India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ముగ్గురు మంత్రులకు శాఖలు కేటాయించారు. బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు, గృహ నిర్మాణ శాఖ, ఎన్ఎండీ ఫరూక్కు ముస్లిం మైనార్టీ సంక్షేమం, న్యాయశాఖ, టీజీ భరత్కు పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖలు కేటాయించారు. బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్ తొలిసారి మంత్రులు కాగా.. ఫరూక్ నాలుగో సారి మంత్రి కావడం గమనార్షం.
ఆలూరు వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన విరుపాక్షి చిప్పగిరి మండల జడ్పీటీసీ పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. ఆ పత్రాన్ని కర్నూలు కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ సృజనకు అందించారు. విరుపాక్షి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో జడ్పీటీసీ ఎన్నికల్లో చిప్పగిరి మండలం నుంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఆడుదాం ఆంధ్రా, CM కప్ పేరిట అప్పటి క్రీడా శాఖ మంత్రి రోజా, శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అవకతవకలకు పాల్పడ్డారని రాష్ట్ర ఆత్యా-పాత్యా సంఘం CEO ఆర్డీ ప్రసాద్ ఆరోపించారు. ఆ రెండు కార్యక్రమాల పేరిట రూ.100 కోట్ల అక్రమాలు జరిగాయని ఆరోపించారు. వీటిపై విచారణ చేయాలని తాను CIDకి ఫిర్యాదు చేశానని చెప్పారు. స్పోర్ట్స్ కోటాలో ఇంజినీరింగ్, IIITలో అడ్మిషన్లు పొందిన వారిపైనా విచారణ చేయాలని కోరారు.
ప్రపంచ ఒలంపిక్ డే రన్ సందర్భంగా ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు క్రీడా పోటీలను కర్నూలు ఔట్డోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా ఒలంపిక్ సంఘం అధ్యక్షడు జగదీష్ కుమార్ తెలిపారు.16న టైక్వాండో, స్విమ్మింగ్, స్కేటింగ్,18న యోగా,హాకీ, ఉషు,కరాటే,చెస్,19న వాలీబాల్,టెన్నికాయిట్, సెపక్ తక్రా, షూటింగ్ బాల్,కబడ్డీ,క్యారమ్, 20న హ్యాండ్బాల్, సాప్ట్ బాల్, బాస్కెట్ బాల్ పోటీలు ఉంటాయన్నారు.
ఎమ్మిగనూరు మండలం చీరాలదొడ్డి-ఎర్రకోట సమీపంలో గురువారం రాత్రి మహారాష్ట్రకు చెందిన కంటైనర్ అతివేగంగా వస్తూ అదుపుతప్పి గుంతలోకి దూసుకెళ్లింది. స్థానికులు గమనించి వెళ్లి చూడగా.. డ్రైవర్, క్లీనర్కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంగా లారీ నడపడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు.
రాష్ట్ర శాప్ నెట్వర్క్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి ఎమ్మిగనూరుకు చెందిన వైసీపీ నేత మాచాని వెంకటేశ్ గురువారం రాజీనామా చేశారు. ఈ మేరకు శాప్ నెట్వర్క్ సీఈఓకు తన రాజీనామా పత్రాన్ని పంపారు. తనపై నమ్మకముంచి పదవి ఇచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, తనకు సహకరించిన మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
యాస్పిరేషన్ బ్లాక్లుగా ఎంపికైన చిప్పగిరి, మద్దికెర (ఈస్ట్), హోళగుంద బ్లాక్ల అభివృద్ధి అంశాలపై పురోగతి సాధించాలని నీతి ఆయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యం కలెక్టర్ సృజనకు సూచించారు. గురువారం ఢిల్లీ నుంచి నిర్వహించిన నీతి ఆయోగ్ వీడియో కాన్ఫరెన్స్లో ఆమె పాల్గొన్నారు. అభివృద్ధి అంశాలపై నీతి ఆయోగ్ సీఈవోకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ వివరించారు.
మిడుతూరు మండలం దేవనూరు గ్రామానికి చెందిన మహమ్మద్ రఫీ (35) అనే రైతు పురుగు మందు తాగి గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తనకున్న రెండు ఎకరాల పొలంతో పాటు మరో 8 ఎకరాలు కౌలుకి తీసుకొని అప్పులు చేసి పంటలు వేశారు. పంట నష్టం రావడంతో రూ.10 లక్షలు అప్పులయ్యాయి. చేసిన అప్పులు తీర్చలేమని రఫీ బాధపడేవారని.. దీంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబీకులు తెలిపారు.
తన MPTC పదవికి కర్నూలు ఎంపీ బస్తిపాడు నాగరాజు గురువారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని జిల్లా పరిషత్ సీఈఓ నర్సారెడ్డికి ఆయన అందజేశారు. 2021లో కర్నూలు మండలంలోని పంచలింగాల నుంచి MPTCగా టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2024లో MPగా టీడీపీ నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి రామయ్యపై గెలుపొందారు. దీంతో ఇప్పుడు MPగా ఉండటంతో MPTC పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు.
నంద్యాల- గిద్దలూరు నల్లమల ఘాట్ రోడ్డులోని చలమ వద్ద 12 ఏళ్ల బాలిక పాండేపై చిరుతపులి దాడి చేసిన ఘటన గురువారం జరిగింది. ఛత్తీస్గఢ్కు చెందిన కూలీల కుటుంబాలు, రైల్వే పనులు చేస్తుండగా ఒక్కసారిగా చిరుత బాలికపై దాడి చేసిందని సాటి కూలీలు తెలిపారు. వారందరూ కేకలు వేయడంతో చిరుత పులి అక్కడనుంచి పారిపోయిందన్నారు. గాయపడిన బాలికను రైల్వే అధికారులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.