India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ శాఖలో గత ప్రభుత్వ హయాంలో నియమితులైన కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను మానవతా దృక్పథంతో కొనసాగించేందుకు కృషి చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఆ శాఖ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ పీ.రామచంద్ర రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విజయవాడలో మంత్రిని కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు రామచంద్రరావు తెలిపారు.
రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ పదవికి బేతంచెర్లకు చెందిన వైసీపీ నేత ముర్తుజా వలి గురువారం రాజీనామా చేశారు. 2023 జూన్లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తోడ్పాటుతో ఈ పదవిని చేపట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పదవికి రాజీనామా చేసినట్లు ముర్తుజా వలి వెల్లడించారు. తనకు పదవి రావడానికి సహకరించిన మాజీ మంత్రి బుగ్గనకు ధన్యవాదాలు తెలిపారు.
ఏప్రిల్ 24వ తేదీన వేసవి సెలవుల కారణంగా మూతబడిన పాఠశాలలు గురువారం బడిగంట మోగడంతో పున.. ప్రారంభమయ్యాయి. నేటి ఉదయం 8:30 నిమిషాలకే విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ముస్తాబు చేసి బడులకు పంపారు. మరోవైపు జిల్లా విద్యాశాఖ అధికారులు బడి ప్రారంభం నాటి నుంచే విద్యా కానుక కిట్లను పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఆదోని మండలం ఢనాపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీనివాసులు బుధవారం గుండెపోటుతో మృతిచెందారు. ఆస్పరి మండలం చిన్నహోతూరుకు చెందిన ఈయన 1997లో హాలహర్వి మండలం నిట్రవట్టి ప్రాథమిక పాఠశాలలో ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆలూరు, హోళగుంద మండలాల్లో పనిచేసి ప్రస్తుతం ఢనాపురంలో హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన మృతికి ఆదోని యూటీఎఫ్ శాఖ నాయకులు, ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు.
సీఎం చంద్రబాబు కేబినెట్లో ఉమ్మడి కర్నూలు జిల్లాకు 3 మంత్రి పదవులు దక్కిన సంగతి తెలిసిందే. కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్, నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండీ ఫరూక్, బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి నిన్న మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారికి శాఖలు కేటాయించాల్సి ఉంది. YCP ప్రభుత్వంలో ఇద్దరే మంత్రులుగా చేశారు. ఆర్థిక మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్, కార్మిక శాఖ మంత్రిగా గుమ్మనూరు జయరాం పనిచేశారు.
మహానంది మండలం సీతారామపురం సమీపంలో బుధవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ మహిళ మృతిచెందింది. నాగులు అనే మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలతో స్కూటర్పై నంద్యాల వైపు నుంచి, గాజులపల్లె వైపు వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. నాగులు అక్కడికక్కడే మృతిచెందగా.. భర్త బాబు, పిల్లలకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఉమ్మడి జిల్లా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతానని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ‘ఉన్నతాధికారులతో సమావేశమై ఏ ప్రాజెక్టులను ముందుగా చేపడితే మంచిదన్న అంశాలను సమీక్షిస్తా. ఏ ప్రాజెక్టులతో ఎక్కువ మందికి ప్రయోజనం?, ఏవి వేగంగా పూర్తవుతాయి, జిల్లాకు మేలు చేసే ప్రాజెక్టులు ఏమిటి? పెండింగ్లోని ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి? తదితర విషయాలను విశ్లేషించి నిర్ణయం తీసుకుంటా’ అన్నారు.
ఎన్ఎండీ ఫరూక్ నాలుగోసారి మంత్రి పదవిని దక్కించుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఉమ్మడి జిల్లాలో రహదారులు దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. వాటి మరమ్మతులకు ప్రాధాన్యం ఇస్తా. తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా. కర్నూలు నుంచి నంద్యాలకు నూతన రైల్వే లైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటా. పలు పరిశ్రమలు రావడానికి కృషి చేస్తా’ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులతో ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్షించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, NMD ఫరూఖ్, టీజీ భరత్ పాల్గొన్నారు. కాగా రేపటిలోగా నూతన మంత్రులకు శాఖలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఏ శాఖ వరిస్తుందోనని ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులతో ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్షించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, NMD ఫరూఖ్, టీజీ భరత్ పాల్గొన్నారు. కాగా రేపటిలోగా నూతన మంత్రులకు శాఖలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఏ శాఖ వరిస్తుందోనని ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.
Sorry, no posts matched your criteria.