి, దేవనకొండ, ఆలూరు తదితర మండలాల్లో ఈ పంట సాగు అధికం.

News January 1, 2025

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు: కలెక్టర్

image

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.