Kurnool

News January 1, 2025

వైసీపీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎస్కే గిరి

image

వైసీపీ అధ్యక్షుడు వైస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడిగా హొళగుంద మండలానికి చెందిన ఎస్‌కే గిరిని మంగళవారం నియమించారు. ఎస్‌కే గిరి మాట్లాడుతూ.. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన వైస్ జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే విరుపాక్షికి రుణపడి ఉంటానన్నారు.

News January 1, 2025

గర్భిణులకు పోషకాహారాన్ని అందించాలి: కలెక్టర్

image

100 శాతం గర్భిణులకు అనుబంధ పోషకాహారాన్ని అందించాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా ఐసీడీఎస్ పీడీని ఆదేశించారు. మంగళవారం కర్నూలు కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ అంశాలపై మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులతో ఆ శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. బాల్యవివాహాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News December 31, 2024

రెండో రోజు 197 మంది అభ్యర్థుల ఎంపిక

image

కర్నూలులోని ఏపీఎస్పీ రెండవ బెటాలియన్లో జరిగిన రెండో రోజు కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షకు 197 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు పకడ్బందీగా నిర్వహించామన్నారు. ఏదైనా సమస్యలపై, ఇతర కారణాలతో అప్పీలు చేసుకున్న అభ్యర్థులు జనవరి 28న హాజరు కాగలరని తెలిపారు.

News December 31, 2024

గ్రీటింగ్ కార్డ్స్ ❤

image

న్యూ ఇయర్ అంటే ఒకప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ సందడి. అంగట్లో ఛార్ట్ కొని శుభాకాంక్షలు చెబుతూ ఫ్రెండ్స్‌కు పంచేటప్పుడు వచ్చే ఆనందమే వేరు. కార్డులు ఇవ్వకపోతే కొత్త ఏడాది రానట్టే అని ఫీలైన వారు ఎంతమందో. ఇంట్లో మారాం చేసయినా తమకు ఇష్టమైన నటీనటుల కార్డులు కొనేవారు. రాను రాను ఆ కార్డులు కనుమరుగైపోయాయి. టెక్నాలజీ యుగంలో కంప్యూటర్ గ్రీటింగ్సే దిక్కయ్యాయి. మరి ఆ కార్డుల అనుభూతి మీరు పొందారా? కామెంట్ చేయండి..

News December 31, 2024

బొకేలు వద్దు.. పుస్తకాలు, పెన్నులతో రండి: పత్తికొండ ఎమ్మెల్యే

image

న్యూ ఇయర్ వేళ పత్తికొండ ఎమ్మెల్యే శ్యాం బాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తనను కలిసేందుకు వచ్చే కార్యకర్తలు, నాయకులు బొకేలు, పూలదండలు, శాలువాలతో రావొద్దని సూచించారు. విద్యార్థులకు ఉపయోగపడే నోట్ పుస్తకాలు, పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్స్, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే మొక్కలు తీసుకురావాలని సూచించారు. జిల్లా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సైతం తన అభిమానులకు ఇలాంటి పిలుపే ఇచ్చారు.

News December 31, 2024

కర్నూలు: ‘అక్రమ కేసులు బనాయించడం సరికాదు’

image

వెల్దుర్తి మండలం బొమ్మిడి పల్లిలో జరిగిన హత్య కేసులో ఏ సంబంధం లేని వారిపై అక్రమ కేసులు బనాయించడం సరికాదని పాణ్యం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన పలువురు వైసీపీ ముఖ్య నాయకులతో కలిసి కర్నూలు ఎస్పీ బిందు మాధవ్‌ను కలిశారు. కేవలం వైసీపీ సానుభూతిపరులన్న ఉద్దేశంతో హత్య ఘటనలో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులను ఇరికించడం సరికాదన్నారు.

News December 31, 2024

గ్రీటింగ్ కార్డ్స్ ❤

image

న్యూ ఇయర్ అంటే ఒకప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ సందడి. అంగట్లో ఛార్ట్ కొని శుభాకాంక్షలు చెబుతూ ఫ్రెండ్స్‌కు పంచేటప్పుడు వచ్చే ఆనందమే వేరు. కార్డులు ఇవ్వకపోతే కొత్త ఏడాది రానట్టే అని ఫీలైన వారు ఎంతమందో. ఇంట్లో మారాం చేసయినా తమకు ఇష్టమైన నటీనటుల కార్డులు కొనేవారు. రాను రాను ఆ కార్డులు కనుమరుగైపోయాయి. టెక్నాలజీ యుగంలో కంప్యూటర్ గ్రీటింగ్సే దిక్కయ్యాయి. మరి ఆ కార్డుల అనుభూతి మీరు పొందారా? కామెంట్ చేయండి..

News December 31, 2024

రాష్ట్ర స్థాయిలో అస్పరి మోడల్ స్కూల్ విద్యార్థి ప్రతిభ

image

విజయవాడలో సోమవారం జరిగిన రాష్ట్రస్థాయి ప్రతిభాన్వే‌‌శణ పోటీల్లో భాగంగా కౌశల్-2024 పోస్టర్ ప్రెజెంటేషన్‌లో ఆస్పరి మోడల్ స్కూల్ 9వ తరగతి విద్యార్థి పీ.మహేష్ తృతీయ స్థానంలో నిలిచాడు. మహేశ్‌కు ప్రిన్సిపల్, సిబ్బంది శుభాకాంక్షలు తెలుపారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేతుల మీదుగా బహుమతి అందుకున్నాడు.

News December 30, 2024

మత్తు పదార్థాల నిర్మూలనకు అందరూ సహకరించాలి: కలెక్టర్

image

మత్తు పదార్థాల నియంత్రణకు ప్రతి అధికారి కృషి చేయాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా అన్నారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో మత్తుపదార్థాల నియంత్రణకు సంబంధించిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని ఎస్పీ జి.బిందు మాధవ్‌తో కలిసి కలెక్టర్ నిర్వహించారు. విద్యాలయాల పరిసర ప్రాంతాల్లో మత్తుపదార్థాల ఆనవాళ్లు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News December 30, 2024

కర్నూలులో కానిస్టేబుల్ అభ్యర్థుల ఈవెంట్స్ ప్రారంభం

image

కర్నూలులోని ఏపీఎస్పీ 2వ బెటాలియన్లో కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇవాళ దేహదారుఢ్య (PMT/PET) పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు 600 మంది అభ్యర్థులకు గాను 280 మంది అభ్యర్థులు బయోమెట్రిక్‌కు హాజరైనట్లు ఎస్పీ జీ.బిందు మాధవ్ తెలిపారు. కర్నూలు జిల్లాలో నిర్వహించే ఈ పరీక్షలకు 10,143 మంది అభ్యర్థులు పాల్గొంటారని వెల్లడించారు. ఈ మేరకు PMT/PET పరీక్షల తీరును ఆయన పరిశీలించారు.