India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నంద్యాలకు చెందిన చిత్రకారుడు చింతలపల్లె కోటేశ్ రావి ఆకుపై శివుడి రూపాన్ని అద్భుతంగా చిత్రీకరించాడు. ఆయన మాట్లాడుతూ.. కార్తీక మాసంలో ఈ చిత్రం కార్తీక శోభను సంతరించుకుందని తెలిపారు. ఆకుపై ఒక క్రమ పద్ధతిలో బ్లేడు సహాయంతో చిత్రాన్ని రూపొందించానని తెలిపారు. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ శివ ఆరాధన చేయాలని కోరారు.
కర్నూలు.. ఆంధ్ర రాష్ట్రానికి తొలి రాజధాని. 1953 అక్టోబరు 1 నుంచి 1956 అక్టోబరు 31 వరకు రాజధానిగా కొనసాగింది. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావడంతో HYDను రాజధానిని చేశారు. దీంతో కర్నూలుకు నిరాశ ఎదురైంది. 8 జిల్లాలు, 1.59 కోట్ల మంది జనాభా ఉన్న సీమకు ఏళ్లుగా అన్యాయం జరుగుతోందన్న భావన ప్రజల్లో ఉంది. తాజాగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో హర్షం వ్యక్తమవుతోంది.
కర్నూలు జిల్లాలోని నీటి ప్రాజెక్టుల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని సీఎం నారా చంద్రబాబునాయుడును జిల్లా ఎమ్మెల్యేలు కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు. సాగు, తాగునీటి అవసరాలు తీర్చడానికి కట్టుబడి ఉన్నామని సీఎం హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
పల్లె పండుగ-పంచాయతీ వారోత్సవాలలో శంకుస్థాపన చేసి ప్రారంభించిన సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి పంచాయతీరాజ్ ఇంజినీర్లను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్లు 35 సంవత్సరాల పాటు మన్నికగా ఉండేలా చొరవ తీసుకోవాలని అన్నారు. నంద్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వచ్చే వారానికి 250 సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు.
కర్నూలు జిల్లాలోని నీటి ప్రాజెక్టుల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని సీఎం నారా చంద్రబాబునాయుడును జిల్లా ఎమ్మెల్యేలు కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు. సాగు, తాగునీటి అవసరాలు తీర్చడానికి కట్టుబడి ఉన్నామని సీఎం హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
కర్నూలు జిల్లాలోని నీటి ప్రాజెక్టుల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని సీఎం నారా చంద్రబాబునాయుడును జిల్లా ఎమ్మెల్యేలు కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు. సాగు, తాగునీటి అవసరాలు తీర్చడానికి కట్టుబడి ఉన్నామని సీఎం హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల మహా క్షేత్రంలో గురువారం కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆకాశదీపం వెలిగించారు. కార్తీక మాసంలో ప్రతిరోజూ ఆలయంలో ఆకాశ దీపానికి వేద పండితులు పూజలు నిర్వహించి ధ్వజస్తంభానికి ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా అర్చకులు పూజ నిర్వహించి కార్తీకదీపం ఏర్పాటు చేశారు.
టీడీపీ శాసనమండలి ఉపనాయకుడు బీటీ నాయుడు మండలి సమావేశం సందర్భంగా గురువారం శాసనమండలిలో ప్యానల్ స్పీకర్గా వ్యవహరించారు. సభను సజావుగా నడిపించారు. ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్కి ఆయన ధన్యవాదాలు తెలిపారు. శాసనమండలిలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రజా సమస్యలపై మండలిలో పోరాటం చేశామన్నారు. బీటీ నాయుడు మండలి సమావేశంలో హుందాగా సభను నిర్వహించి సభ్యుల మన్ననలు పొందారు.
శ్రీశైల క్షేత్రంలో శుక్రవారం నుంచి భక్తులకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తున్నట్లు దేవస్థానం ఈవో చంద్రశేఖర ఆజాద్ గురువారం తెలిపారు. శుక్రవారం నుంచి సోమవారం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గణేశ్ సదన్ నుంచి క్యూ కాంప్లెక్స్ వరకు ప్రతి అరగంటకు బస్సులను భక్తులకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
కర్నూలు జిల్లాలోని 21 కేసుల్లో దొంగలించిన సొత్తును ఆదోని ఒకటో పట్టణ పోలీసులు రికవరీ చేసి 13 మందిని అరెస్టు చేశారని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. రూ.24 లక్షల విలువ గల బైక్లను ఇదివరకే రికవరీ చేశారన్నారు. ఈరోజు రూ.41 లక్షల ప్రాపర్టీ రికవరీ చేయడంలో ఆదోని సబ్ డివిజన్ పోలీసులు బాగా పని చేశారన్నారు. ఆదోని డీఎస్పీ సోమన్న, సీఐ శ్రీరామ్, సిబ్బందిని అభినందించారు.
Sorry, no posts matched your criteria.