Kurnool

News December 27, 2024

శ్రీశైలంలో కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు

image

తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యం ఇవ్వాలని ఆ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కోరారు. శ్రీశైల మల్లన్న దర్శనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ సిఫార్సు లేఖలను తిరుమలలో యాక్సెప్ట్ చేయాలి. భక్తుల విన్నపాలపై ఏపీ ప్రభుత్వం మా విజ్ఞప్తిని పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం. TTD తరఫున తెలంగాణలో ధర్మప్రచారానికి నిధులు ఇవ్వాలి. గత ప్రభుత్వ విధానాలను ఈ ప్రభుత్వం అమలు చేయాలని కోరుతున్నాం’ అని సురేఖ కోరారు.

News December 27, 2024

కర్నూలు జిల్లాతో మన్మోహన్‌కు అనుబంధం

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కర్నూలు జిల్లాతో అనుబంధం ఉంది. జులై 1, 2004న ఆయన జిల్లాలో పర్యటించారు. ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లి గ్రామంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి ఆయన బాధితులకు అండగా నిలిచారు. అలాగే మన్మోహన్ సింగ్ క్యాబినెట్‌లో కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి రైల్వేశాఖ సహాయ మంత్రిగా సేవలందించారు.

News December 27, 2024

టీజీ భరత్ కుమార్తె పెళ్లిలో చిరంజీవి, బాలకృష్ణ

image

మంత్రి టీజీ భరత్ కుమార్తె ఆర్యపాన్య వివాహ వేడుక హైదరాబాదులోని GMR అరేనలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి, హీరో బాలకృష్ణ హాజరై సందడి చేశారు. నూతన వధూవరులు ఆర్యాపాన్య, వెంకట నలిన్‌ను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జిల్లా మంత్రి ఫరూక్, పలువురు ఎమ్మెల్యేలు బాలయ్యతో ముచ్చటించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితర ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.

News December 26, 2024

మంత్రి భరత్ కుమార్తె పెళ్లిలో సీఎం చంద్రబాబు

image

మంత్రి టీజీ భరత్ కుమార్తె వివాహానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. హైదరాబాదులోని GMR అరేనలో జరిగిన ఈ వేడుకకు హాజరై వధూవరులు ఆర్యాపాన్య, వెంకట నలిన్‌ను ఆశీర్వదించారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

News December 26, 2024

శ్రీశైలానికి మంత్రి కొండా సురేఖ రాక

image

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రానికి నేడు తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ రానున్నట్లు దేవస్థానం ప్రజా సంబంధాల అధికారి తెలిపారు. రాత్రి 7 గంటలకు మంత్రి శ్రీశైలం చేరుకుంటారని చెప్పారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు.

News December 26, 2024

శిరివెళ్ళ: రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

image

శిరివెళ్ళ మండలంలోని ఎర్రగుంట్ల గ్రామం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆళ్లగడ్డ పట్టణంలోని పద్మనాభ రావువీధికి చెందిన కళ్యాణ్(25) అనే ఇంజినీరింగ్ విద్యార్థి మరణించాడు. నంద్యాలలోని ఏవిఆర్ కళాశాలలో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న అతడు బైక్‌పై కాలేజీకి వెళ్తుండగా కడప నుంచి హైదరాబాద్ వెళుతున్న తెలంగాణకు చెందిన కారు ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.

News December 26, 2024

శ్రీశైలంలో 112.7 TMCల నీరు నిల్వ

image

శ్రీశైల డ్యాం బ్యాక్ వాటర్ ద్వారా గడిచిన 24 గంటల వ్యవధిలో 6,366 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తెలంగాణ పరిధిలోని విద్యుత్ కేంద్రానికి 241, హెచ్ఎన్ఎస్ఎస్‌కు 1,590, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2,400, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. డ్యాంలో 862.20 అడుగుల్లో 112.7164 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

News December 26, 2024

కర్నూలు: రైలు నుంచి పడిపోయిన యువతి

image

కర్నూలు జిల్లా యువతి రైలు నుంచి జారిపడిపోయింది. దేవనకొండ(M) కరివేములకు చెందిన హరిత తమ్ముడితో కలిసి గుత్తికి రైల్లో బయల్దేరింది. మార్గమధ్యలో బాత్‌రూముకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. తమ్ముడు ధర్మవరం పోలీసులకు సమాచారం అందించాడు. హరిత ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమెను బత్తలపల్లి మండలం డి.చెర్లోపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోంది.

News December 26, 2024

నేడు కర్నూలు, నంద్యాల జిల్లాలకు వర్ష సూచన

image

బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర అల్పపీడనం 24 గంటల్లో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రభావంతో కర్నూలు, నంద్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని APSDMA సూచించింది.

News December 25, 2024

శిల్పా రవిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్

image

నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. తన స్నేహితుడు అల్లు అర్జున్ కష్టాల్లో ఉంటే కనీసం కనిపించకపోవడం ఏంటని బన్నీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అరెస్ట్ అయిన సమయంలోనూ స్పందించలేదని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. మరోవైపు వీటికి శిల్ప అనుచరులు కౌంటర్ ఇస్తున్నారు. అందులో వాస్తవం లేదని కామెంట్ చేస్తున్నారు.