India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్నూలు కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యలు పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పీ.రంజిత్ బాషా ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, మున్సిపల్, రెవెన్యూ కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. సునయన ఆడిటోరియంలో నేరుగా బాధితులు వచ్చి తమ సమస్యలను విన్నవించుకోవచ్చు అన్నారు.
ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో వేగంగా వస్తున్న బైక్ను తప్పించబోయి ఆటో బోల్తా పడి బళ్లారికి చెందిన మహంకాళమ్మ(50) అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. తారపురం ఆంజనేయ స్వామిని దర్శించుకుని వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు.
కర్నూలు జిల్లాలో వెల్లుల్లి ధరలు ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తున్నాయి. రకాన్ని బట్టి కిలో రూ.350 -.400పైనే ధర పలుకుతోందంటూ ప్రజలు వాపోయారు. ఇతర రాష్ట్రాలలో వెల్లుల్లి దిగుబడులు భారీగా తగ్గిపోవడంతోనే రేట్లు అమాంతం పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. మొన్నటి వరకు కన్నీరు పెట్టించిన ఉల్లి.. కొంత ఉపశమనం కలిగించినా, వెల్లుల్లి ధర కన్నీరు పెట్టిస్తోంది. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి
నంద్యాల జిల్లాలో పనిచేస్తున్న 143 మంది పోలిస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఆయన మాట్లాడారు. పోలీసు సిబ్బంది విధుల పట్ల అంకితభావంతో పనిచేయాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్కు ప్రాధాన్యత, బదిలీల కౌన్సెలింగ్లో సూచనలు చేశారు. జిల్లాలో ఎవరైనా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నంద్యాల జిల్లాలో పనిచేస్తున్న 143 మంది పోలిస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఆయన మాట్లాడారు. పోలీసు సిబ్బంది విధుల పట్ల అంకితభావంతో పనిచేయాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్కు ప్రాధాన్యత, బదిలీల కౌన్సెలింగ్లో సూచనలు చేశారు. జిల్లాలో ఎవరైనా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నంద్యాల జిల్లాలో పనిచేస్తున్న 143 మంది పోలిస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఆయన మాట్లాడారు. పోలీసు సిబ్బంది విధుల పట్ల అంకితభావంతో పనిచేయాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్కు ప్రాధాన్యత, బదిలీల కౌన్సెలింగ్లో సూచనలు చేశారు. జిల్లాలో ఎవరైనా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
డిసెంబర్ 7న జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాన్ని నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఎంఈఓలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. శనివారం నంద్యాల కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ యాక్షన్ ప్లాన్పై వారికి దిశా నిర్దేశం చేశారు.
నంద్యాల జిల్లా యువకుడు ఆల్ ఇండియా ర్యాంక్తో సత్తా చాటాడు. దొర్నిపాడు మండలం రామచంద్రపురం గ్రామనికి చెందిన గడ్డిపాటి నాగరాజు కుమారుడు యశ్వంత్ కుమార్ చెన్నైలోని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నారు. ఈక్రమంలో ఆయన ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్(IES) పరీక్ష రాశారు. ఇండియాలోనే 18వ ర్యాంక్ సాధించారు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.
ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటుతో వేల మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అసెంబ్లీలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన డ్రోన్ పాలసీపై అసెంబ్లీలో ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో సుమారుగా 100 డ్రోన్ కంపెనీలు ప్రారంభించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. తద్వార అనేక మందికి ఉపాధి కల్పించవచ్చని మంత్రి తెలిపారు.
శ్రీశైల క్షేత్రంలో మళ్లికార్జున స్వామి స్పర్శదర్శనం శని, ఆది, సోమవారాల్లో నిలిపివేసినట్లు దేవస్థానం ఈవో చంద్రశేఖర్ ఆజాద్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. శని, ఆది, సోమవారాల్లో క్షేత్రానికి భక్తుల తాకిడి అధికంగా ఉండడంతో ఈ మూడు రోజుల్లో ఉచిత స్పర్శదర్శన సేవలు నిలిపివేసినట్లు చెప్పారు. తిరిగి మంగళవారం నుంచి శుక్రవారం వరకు యథావిధిగా స్పర్శ దర్శనం సేవలు కొనసాగుతాయని వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.